హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించి
కుటుంబ కలహాల నేపథ్యంలో చోటుచేసుకున్న వివాదంలో తండ్రితో పాటు కుటుంబసభ్యులు దాడి చేయడంతో కొడుకు హత్యకు గురైన సంఘటన పర్చూరు మండలం ఏదుబాడులో చోటుచేసుకుంది. సంఘటనా స్థలంలో రక్తపు మరకలు చెరిపేసి ఆత్మహత్యగా
కొడుకును హతమార్చిన తండ్రి, కుటుంబసభ్యులు
కోడలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు
ఏసురత్నం (పాత చిత్రం)
పర్చూరు, న్యూస్టుడే: కుటుంబ కలహాల నేపథ్యంలో చోటుచేసుకున్న వివాదంలో తండ్రితో పాటు కుటుంబసభ్యులు దాడి చేయడంతో కొడుకు హత్యకు గురైన సంఘటన పర్చూరు మండలం ఏదుబాడులో చోటుచేసుకుంది. సంఘటనా స్థలంలో రక్తపు మరకలు చెరిపేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. చివరకు పోలీసుల రంగం ప్రవేశంతో హత్యకు గురైన విషయం వెలుగులోకి వచ్చింది. ఎస్సై లక్ష్మీభవాని తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పొనుగుపాటి ఏసురత్నం(28) అదే గ్రామానికి చెందిన నీలిమ ప్రియాంకను 2014లో ప్రేమ వివాహం చేసుకున్నారు. మొదట్లో ఏసురత్నం కుటుంబ సభ్యులు వ్యతిరేకించినా కొంతకాలం తర్వాత కలిసే ఉంటున్నారు. నీలిమ, ఏసురత్నం విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పని చేస్తున్నారు. మద్యానికి అలవాటైన ఏసురత్నం భార్య, కుటుంబ సభ్యులను తరచూ వేధిస్తుండేవాడు. ఈనెల 15న మద్యం సేవించి గొడవపడటంతో భార్య ఏదుబాడు వచ్చింది. 17న తల్లితో కలిసి మేదరమెట్లలో ఉంటున్న సోదరి వద్దకు వెళ్లింది. భార్య కోసం 18వ తేదీ మధ్యాహ్నం స్వగ్రామానికి వచ్చిన ఏసురత్నం గ్రామంలో లేకపోవడంతో తండ్రి వద్దకు వెళ్లాడు. భార్యను తీసుకురావడానికి తండ్రిని రమ్మని కోరాడు. మద్యం సేవించి గొడవ పడుతుంటే ఎలా వస్తారని అని తండ్రి అనడంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈక్రమంలో కుమారుడిపై తండ్రి బాపయ్యతో పాటు కుటుంబసభ్యులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. తల, ఇతర శరీర భాగాలలో బలమైన గాయాలయ్యాయి. కొద్దిసేపటికే ఏసురత్నం మృతి చెందాడు. హత్య చేసినట్లు అనుమానం వస్తుందనే భయంతో శరీరంపైనా, గదిలోనూ కనిపించకుండా రక్తపు మరకలు తుడిచేశారు. మేదరమెట్లలో ఉంటున్న మృతుని భార్య నీలిమా ప్రియాంకకు బుధవారం సాయంత్రం ఫోన్ చేసి పురుగుమందు తాగి చనిపోయినట్లు ఆమె మామ సమాచారం అందించారు. బంధువులతో కలిసి గ్రామానికి వచ్చిన నీలిమ భర్త శరీరంపై ఉన్న గాయాలు చూసి ఆందోళనకు గురై నిలదీసింది. బుధవారం అర్ధరాత్రి సమయంలో పర్చూరు పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేసింది. ఎస్సై లక్ష్మీభవాని వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. గురువారం ఉదయం ఇంకొల్లు సీఐ సుబ్బారావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పంచనామా నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుని తల్లిదండ్రులతో పాటు అతని సోదరి, బావపై హత్య, సాక్ష్యాలు లేకుండా చేయడంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న ఎస్సై లక్ష్మీభవాని
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?