POCSO Court: బాలికపై అత్యాచారం.. తండ్రితో సహా మేనమామకు 84 ఏళ్ల జైలు శిక్ష!
అయిదేళ్ల కుమార్తెపై అత్యాచారానికి పాల్పడిన కేసులో తండ్రితోపాటు మరో వ్యక్తికి 84 ఏళ్ల జైలు శిక్ష పడింది. కేరళ (Kerala)లోని పోక్సో ఫాస్ట్ట్రాక్ కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది.
తిరువనంతపురం: ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో న్యాయస్థానం ఆమె తండ్రితో సహా మేనమామకు కఠిన శిక్ష విధించింది. ఇద్దరికి 84 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ కేరళ (Kerala)లోని పోక్సో ఫాస్ట్ట్రాక్ కోర్టు (POCSO Court) ఈ మేరకు తీర్పు వెలువరించింది. అయితే, వివిధ సెక్షన్ల కింద ఇచ్చిన ఈ శిక్షలన్నింటినీ ఒకేసారి అనుభవించాలని ఆదేశించింది. దీంతో దోషులు మొత్తంగా 20 ఏళ్ల శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.
ఇక్కడి దేవీకులం పోక్సో ఫాస్ట్ట్రాక్ కోర్టు.. పోక్సో చట్టంతోపాటు ఐపీసీ, జువెనైల్ జస్టిస్ యాక్టు ప్రకారం ఇద్దరు దోషులకు మొత్తం 84 ఏళ్ల శిక్ష విధించింది. అయితే, అందులో గరిష్ఠ శిక్ష 20 ఏళ్లు ఉన్నందున వారు వాటన్నింటినీ ఒకేసారి అనుభవించాలని ఆదేశించింది. జైలు శిక్షతోపాటు ఇద్దరు దోషులకు చెరో రూ.3లక్షల చొప్పున జరిమానా పడింది. వసూలు చేసిన అనంతరం ఆ మొత్తాన్ని బాధితురాలికి అందించాలని న్యాయమూర్తి రవిచందర్ సీఆర్ వెల్లడించారు. దీంతోపాటు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీని కూడా బాధితురాలికి పరిహారం అందించాలని ఆదేశించారు.
కేరళలోని దేవీకులానికి చెందిన ఓ వ్యక్తి.. ఐదేళ్ల కూతురిపై 2021లో పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆయనతోపాటు చిన్నారికి మామ వరసయ్యే వ్యక్తి కూడా ఈ దారుణానికి తెగబడ్డాడు. 2021 డిసెంబర్ 24న చిన్నారి తల్లి ఈ దారుణాన్ని చూసింది. వెంటనే ఈ విషయాన్ని శిశుసంక్షేమ కమిటీకి తెలపడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం 18 మంది సాక్షులను విచారించిన పోలీసులు.. మరుసటి ఏడాది ఛార్జిషీట్ దాఖలు చేశారు. విచారించిన పోక్సో ఫాస్ట్ట్రాక్ కోర్టు.. చిన్నారి తండ్రితో సహా మేనమామను దోషులుగా తేలుస్తూ శిక్ష ఖరారు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?