యూపీ ఎన్కౌంటర్: విస్తుపోయే వాస్తవాలు..!
'నేనే వికాస్ దూబే, కాన్పూర్ వాలా' అంటూ పోలీసుల ముందు రంకెలేసిన వికాస్ దూబే అరెస్టు అనంతరం కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 'ఎనిమిది మంది పోలీసులను హతమార్చిన అనంతరం మృతదేహాలను తగలబెట్టాలని నిర్ణయించాం. దీంతో ఎలాంటి సాక్ష్యాధారాలు దొరకకుండా చేయాలని అనుకున్నాం. ఆ ప్రయత్నంలో ఉండగానే మరో పోలీసు బృందం అక్కడికి చేరుకుందని, అందుకే వారిని సమీపంలో పడేసి అక్కడినుంచి పారిపోయాం' అని అధికారులకు వికాస్ దూబే వివరించినట్లు సమాచారం.
భయంతోనే పోలీసు బృందంపై కాల్పులు
అనంతరం సాక్ష్యాధారాలు లేకుండా చేసేందుకు ప్రయత్నం
స్థానిక పోలీసులే సమాచారం ఇచ్చారన్న దూబే?
లఖ్నవూ: 'నేనే వికాస్ దూబే, కాన్పూర్ వాలా' అంటూ పోలీసుల ముందు రంకెలేసిన వికాస్ దూబే అరెస్టు అనంతరం కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 'ఎనిమిది మంది పోలీసులను హతమార్చిన అనంతరం మృతదేహాలను తగలబెట్టాలని నిర్ణయించాం. దీంతో ఎలాంటి సాక్ష్యాధారాలు దొరకకుండా చేయాలని అనుకున్నాం. ఆ ప్రయత్నంలో ఉండగానే మరో పోలీసు బృందం అక్కడికి చేరుకుందని, అందుకే వారిని సమీపంలో పడేసి అక్కడినుంచి పారిపోయాం' అని అధికారులకు వికాస్ దూబే వివరించినట్లు సమాచారం. తాజాగా విచారణ నిమిత్తం మధ్యప్రదేశ్ పోలీసుల నుంచి తమ అదుపులోకి తీసుకున్న యూపీ పోలీసులు రోడ్డు మార్గాన లఖ్నవూకు తరలిస్తున్నారు.
పోలీసులే ఉప్పందించారు..?
తనను అరెస్టు చేయడానికి ప్రత్యేక పోలీసు బృందం వస్తోన్న సమాచారం స్థానిక చౌబేపూర్ పోలీసులనుంచే వచ్చినట్లు వికాస్దూబే విచారణలో తెలిపినట్లు సమాచారం. అయితే, మరుసటి రోజు ఉదయం వస్తారనే సమాచారం ఉందని, కానీ, పోలీసులు రాత్రే రావడంతో భయంతో వారిపై కాల్పులు జరిపినట్లు విచారణలో వివరించాడు. అంతేకాకుండా, స్థానిక పోలీసులందరికీ ఎన్నో విధాలుగా సాయం చేసానని, దాదాపు వారందరినీ నేనే పోషించానని తెలపడం గమనార్హం. చౌబేపూర్ పోలీసులతోపాటు మరికొన్ని స్టేషన్ల సిబ్బందికి ఎంతోగానే సాయం చేసినట్లు విచారణలో వెల్లడించాడని సమాచారం.
వీఐపీ పాస్తో ఆలయంలోకి..!
8మంది పోలీసులను హతమార్చిన అనంతరం చిక్కకుండా ఐదురోజులు తప్పించుకుతిరిగిన వికాస్దూబే ఉజ్జయిన్లోని మహంకాళి ఆలయంవద్ద పట్టుబడ్డ విషయం తెలిసిందే. అయితే, ఏకంగా వీఐపీ పాస్తోనే ఆలయంలో దర్శనం చేసుకున్నట్లు పోలీస్ విచారణలో తేలింది. దీంతో మరోసారి విస్తుపోయిన పోలీసులు అతనికి సహకరించిన వారి కూపీలాగే ప్రయత్నం చేస్తున్నారు. మద్యం డీలర్తోపాటు మరికొందరు నాయకులు కూడా అతనికి సహకరించినట్లు అనుమానిస్తున్నారు.
ఏది సరైనదో అదే చేస్తుంది...దూబే తల్లి
కాన్పూర్ ఎన్కౌంటర్ అనంతరం 'నా కొడుకుని కాల్చి చంపండి' అంటూ అతని తల్లి ఆవేదన వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. తాజాగా అరెస్టు విషయాన్ని విలేకరులు ఆమెదగ్గర ప్రస్తావించగా 'నేను చెప్పాల్సింది ఏం లేదు. ఏది సరైనదో ప్రభుత్వం అదే చేస్తుంది' అని స్పందించారు. ఇక అరెస్టు వార్త విన్న వెంటనే ఎన్కౌంటర్లో చనిపోయిన పోలీసు కుటుంబాలు స్పందించాయి. ఎనిమిది మంది పోలీసులను పొట్టనపెట్టుకున్న కిరాతకున్ని వెంటనే ఎన్కౌంటర్ చేయాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
World News
Earthquake: తుర్కియే, సిరియాలో భూకంపం.. 4,500కి చేరిన మృతులు!
-
Sports News
Ravi Shastri: అశ్విన్.. అతి ప్రణాళికలు వద్దు
-
India News
చనిపోయాడనుకొని ఖననం చేశారు.. కానీ స్నేహితుడికి వీడియో కాల్!
-
Ap-top-news News
Andhra News: పన్నులు వసూలు చేసే వరకూ సెలవుల్లేవ్
-
India News
JEE Main: జేఈఈ మెయిన్ తొలి విడత ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి