Crime News: వేగంగా వెళ్తున్న ఆటో నుంచి జారి పడి నలుగురి దుర్మరణం

ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తు్న్న ఆటో నుంచి జారిపడి నలుగురు దుర్మరణం పాలయ్యారు.

Updated : 25 Aug 2021 10:51 IST

మార్కాపురం గ్రామీణం: ప్రకాశం జిల్లా తర్లుపాడు- కొనకనమిట్ల మండలాల సరిహద్దు కలుజువ్వలపాడు జాతీయ రహదారిపై వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఆటో నుంచి నుంచి జారిపడి నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరికొందరికి గాయాలయ్యాయి. ఘటనాస్థలంలోనే ఇద్దరు మృతిచెందగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరో ఇద్దరు చనిపోయారు. మృతులను కనకం కార్తీక్‌, అనిల్‌, బోగాను సుబ్బారావు, శ్రీనుగా గుర్తించారు. 

వివాహ వేడుకకు వధువును తీసుకుని త్రిపురాంతకం మండలం సోమేపల్లి నుంచి పొదిలి అక్కచెరువు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వధువు ఆటో ముందు భాగంలో కూర్చోవడంతో ఆమెకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. క్షతగాత్రులను మార్కాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఉదయం 11 గంటలకు వివాహం జరగాల్సి ఉండగా ఈ దుర్ఘటన చోటుచేసుకోవడంతో పెళ్లింట విషాదం నెలకొంది. వధువు సహా కుటుంబసభ్యులంతా కన్నీరుమున్నీరయ్యారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని