ఆ యాప్లకు చైనా, సింగపూర్ నుంచి నిధులు?
ఆన్లైన్ రుణ యాప్లకు లక్షల్లో వినియోగదారులు ఉన్నారని సైబరాబాద్ సీసీ సజ్జనార్ తెలిపారు.
సైబరాబాద్ సీపీ సజ్జనార్
హైదరాబాద్: ఆన్లైన్ రుణ యాప్లకు లక్షల్లో వినియోగదారులు ఉన్నారని సైబరాబాద్ సీసీ సజ్జనార్ తెలిపారు. రుణయాప్లకు సంబంధించిన కేసులో నిన్న మరో నలుగురిని అరెస్టు చేసినట్టు సీపీ వెల్లడించారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సజ్జనార్ మాట్లా డారు.
‘‘స్థానికులతో కలిసి చైనా వాసి రెండు డిజిటల్ కంపెనీలు ఏర్పాటు చేశాడు. ప్రత్యేకంగా కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి రుణాలు వసూలు చేశారు. మరో చైనా వాసి ఫిబ్రవరిలో వ్యాపార వీసాపై హైదరాబాద్ వచ్చి దందాలో పాల్గొన్నాడు. ఎప్పటికప్పుడు కొత్త కేంద్రాలు ఏర్పాటు చేసుకుంటూ వ్యాపారాన్ని విస్తరించుకున్నారు. మొత్తం 11 యాప్లు సృష్టించి రుణాలు ఇచ్చారు. ప్రత్యేకంగా 40 ఏళ్ల లోపు ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని రుణాలిచ్చారు. 25 నుంచి 30 శాతం వడ్డీ వసూలు చేస్తూ... చెల్లింపులు ఆలస్యమైతే జరిమానా విధించే వారు. ఆన్లైన్ రుణాల వ్యాపారానికి నిధులు ఎక్కడ్నుంచి వస్తున్నాయనే విషయంపై దర్యాప్తు చేస్తున్నాం. చైనా, సింగపూర్ ఇతర దేశాల నుంచి నిధులు వచ్చాయా అనే అంశంపై కూడా విచారణ చేపట్టాం. కీలకపాత్ర పోషించిన చైనా వాసి పరారీలో ఉన్నారు. ఈ యాప్లకు ఎన్బీఎఫ్సీలతో సంబంధం లేదు. ఈ వ్యవహారాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకెళ్లాం. ప్రజలెవరూ ఆన్లైన్ రుణాల వలలో చిక్కుకోవద్దు. రుణాల యాప్లే కాకుండా ఆటల యాప్ల్లోనూ మోసాలు జరుగుతున్నాయి. యాప్ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మొబైల్ సందేశాల్లో వచ్చే లింక్లను ఓపెన్ చేయొద్దు. యాప్ల ద్వారా మోసపోయిన వారు ధైర్యంగా ఫిర్యాదు చేయండి. ఎవరూ ఆత్మహత్యకు పాల్పడవద్దు. యాప్ల దర్యాప్తులో రోజు రోజుకూ కొత్త అంశాలు బయటపడుతున్నాయి’’ అని సీపీ సజ్జనార్ తెలిపారు.
ఇవీ చదవండి...
కారం చల్లారు.. పెట్రోలుతో అడ్డుకున్నారు
పెళ్లికి వెళ్లొస్తూ తిరిగిరాని లోకాలకు..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..