ఊపిరి పోసే ఔషధంతోనే ఉసురు తీస్తున్నారు..
మనిషి ప్రాణాలు కాపాడేందుకు వినియోగించే ఇంజక్షన్లను హత్యలకు ఆయుధంగా ఉపయోగిస్తున్న ఘటనలు జిల్లాలో సంచలనం రేకెత్తిస్తున్నాయి. ఊపిరి పోయాల్సిన రంగంలో పనిచేస్తున్న వ్యక్తులే ఉసురు తీస్తున్నారు. నాలుగు రోజుల క్రితం
జమాల్సాహెబ్, నవీన హత్య కేసుల్లో సూదిమందు వినియోగం
ఖమ్మం వైద్యవిభాగం, న్యూస్టుడే
మనిషి ప్రాణాలు కాపాడేందుకు వినియోగించే ఇంజక్షన్లను హత్యలకు ఆయుధంగా ఉపయోగిస్తున్న ఘటనలు జిల్లాలో సంచలనం రేకెత్తిస్తున్నాయి. ఊపిరి పోయాల్సిన రంగంలో పనిచేస్తున్న వ్యక్తులే ఉసురు తీస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ద్విచక్రవాహనంపై వెళ్తున్న జమాల్ సాహెబ్ను లిఫ్ట్ అడిగి సూది గుచ్చి హత్య చేసిన సంఘటన నుంచి జిల్లా వాసులు తేరుకోకముందే బాలింత నవీన హత్య ఉదంతం ఉలిక్కిపడేలా చేసింది. బిడ్డను ప్రసవించిన రోజే బాలింత భర్త కర్కశంగా కడతేర్చిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ రెండు ఘటనల్లోనూ మత్తుమందునే హత్యాయుధంగా వినియోగించినట్టు పోలీసుల విచారణలో తేల్చారు.
వైద్య రంగంతో సంబంధం ఉండటం వల్లే..
రెండు హత్యలకు వేర్వేరు రకాలైన మత్తు ఇంజక్షన్లను వాడారు. రోగులకు శస్త్రచికిత్స సమయంలో మత్తుమందు వైద్యనిపుణులు మాత్రమే వాటిని వినియోగిస్తారు. అసలు ఇలాంటి సూదిమందులు నిందితులకు ఎలా వచ్చాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాటిని ఔషధ దుకాణాల్లో విక్రయించడానికి అనుమతులు ఉండవు. బహిరంగ మార్కెట్లో ఎక్కడ పడితే అక్కడ లభించే అవకాశం లేదు. ఆపరేషన్ థియేటర్స్, ఐసీయూ విభాగాలు ఉన్న ఆస్పత్రుల్లో నిర్వహించే అనుబంధ ఔషధ దుకాణాల్లో మాత్రమే పరిమితంగా అందుబాటులో ఉంటాయి. అవికూడా వైద్య నిపుణుల ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఇస్తారు. చికిత్స సమయంలో మత్తు వైద్య నిపుణులు(అనస్తీషియా) ఎక్కువగా వీటిని కొనుగోలు చేస్తారు. ఇలాంటి ఇంజక్షన్లను ఎక్కువ మోతాదులో మానవ శరీరంలోకి పంపిస్తే స్వల్ప వ్యవధిలో అవయవాలు దెబ్బతిని ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. పైన పేర్కొన్న రెండూ హత్యలూ ఇలాగే జరిగాయి. నిందితులు వైద్య రంగంలో పనిచేస్తున్న వారు కావడంతోనే ఔషధాలను రహస్యంగా సేకరించినట్లు తెలుస్తోంది. వాటిని ఎక్కడి నుంచి తెప్పించారనేదానిపై విచారణ చేపట్టాల్సి ఉంది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడైనా అధికార యంత్రాగం అప్రమత్తం కావాలి. ఔషధ దుకాణాలపై నిఘా పెంచాలి.
ప్రైవేటు వ్యక్తులకు మత్తు ఇంజక్షన్లు విక్రయించే అవకాశం లేదు. అర్హత కలిగిన వైద్యులు, మత్తు వైద్యనిపుణుల ప్రిస్క్రిప్షన్ ఉంటేనే విక్రయించాలి. వీటి విక్రయానికి అనుమతుల్లేని ఔషధ దుకాణాల్లో విక్రయిస్తే లైసెన్సు రద్దు చేసి కేసులు పెడతాం. అనైతిక చర్యలకు వినియోగించేందుకు సహకరించిన వ్యక్తులపైనా కఠిన చర్యలు తీసుకోవచ్చు.
- సురేందర్, డ్రగ్ ఇన్స్పెక్టర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు