HDFC ఏటీఎం చోరీ కేసు: జరిగింది ఇది..!
నగరంలోని కూకట్పల్లి ఏటీఎం దోపిడీ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఏప్రిల్ 29న ఏటీఎం సిబ్బందిపై కాల్పులు జరిపిన
హైదరాబాద్: నగరంలోని కూకట్పల్లి ఏటీఎం దోపిడీ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.6.31లక్షల నగదు, నాటు తుపాకీ, ఒక ద్విచక్రవాహనం, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఏప్రిల్ 29న ఏటీఎం సిబ్బందిపై కాల్పులు జరిపిన నిందితులు రూ.5లక్షలు దోచుకెళ్లారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీపీ సజ్జనార్ మీడియాకు వెల్లడించారు.
‘‘కూకట్పల్లి హెచ్డీఎఫ్సీ ఏటీఎం దొంగతనం కేసులో ఇద్దరు నిందితులను బుధవారం అరెస్టు చేశాం. నిందితుల నుంచి రూ.6.31లక్షల నగదు స్వాధీనం చేసుకున్నాం. బిహార్కు చెందిన అజిత్కుమార్, ముఖేశ్ ఈ ఘటనకు పాల్పడ్డారు. వీరిలో అజిత్ దుండిగల్లోని ఓ ప్యాకేజ్ ఇండస్ట్రీలో కాంట్రాక్టర్గా పనిచేస్తున్నాడు. చెడు అలవాట్లకు బానిస అయిన అజిత్ సులభంగా డబ్బు సంపాదించేందుకు దోపిడీలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా 2018లో దుండిగల్లో ఒక మనీ ట్రాన్స్ఫర్ ఆఫీస్కు వెళ్లి అక్కడ పనిచేస్తున్న మహిళను బెదిరించి డబ్బులు దోచుకునే ప్రయత్నం చేయగా.. ఆమె అరవడంతో అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ పోలీసులకు చిక్కాడు. కొన్నాళ్లు జైలులో ఉన్నాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సొంతూరు వెళ్లిపోయాడు. గతేడాది మళ్లీ నగరానికి వచ్చి కొన్నాళ్లు ప్యాకేజ్ ఇండస్ట్రీలో కాంట్రాక్టర్గా పనిచేయడం మొదలు పెట్టాడు. డబ్బు మీద ఆశతో మళ్లీ దోపిడీ చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో స్నేహితుడు ముఖేశ్కు రూ.30వేలు పంపి నాటు తుపాకీ తీసుకురమ్మని చెప్పాడు. ముఖేశ్ ఇక్కడకు వచ్చిన తర్వాత తుపాకీని చెక్ చేసేందుకు గండిమైసమ్మ సమీపంలోని అడవికి వెళ్లి ఒక రౌండ్ ఫైర్ చేసి చూశాడు’’
‘‘ఏప్రిల్ 16న అజిత్, ముఖేశ్ మనీ ట్రాన్స్ఫర్ ఆఫీస్కు వెళ్లి అక్కడ వ్యక్తి వద్ద ఉన్న రూ.1.96లక్షలు, ఐఫోన్ తీసుకుని పారిపోయారు. ఏప్రిల్ 24న దుండిగల్ వద్ద నిలిపి ఉంచిన బైక్ను దొంగిలించారు. అది వేగంగా వెళ్లడం లేదని, 220సీసీ పల్సర్ను దొంగిలించారు. అదే బండిని ఏటీఎం చోరీలో వాడారు. ఏప్రిల్ 29న ఎర్రగడ్డ వద్దకు చేరకున్న వీరిద్దరికీ ఏటీఎంలో డబ్బులు నింపే వాహనం కనిపించింది. దాన్ని ఫాలో చేశారు. కూకట్పల్లిలోని ఓ హెచ్డీఎఫ్సీ ఏటీఎంలో డబ్బులు నింపిన తర్వాత ఆ వాహనం పటేల్కుంట పార్కు వద్ద ఉన్న మరో ఏటీఎం వద్దకు చేరుకుంది. అక్కడే నిందితులు దోపిడీకి పాల్పడ్డారు. ముందుగా అజిత్కుమార్ అక్కడి సెక్యురిటీ గార్డ్కు తుపాకీ చూపించి బెదిరించాడు. అప్రమత్తమైన సెక్యూరిటీ గార్డ్ అజిత్ చేతిలోని తుపాకీని లాక్కొనేందుకు యత్నించగా అతను కాల్పులు జరిపాడు. ఏటీఎం నిర్వహణ ఉద్యోగులు శ్రీనివాస్, నవీన్ వెంటనే స్పందించి ధైర్యంగా నిందితులను పట్టుకునేందుకు యత్నించారు. అజిత్ మరో రౌండ్ కాల్పులు జరపడంతో శ్రీనివాస్ కాలికి గాయమైంది. వెంటనే ముఖేశ్ ఏటీఎం వద్ద ఉన్న రూ.5లక్షలను పట్టుకు రాగా, ఇద్దరూ బైక్పై అక్కడి నుంచి ఉడాయించారు’’ అని సజ్జనార్ తెలిపారు. ఏటీఎం దొంగలను అడ్డుకునేందుకు ధైర్యం ప్రదర్శించిన శ్రీనివాస్, నవీన్ను సీపీ ఈ సందర్భంగా ప్రశంసించారు. చుట్టుపక్కల ఉన్నవాళ్లు కూడా వెంటనే స్పందించి ఉంటే నిందితులు అప్పుడే దొరికిపోయేవారన్నారు. అయితే, నిందితుల చేతిలో తుపాకీ ఉండటం, అప్పటికే సెక్యూరిటీ గార్డ్, శ్రీనివాస్పై కాల్పులు జరపడంతో జనాలు భయపడ్డారని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?