Suicide: పెడనలో విషాదం.. కుమారుడితో సహా దంపతుల ఆత్మహత్య

కృష్ణా జిల్లా పెడనలో చేనేత కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. దంపతులతో పాటు కుమారుడు

Updated : 01 Feb 2022 10:48 IST

పెడన: కృష్ణా జిల్లా పెడనలో విషాదం చోటు చేసుకుంది. చేనేత కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. దంపతులతో పాటు కుమారుడు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతి చెందిన వారిని కాసిన పద్మనాభం(52), నాగ లీలావతి(45), రాజనాగేంద్రం(24)గా గుర్తించారు. అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని