యూపీ ఎన్కౌంటర్: విస్తుపోయే వాస్తవాలు..!
'నేనే వికాస్ దూబే, కాన్పూర్ వాలా' అంటూ పోలీసుల ముందు రంకెలేసిన వికాస్ దూబే అరెస్టు అనంతరం కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 'ఎనిమిది మంది పోలీసులను హతమార్చిన అనంతరం మృతదేహాలను తగలబెట్టాలని నిర్ణయించాం. దీంతో ఎలాంటి సాక్ష్యాధారాలు దొరకకుండా చేయాలని అనుకున్నాం. ఆ ప్రయత్నంలో ఉండగానే మరో పోలీసు బృందం అక్కడికి చేరుకుందని, అందుకే వారిని సమీపంలో పడేసి అక్కడినుంచి పారిపోయాం' అని అధికారులకు వికాస్ దూబే వివరించినట్లు సమాచారం.
భయంతోనే పోలీసు బృందంపై కాల్పులు
అనంతరం సాక్ష్యాధారాలు లేకుండా చేసేందుకు ప్రయత్నం
స్థానిక పోలీసులే సమాచారం ఇచ్చారన్న దూబే?
లఖ్నవూ: 'నేనే వికాస్ దూబే, కాన్పూర్ వాలా' అంటూ పోలీసుల ముందు రంకెలేసిన వికాస్ దూబే అరెస్టు అనంతరం కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 'ఎనిమిది మంది పోలీసులను హతమార్చిన అనంతరం మృతదేహాలను తగలబెట్టాలని నిర్ణయించాం. దీంతో ఎలాంటి సాక్ష్యాధారాలు దొరకకుండా చేయాలని అనుకున్నాం. ఆ ప్రయత్నంలో ఉండగానే మరో పోలీసు బృందం అక్కడికి చేరుకుందని, అందుకే వారిని సమీపంలో పడేసి అక్కడినుంచి పారిపోయాం' అని అధికారులకు వికాస్ దూబే వివరించినట్లు సమాచారం. తాజాగా విచారణ నిమిత్తం మధ్యప్రదేశ్ పోలీసుల నుంచి తమ అదుపులోకి తీసుకున్న యూపీ పోలీసులు రోడ్డు మార్గాన లఖ్నవూకు తరలిస్తున్నారు.
పోలీసులే ఉప్పందించారు..?
తనను అరెస్టు చేయడానికి ప్రత్యేక పోలీసు బృందం వస్తోన్న సమాచారం స్థానిక చౌబేపూర్ పోలీసులనుంచే వచ్చినట్లు వికాస్దూబే విచారణలో తెలిపినట్లు సమాచారం. అయితే, మరుసటి రోజు ఉదయం వస్తారనే సమాచారం ఉందని, కానీ, పోలీసులు రాత్రే రావడంతో భయంతో వారిపై కాల్పులు జరిపినట్లు విచారణలో వివరించాడు. అంతేకాకుండా, స్థానిక పోలీసులందరికీ ఎన్నో విధాలుగా సాయం చేసానని, దాదాపు వారందరినీ నేనే పోషించానని తెలపడం గమనార్హం. చౌబేపూర్ పోలీసులతోపాటు మరికొన్ని స్టేషన్ల సిబ్బందికి ఎంతోగానే సాయం చేసినట్లు విచారణలో వెల్లడించాడని సమాచారం.
వీఐపీ పాస్తో ఆలయంలోకి..!
8మంది పోలీసులను హతమార్చిన అనంతరం చిక్కకుండా ఐదురోజులు తప్పించుకుతిరిగిన వికాస్దూబే ఉజ్జయిన్లోని మహంకాళి ఆలయంవద్ద పట్టుబడ్డ విషయం తెలిసిందే. అయితే, ఏకంగా వీఐపీ పాస్తోనే ఆలయంలో దర్శనం చేసుకున్నట్లు పోలీస్ విచారణలో తేలింది. దీంతో మరోసారి విస్తుపోయిన పోలీసులు అతనికి సహకరించిన వారి కూపీలాగే ప్రయత్నం చేస్తున్నారు. మద్యం డీలర్తోపాటు మరికొందరు నాయకులు కూడా అతనికి సహకరించినట్లు అనుమానిస్తున్నారు.
ఏది సరైనదో అదే చేస్తుంది...దూబే తల్లి
కాన్పూర్ ఎన్కౌంటర్ అనంతరం 'నా కొడుకుని కాల్చి చంపండి' అంటూ అతని తల్లి ఆవేదన వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. తాజాగా అరెస్టు విషయాన్ని విలేకరులు ఆమెదగ్గర ప్రస్తావించగా 'నేను చెప్పాల్సింది ఏం లేదు. ఏది సరైనదో ప్రభుత్వం అదే చేస్తుంది' అని స్పందించారు. ఇక అరెస్టు వార్త విన్న వెంటనే ఎన్కౌంటర్లో చనిపోయిన పోలీసు కుటుంబాలు స్పందించాయి. ఎనిమిది మంది పోలీసులను పొట్టనపెట్టుకున్న కిరాతకున్ని వెంటనే ఎన్కౌంటర్ చేయాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?