సొంత షేర్లలో అదానీ కుటుంబం అజ్ఞాత పెట్టుబడులు
అదానీ గ్రూపునకు మళ్లీ ఆరోపణల సెగ తాకింది. ప్రమోటరు కుటుంబానికి చెందిన సంబంధీకులపై ఈ కొత్త ఆరోపణలు వచ్చాయి.
2013- 2018 మధ్య షేర్ల విలువలు పెంచేందుకే
ఓసీసీఆర్పీ ఆరోపణలు
తీవ్రంగా ఖండించిన గ్రూప్
దిల్లీ: అదానీ గ్రూపునకు మళ్లీ ఆరోపణల సెగ తాకింది. ప్రమోటరు కుటుంబానికి చెందిన సంబంధీకులపై ఈ కొత్త ఆరోపణలు వచ్చాయి. 2013 నుంచి 2018 వరకు అదానీ గ్రూపు కంపెనీల షేర్ల విలువలను గణనీయంగా పెంచేందుకు మారిషస్కు చెందిన ‘అజ్ఞాత’ పెట్టుబడి సంస్థలను ఉపయోగించి వీళ్లు రహస్యంగా లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (ఓసీసీఆర్పీ) ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ తీవ్రంగా ఖండించింది.
ప్రమోటరు కుటుంబ భాగస్వాములు నిర్వహిస్తున్న మారిషస్కు చెందిన రెండు పెట్టుబడి ఫండ్లు ఈ రహస్య పెట్టుబడుల ప్రక్రియను నిర్వహించాయంటూ తనకు లభించిన పత్రాల్లోని వివరాలను ఉటంకిస్తూ ఓసీసీఆర్పీ వెల్లడించింది. 2013- 2018 సమయంలో అదానీ గ్రూపులోని నమోదిత కంపెనీల షేర్లు గణనీయంగా పెరగడంతో పాటు అత్యంత శక్తివంతమైన వ్యాపార సామ్రాజ్యంగా అవతరించిన సంగతి తెలిసిందే. మారిషస్ ఆధారిత ఫండ్లు నిర్వహించిన ఈ పెట్టుబడుల ప్రక్రియ వల్ల అదానీ గ్రూపు ఛైర్మన్ గౌతమ్ అదానీ సోదరుడైన వినోద్ అదానీకు సన్నిహితులైన ఇద్దరు బాగా లబ్ధి పొందినట్లు ఓసీసీఆర్పీ పేర్కొంది.
వీరిద్దరూ కీలకం..
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన నాజర్ అలీ షాబాన్ అహ్లి, తైవాన్కు చెందిన ఛాంగ్ చుంగ్ లింగ్లు కొన్ని సంవత్సరాల పాటు రెండు మారిషస్ ఫండ్లను ఉపయోగించి అదానీ గ్రూపు షేర్లలో భారీ ట్రేడింగ్ నిర్వహించారు. వినోద్ అదానీకి సన్నిహిత ఉద్యోగికి చెందిన దుబాయ్ కేంద్రంగా పనిచేసే ఓ కంపెనీ ఈ రెండు ఫండ్లను పర్యవేక్షించేది. అదానీ గ్రూపు స్టాక్ మార్కెట్లో అనుమానిత ట్రేడింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తోందంటూ 2014 ప్రారంభంలో సెబీ ఓ ఆధార పత్రాన్ని బహిర్గతపర్చిన విషయాన్ని కూడా ఓసీసీఆర్పీ గుర్తుచేసింది. 2014లో సెబీకి ఛైర్మన్గా ఉన్న యు.కె.సిన్హా.. ప్రస్తుతం అదానీకి చెందిన వార్తా సంస్థల బ్రాడ్కాస్టర్ ఎన్డీటీవీకి డైరెక్టరు, మేనేజింగ్ డైరెక్టరుగా ఉన్నారు.
ఇవీ ప్రధాన ఆరోపణలు..
- ఛాంగ్, అహ్లిలు పెట్టిన పెట్టుబడుల ద్వారా షేర్లలో అవకతవకలకు పాల్పడ్డారా అనే సందేహాలు కల్గుతున్నాయి. అలాగే వాళ్ల నియంత్రణలోని ఫండ్లను ప్రమోటరు గ్రూపుగా వర్గీకరించారా అనే ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి. ఇవ్వన్నీ నమోదు నిబంధనల ఉల్లంఘనలకు దారి తీసేవే.
- ఒకవేళ అహ్లి, ఛాంగ్లు అదానీ ప్రమోటర్లు తరపున వ్యవహరించారని భావిస్తే.. అదానీ గ్రూపులోని వారి వాటాలను కలిపితే మొత్తంగా ఇన్సైడర్లకే 75 శాతానికి పైగా వాటా ఉన్నట్లు అవుతుంది. ఇది భారత లిస్టింగ్ చట్టంలోని నిబంధనలకు విరుద్ధం.
- వినోద్ అదానీని అదానీ గ్రూపు ఇటీవలే ప్రమోటరుగా గుర్తించింది. అందువల్ల ఆయన నియంత్రణలోని వాటాలు కూడా ప్రమోటర్ గ్రూపు పెట్టుబడులుగా వర్గీకరించాల్సి ఉంటుంది.
- చాంగ్, అహ్లిలు పెట్టిన పెట్టుబడులకు సంబంధించిన నిధులు అదానీ కుటుంబం నుంచి వచ్చినట్లుగా ఎటువంటి ఆధారాల్లేవు. అయితే అదానీ కుటుంబం సమన్వయంతోనే అదానీ గ్రూపు కంపెనీల షేర్లలో వాళ్లు ట్రేడింగ్ నిర్వహించినట్లుగా ఆధారాలు ఉన్నట్లు మా దర్యాప్తులో వెల్లడైందని ఓసీసీఆర్పీ పేర్కొంది.
అవి హిండెన్బర్గ్ అసత్య ఆరోపణల్లాంటివే: అదానీ గ్రూపు
ఓసీసీఆర్పీ ఆరోపణలు నిరాధారమైనవని అదానీ గ్రూపు స్పష్టం చేసింది. జార్జ్ సోరోస్ నిధులతో నడుస్తున్న కొన్ని ఫండ్లు విదేశీ మీడియాలోని ఓ విభాగం మద్దతుతో చేసిన మరో కుట్రగా దీనిని అభివర్ణించింది. దశాబ్దక్రితం ముగిసిపోయిన కేసుల ఆధారంగా చేసిన ఆరోపణలు అని వీటిని తెలిపింది. ఓవర్ వ్యాల్యూయేషన్ జరగలేదని, లావాదేవీలన్నీ చట్టాలకు అనుగుణంగానే జరిగాయని ఇప్పటికే తమకు అనుకూలంగా తీర్పులు వచ్చాయని గుర్తు చేసింది. ఓవర్ వ్యాల్యూయేషన్ జరగలేదని తేలినప్పుడు.. నిధుల బదిలీ ఆరోపణలకు యోగ్యత ఎలా ఉంటుందని ప్రశ్నించింది. పైగా ఓసీసీఆర్పీ చేసిన ఆరోపణలు హిండెన్బర్గ్ నివేదికకు మారురూపంగా కనిపిస్తున్నాయని తెలిపింది. అందువల్ల వీటిని నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నట్లు తెలిపింది.
అదానీ షేర్లు కుదేల్: ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్ ప్లాట్ఫామ్ ఓసీసీఆర్పీ ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూప్ షేర్లు కుదేలయ్యాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ 4.39%, అదానీ ఎంటర్ప్రైజెస్ 3.77%, అంబుజా సిమెంట్స్ 3.53%, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 3.52%, అదానీ పోర్ట్స్ 3.37%, అదానీ టోటల్ గ్యాస్ 2.59%, అదానీ విల్మర్ 2.56%, అదానీ పవర్ 2.24%, ఎన్డీటీవీ 2.21% చొప్పున నష్టాలు నమోదుచేశాయి. ఏసీసీ మాత్రమే 0.47% పెరిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎటు చూసినా ఏఐ...
మనదేశంలో ఏఐ (కృత్రిమ మేధ) వినియోగం శరవేగంగా పెరుగుతోంది. కార్యాలయాల్లో అధిక శాతం ఉద్యోగులు ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సమర్థంగా సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
ఎఫ్అండ్ఓపై ఎందుకింత మోజు..?
దేశంలో పొదుపు మొత్తాలు ఎఫ్అండ్ఓ (ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్) ట్రేడ్లోకి వెళ్తున్నాయని, దీనిపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోందని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారుడు వి.అనంత నాగేశ్వరన్ అన్నారు. -
మన సమాచారం సురక్షితమేనా?
దేశంలో డిజిటల్ ఆర్థిక లావాదేవీలు విపరీతంగా పెరుగుతున్నాయి. అదే సమయంలో సైబర్ నేరాల సంఖ్యా అధికమవుతోంది. వీటిని నివారించేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎప్పటికప్పుడు తమ వివరాల్లో మార్పులేమైనా ఉంటే సమర్పించాలని ఖాతాదారులను కోరుతున్నాయి. -
ఐసీఐసీఐ మాజీ ఛైర్మన్ వాఘుల్ కన్నుమూత
ప్రభుత్వ రంగంలోని ఐసీసీఐని ప్రైవేటు సంస్థగా మార్చడంలో కీలక పాత్ర పోషించిన నారాయణ్ వాఘుల్ (88) ఆరోగ్య సమస్యలతో శనివారం చెన్నైలోని ఒక ఆసుపత్రిలో మరణించారు. బ్యాంకింగ్ పరిశ్రమలో ఆయన ప్రస్థానం 1960లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రారంభమైంది. -
ఓయో ఐపీఓ దరఖాస్తు ఉపసంహరణ!
తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) కోసం సెబీకి సమర్పించిన దరఖాస్తును ఓయో ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కంపెనీ రీఫైనాన్సింగ్ ప్రణాళికను ఖరారు చేసే పనిలో ఉందని.. ఈ ప్రక్రియ పూర్తయ్యాక తిరిగి ఐపీఓకు దరఖాస్తు చేసే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
ఆభరణాల దిగుమతులు భారీగా పెరిగాయ్
ఈ ఏడాది ఏప్రిల్లో దేశంలోకి పసిడి ఆభరణాల దిగుమతులు భారీగా పెరిగి రూ.2225 కోట్ల (268.04 మిలియన్ డాలర్ల) స్థాయికి చేరాయని జెమ్ అండ్ జువెలరీ ఎగుమతుల ప్రోత్సాహక మండలి తెలిపింది. 2023 ఏప్రిల్లో ఇవి సుమారుగా రూ.267 కోట్ల (32.12 మిలియన్ డాలర్ల) స్థాయిలోనే ఉన్నాయి. -
చైనా ఈవీలు, లోహాలపై దిగుమతి సుంకాల పెంపు
చైనాలో తయారయ్యే విద్యుత్ వాహనాలు (ఈవీ), అత్యాధునిక బ్యాటరీలు, సోలార్ సెల్స్, వైద్య సామగ్రితో పాటు అక్కడ నుంచి దిగుమతి అయ్యే ఉక్కు, అల్యూమినియంపై కొత్త టారిఫ్లు విధిస్తామని బైడెన్ ప్రభుత్వం ప్రకటించింది. -
ప్రత్యేక ట్రేడింగ్లో స్వల్ప లాభాలు
విదేశీ మదుపర్ల కొనుగోళ్ల మద్దతుతో ప్రత్యేక ట్రేడింగ్ సెషన్లో సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. ప్రాథమిక సైట్లో వైఫల్యం తలెత్తినా ఎదుర్కొనేందుకు వాటి సంసిద్ధతను తనిఖీ చేయడానికి బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు ఈ ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ను శనివారం రెండు దఫాలుగా నిర్వహించాయి. -
వ్యవసాయ అంకురాలు దూసుకెళ్తున్నాయ్
అనుకూల వ్యాపార విధానాలు, ప్రభుత్వ మద్దతు కారణంగా గత తొమ్మిదేళ్లలో వ్యవసాయ - అనుబంధ రంగాల్లో అంకురాల సంఖ్య దాదాపు 7,000కు పైగా పెరిగిందని అఖిల భారత రైతు సంఘాల సమాఖ్య (ఫైఫా) వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు
దొడ్ల డెయిరీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.787.4 కోట్ల ఆదాయం, రూ.46.8 కోట్ల నికర లాభం, రూ.7.79 ఈపీఎస్ నమోదు చేసింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం రూ.724.3 కోట్లు, నికరలాభం రూ.22.5 కోట్లు, ఈపీఎస్ రూ.3.76 ఉన్నాయి. -
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్
Tecno: టెక్నో కెమన్ సిరీస్లో రెండు కొత్త మొబైల్స్ను లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్ల విషయాలపై ఓ లుక్కేద్దాం..
తాజా వార్తలు (Latest News)
-
ఆర్ఆర్ఆర్ అటవీ భూసేకరణ మళ్లీ మొదటికి..!
-
ధోనీని ఔట్ చేయడమే టర్నింగ్ పాయింట్.. యశ్కే ఈ అవార్డు: డుప్లెసిస్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
మార్కెట్ కేంద్రంగా మొబైల్ దొంగతనాలు.. పిల్లలైతే అనుమానించరని..!
-
చాట్ జీపీటీ కంటే మెరుగైన తెలుగు సాఫ్ట్వేర్ తీసుకొస్తాం
-
ఏపీ ఎన్నికల్లో విజయంపై రూ.1.75 కోట్ల పందెం