Xiaomi 14: షావోమీ నుంచి రెండు ఫ్లాగ్షిప్ ఫోన్లు.. ధర, ఫీచర్లు ఇవే!
షావోమీ 14 (Xiaomi 14), షావోమీ 14 అల్ట్రా (Xiaomi 14 Ultra) పేరుతో రెండు ఫోన్లను తీసుకొచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ షావోమీ (Xiaomi) రెండు ఫ్లాగ్షిప్ ఫోన్లను భారత్లో లాంచ్ చేసింది. షావోమీ 14 (Xiaomi 14), షావోమీ 14 అల్ట్రా (Xiaomi 14 Ultra) పేరుతో రెండు ఫోన్లను తీసుకొచ్చింది. కేవలం షావోమీ 14 ఫోన్ను మాత్రమే భారత్కు తీసుకొస్తారని ప్రచారం జరిగింది. అయితే, 14తో పాటు అల్ట్రాను కూడా లాంచ్ చేసి టెక్ ప్రియులను షావోమీ సర్ప్రైజ్ చేసింది. కెమెరాలు, లెన్సులు తయారుచేసే జర్మన్ కంపెనీ లైకాతో (Leica)తో కలిసి ఈ ఫోన్లను తీసుకొచ్చింది. మరి ఈ ఫోన్ల ధరెంత? ఫీచర్లేంటో చూద్దాం..
షావోమీ 14 స్పెసిఫికేషన్స్ (Xiaomi 14)
షావోమీ 14 స్మార్ట్ఫోన్ 6.36 అంగుళాల 1.5K ఓఎల్ఈడీ ఎల్టీపీఓ డిస్ప్లేతో వస్తోంది. 120Hz రిఫ్రెష్ రేటు ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తున్న ఈ డిస్ప్లే 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్కు సపోర్ట్ చేస్తుంది. స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 3 ప్రాసెసర్ అమర్చారు. ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైపర్ఓఎస్తో పనిచేస్తుంది. డ్యూయల్ సిమ్ కార్డు ఉంది. వెనుక వైపు 50 ఎంపీ ఓఐఎస్ కెమెరా, 50 ఎంపీ అల్ట్రావైడ్, 50 ఎంపీ టెలిఫొటో లెన్స్ను అమర్చారు. ముందువైపు 32 ఎంపీ కెమెరా ఇచ్చారు. 4,610 ఎంఏహెచ్ బ్యాటరీ 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. 50W వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉంది. ఐపీ68 రేటింగ్, వైఫై 7, ఎన్ఎఫ్సీ, బ్లూటూత్ 5.4, ఇన్ డిస్ప్లే ఫింగర్ప్రింట్ సెన్సర్ అమర్చారు. 12జీబీ+ 512జీబీ వేరియంట్ ధర రూ.69,999గా కంపెనీ నిర్ణయించింది. వైట్, గ్రీన్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఎంఐ.కామ్, ఎంఐ హోమ్స్టోర్లతో పాటు రిటైల్ దుకాణాల్లో మార్చి 11 నుంచి లభ్యం కానుంది. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు రూ.5 వేలు డిస్కౌంట్ అందిస్తున్నారు.
షావోమీ 14 అల్ట్రా (Xiaomi 14 Ultra)
షావోమీ అల్ట్రా 14 స్మార్ట్ఫోన్ 6.73 అంగుళాల డిస్ప్లే 2కె డిస్ప్లేతో వస్తోంది. ఇందులోనూ 8 జనరేషన్ 3 ప్రాసెసర్ అమర్చారు. ఆండ్రాయిడ్ 14 హైపర్ ఓఎస్తో వస్తోంది. వెనుక వైపు మొత్తం నాలుగు కెమెరాలు అమర్చారు. 50 ఎంపీ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో కూడిన సోనీ సెన్సర్, 50 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 50 ఎంపీ పెరిస్కోప్ లెన్స్, 50 ఎంపీ టెలిఫొటో లెన్స్ ఇచ్చారు. సెల్ఫీల కోసం 32 ఎంపీ కెమెరా ఇచ్చారు. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్కు, 80W వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. NFC, వైఫై 7, బ్లూటూత్ 5.4, ఐపీ 68 రేటింగ్ కలిగి ఉంది. 16జీబీ+512 జీబీ ధర రూ.99,999గా కంపెనీ నిర్ణయించింది. బ్లాక్, వైట్ రంగుల్లో లభిస్తుంది. ఏప్రిల్ 8న విక్రయాలు ప్రారంభం కానున్నాయి. మార్చి 11 నుంచి ప్రీ రిజర్వ్ చేసుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐసీఐసీఐ బ్యాంక్ లాభం రూ.11,672 కోట్లు.. ఒక్కో షేరుకు ₹10 డివిడెండ్
ICICI Bank: ప్రైవేటు రంగానికి చెందిన ప్రముఖ బ్యాంక్ ఐసీఐసీఐ మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిక ఫలితాల్ని శనివారం ప్రకటించింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది. -
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
మారుతీ సుజుకీ త్వరలోనే అందుబాటు ధరలో హైబ్రిడ్ కార్లను తీసుకురావడంపై పని చేస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
గూగుల్లో ఉద్యోగం మొదలుపెట్టి 20 ఏళ్లు అయిందని సీఈఓ సుందర్ పిచాయ్ (Sundar Pichai) వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టు పెట్టారు. -
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ బ్యాంక్ లాభం రూ.11,672 కోట్లు.. ఒక్కో షేరుకు ₹10 డివిడెండ్
-
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య కలచివేసింది: సీవీ ఆనంద్
-
డ్రగ్ తయారీ మాఫియా గుట్టురట్టు.. 300 కేజీలు స్వాధీనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట