సోషల్‌మీడియా స్నేహం.. మహిళపై ముగ్గురు వైద్యుల అత్యాచారం!

సామాజిక మాధ్యమాల్లో స్నేహం ఓ మహిళ జీవితాన్ని నాశనం చేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బస్తీలో స్నేహం పేరిట ఓ మహిళను ఆస్పత్రికి పిలిచిన వైద్యుడు.....

Published : 04 Oct 2022 21:47 IST

బస్తీ(యూపీ): సామాజిక మాధ్యమాల్లో స్నేహం ఓ మహిళ జీవితాన్ని నాశనం చేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బస్తీలో స్నేహం పేరిట ఓ మహిళను ఆస్పత్రికి పిలిచిన వైద్యుడు మరో ఇద్దరితో కలిసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కొత్వాలి ప్రాంతంలోని బస్తీ సదర్‌ ఆస్పత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్న వ్యక్తి తనపై అత్యాచారం చేసినట్టు బాధితురాలు ఫిర్యాదు చేసింది. సామాజిక మాధ్యమాల ద్వారా ఆమెతో స్నేహం ఏర్పరచుకున్న ఆ వైద్యుడు ఆమెను తన ఆస్పత్రికి రావాలని ఆహ్వానించాడు. దీంతో ఆమె ఆస్పత్రి వద్దకు వెళ్లగా.. నిందితుడు అక్కడి నుంచి తన హాస్టల్‌ గదికి తీసుకెళ్లాడు. అక్కడ వైద్యులైన తన ఇద్దరు సహచరులతో కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు ఓ ప్రయివేటు విద్యాసంస్థలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోందని.. ఈ ఘటనపై గత నెల 27న ఫిర్యాదు చేయగా.. దర్యాప్తు చేసి వైద్యుడిని అరెస్టు చేసినట్టు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని