పోలీసుల కళ్లలో కారం కొట్టి.. భాజపా నేత హత్యకేసు నిందితుడి కాల్చివేత

హత్యకేసులో నిందితులను న్యాయస్థానం ముందు హాజరుపరిచేందుకు తీసుకువెళ్తున్న పోలీసులపై ఓ ముఠా దాడి చేసింది.

Updated : 13 Jul 2023 08:09 IST

రాజస్థాన్‌లో దుండగుల ఘాతుకం

జైపుర్‌: హత్యకేసులో నిందితులను న్యాయస్థానం ముందు హాజరుపరిచేందుకు తీసుకువెళ్తున్న పోలీసులపై ఓ ముఠా దాడి చేసింది. వారి కళ్లలో కారం కొట్టి ఆ నిందితులపై కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఓ నిందితుడు ప్రాణాలు కోల్పోగా.. మరో నిందితుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన బుధవారం రాజస్థాన్‌లో చోటుచేసుకుంది.

కుల్దీప్‌ జఘీనా, విజయ్‌పాల్‌ అనే వ్యక్తులు 2022లో జరిగిన స్థానిక భాజపా నేత కృపాల్‌ జఘీనా హత్యకేసులో నిందితులు. వీరిని భరత్‌పుర్‌లోని కోర్టులో హాజరుపరిచేందుకు స్థానిక పోలీసులు రాజస్థాన్‌ రవాణాసంస్థకు చెందిన బస్సులో బయలుదేరారు. హలేనా పోలీస్‌స్టేషను పరిధిలో ఉన్న అమోలీ టోల్‌ప్లాజా వద్దకు చేరుకున్న వెంటనే కొందరు దుండగులు ఈ బస్సును అడ్డగించారు. ఓ కారుతోపాటు రెండు బైకులపై వచ్చిన 12 మందికి పైగా సాయుధులైన దుండగలు బస్సులోకి ప్రవేశించారు. ఎస్కార్టుగా ఉన్న పోలీసులపై కారం చల్లి ఇద్దరు నిందితులపై కాల్పులు జరిపి పారిపోయారు. వారిలో నలుగురిని పోలీసులు పట్టుకున్నారు. గాయపడిన నిందితులను స్థానిక ఆస్పత్రికి తరలించగా.. కుల్దీప్‌ జఘీనా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మరో నిందితుడు విజయ్‌పాల్‌ పరిస్థితి విషమంగా ఉంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని