నిన్న ‘అదానీ’పై.. నేడు వేదాంతపై.. OCCRP తీవ్ర ఆరోపణలు!
Vedanta: సొంత షేర్లలో అదానీ కుటుంబం అజ్ఞాత పెట్టుబడులు పెట్టి భారీగా లబ్ధి పొందినట్లు ఆరోపించిన ఓసీసీఆర్పీ... తాజాగా వేదాంతపై తీవ్ర ఆరోపణలు చేసింది.
దిల్లీ: అదానీ గ్రూప్పై తీవ్ర ఆరోపణలు చేసిన ‘ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్’ (OCCRP).. తాజాగా మరో భారత కంపెనీపైనా విరుచుకుపడింది. ఈసారి మైనింగ్ దిగ్గజం వేదాంత (Vedanta)ను లక్ష్యంగా చేసుకొని ఆరోపణలు గుప్పించింది. కరోనా విజృంభిస్తున్న సమయాన్ని ఆసరాగా తీసుకొని వేదాంత (Vedanta) రహస్యంగా నిబంధనలకు తూట్లు పొడిచేందుకు యత్నించినట్లు పేర్కొంది. మహమ్మారి మాటున పర్యావరణ నిబంధనలను సడలించేలా రహస్య లాబీయింగ్ నిర్వహించినట్లు ఆరోపించింది.
వేదాంత (Vedanta) ప్రతిపాదించిన మార్పులను భారత ప్రభుత్వం ఆమోదించినట్లు ఓసీసీఆర్పీ (OCCRP) ఎలాంటి ఆధారాలను బయటపెట్టకుండానే ఆరోపించింది. అక్రమ పద్ధతుల ద్వారా వాటిని అమలు కూడా చేసినట్లు తెలిపింది. కొత్తగా ఎలాంటి పర్యావరణ అనుమతులు లేకుండా మైనింగ్ కంపెనీలు తమ ఉత్పత్తిని 50 శాతం పెంచుకునేలా వేదాంత రహస్యంగా లాబీయింగ్ నడిపినట్లు పేర్కొంది.
సొంత షేర్లలో అదానీ కుటుంబం అజ్ఞాత పెట్టుబడులు
మరోవైపు వేదాంత (Vedanta) చమురు వ్యాపారం కెయిర్న్ ఇండియా.. ప్రభుత్వ వేలంలో పొందిన చమురు బ్లాక్లలో అన్వేషణాత్మక డ్రిల్లింగ్ కోసం పబ్లిక్ హియరింగ్లను రద్దు చేయడానికి విజయవంతంగా లాబీయింగ్ చేసినట్లు ఓసీసీఆర్పీ (OCCRP) ఆరోపించింది. అప్పటి నుంచి స్థానికంగా వ్యతిరేకత ఉన్నప్పటికీ.. రాజస్థాన్లో ఆరు వివాదాస్పద ఆయిల్ ప్రాజెక్టులు కెయిర్న్కు లభించినట్లు పేర్కొంది. ఈ ఆరోపణలపై ఇప్పటి వరకు వేదాంత అధికారికంగా స్పందించలేదు.
2013 నుంచి 2018 వరకు అదానీ గ్రూపు కంపెనీల షేర్ల విలువలను గణనీయంగా పెంచారని ఓసీసీఆర్పీ గురువారం విడుదల చేసిన ఓ నివేదికలో ఆరోపించిన విషయం తెలిసిందే. అందుకోసం మారిషస్కు చెందిన ‘అజ్ఞాత’ పెట్టుబడి సంస్థలను ఉపయోగించి అదానీ సంబంధీకులు రహస్యంగా రూ.లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు ఓసీసీఆర్పీ తెలిపింది. అయితే వీటిని అదానీ గ్రూప్ తీవ్రంగా ఖండించింది. జార్జ్ సోరోస్ నిధులతో నడుస్తున్న కొన్ని ఫండ్లు విదేశీ మీడియాలోని ఓ విభాగం మద్దతుతో చేసిన మరో కుట్రగా దీనిని అభివర్ణించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్న్యూస్.. ఆగస్టు నుంచి 4జీ సేవలు
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు త్వరలో 4జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. -
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్కు బెయిల్
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్కు రెండు నెలల తాత్కాలిక బెయిల్ మంజూరైంది. -
రోజంతా ఒడుదొడుకుల్లో.. చివరికి ఫ్లాట్గా ముగిసిన సూచీలు
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 17 పాయింట్ల లాభంతో నిఫ్టీ 33.15 పాయింట్ల నష్టంతో ముగిశాయి. -
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
Indegene IPO: రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఇండీజీన్ ఐపీఓ ప్రారంభమైంది. మదుపర్లు రూ.14,916తో కనీసం 33 షేర్లకు (ఒక లాట్) బిడ్లు దాఖలు చేయాలి. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 74,000 ఎగువన సెన్సెక్స్
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 202 పాయింట్ల లాభంతో 74,080 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు పుంజుకొని 22,511 దగ్గర కొనసాగుతోంది. -
లేని సీట్లు అమ్మి.. రూ.550 కోట్ల ఫైన్ కట్టి.. ఓ విమానయాన సంస్థ నిర్వాకం!
Qantas: కాంటాస్ అనే ఆస్ట్రేలియా విమానయాన సంస్థ క్యాన్సిల్ అయిన విమానాల్లోని సీట్లను విక్రయించింది. దీన్ని తీవ్రంగా తప్పుబట్టిన అక్కడి నియంత్రణా సంస్థ రూ.550 కోట్ల జరిమానా విధించింది. -
3 ఐపీఓలు.. రూ.6,400 కోట్ల లక్ష్యం
ఈ వారం మూడు కంపెనీల తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)లు మార్కెట్లో సందడి చేయనున్నాయి. రూ.6,400 కోట్ల సమీకరించే లక్ష్యంతో ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, ఇండీజీన్, టీబీఓ టెక్ ఐపీఓలు వస్తున్నాయి. -
లాభాలకే అవకాశం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత శుక్రవారం సూచీలు భారీగా నష్టపోయినా, అది తాత్కాలికమేనని.. సూచీలు అధిక స్థాయులకు చేరాయనే భావనతో, లాభాల స్వీకరణకు దిగడం వల్లే ఆ పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
పసిడిలో లాభాల స్వీకరణ!
పసిడి ఇటీవల రూ.73,925 వద్ద గరిష్ఠాన్ని తాకిన తర్వాత లాభాల స్వీకరణ కనిపిస్తోంది. ఇదే ధోరణి కొనసాగితే జూన్ కాంట్రాక్టు ఈ వారం రూ.69,418 వరకు పడిపోవచ్చు. -
75,100 పైన మరిన్ని సానుకూలతలు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో గత వారం సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. దేశీయ కంపెనీల త్రైమాసిక ఫలితాలు, ముడిచమురు ధరలు చల్లపడటం కలిసొచ్చాయి. -
పురుగు మందుల అవశేషాలపై భారత్లో కఠిన నిబంధనలు: ప్రభుత్వం
ఆహార పదార్థాల్లో పురుగు మందుల అవశేషాల విషయంలో.. భారత్ అత్యంత కఠినమైన నిబంధనలను కలిగి ఉందని ప్రభుత్వం ఆదివారం పునరుద్ఘాటించింది. -
గృహ రుణ బకాయిలు పెరిగాయ్: ఆర్బీఐ
గృహ నిర్మాణ రంగానికి బకాయిపడిన రుణాలు గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో సుమారు రూ.10 లక్షల కోట్లు పెరిగి ఈ ఏడాది మార్చి నాటికి రికార్డు స్థాయిలో రూ.27.23 లక్షల కోట్లకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన డేటా వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
-
ఇరాన్లో వేధింపులు తట్టుకోలేక.. పడవతో సహా భారత్కు చేరుకొన్న మత్స్యకారులు..!
-
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్న్యూస్.. ఆగస్టు నుంచి 4జీ సేవలు
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
-
రఫాపై ఇజ్రాయెల్ దండయాత్ర.. దాడులు మొదలుపెట్టిన సైన్యం!
-
నన్ను గదిలో బంధించి దాడి చేశారు: రాధికా ఖేడా తీవ్ర ఆరోపణలు