Srikakulam: దారుణం.. భార్యను హతమార్చి ఆపై భర్త ఆత్మహత్య

శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్యను హతమార్చి ఆపై భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంతబొమ్మాళి మండలం నౌపడ పంచాయతీ జగన్నాథపురంలో చోటుచేసుకుంది.

Updated : 13 Nov 2022 09:36 IST

సంతబొమ్మాళి: శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్యను హతమార్చి ఆపై భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంతబొమ్మాళి మండలం నౌపడ పంచాయతీ జగన్నాథపురంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దాసరి సింహాద్రి(60), ఉమ(52) దంపతులు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత భర్త సింహాద్రి తన భార్య దాసరి ఉమ(52)ను చాకుతో గొంతుకోసి హతమార్చాడు. అనంతరం భర్త కూడా ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న నౌపడ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. కుటుంబకలహాల నేపథ్యంలోనే ఈ దారుణం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ హత్య, ఆత్మహత్యలతో జగన్నాథపురం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని