Income tax refund: ఆదాయపు పన్ను రిఫండ్స్.. ఐటీ శాఖ కీలక సూచన
Income tax refund: ఆదాయపు పన్ను రిఫండ్లు త్వరగా జారీ కావాలంటే గత డిమాండ్లపై సత్వరమే స్పందించాలని ఐటీ శాఖ కోరింది. ఈ మేరకు పన్ను చెల్లింపుదారులకు సూచించింది.
Income tax refund | దిల్లీ: ఆదాయపు పన్ను రిఫండ్లకు సంబంధించి పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను శాఖ కీలక సూచన చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిఫండ్లు క్లియర్ అవ్వాలంటే అంతకుముందు సంవత్సరాల్లో పెండింగ్లో ఉన్న ట్యాక్స్ డిమాండ్లకు సంబంధించి వచ్చిన ఇంటిమేషన్కు స్పందించాలని ఐటీ శాఖ సూచించింది. రిటర్నుల ప్రాసెసింగ్, రిఫండ్ల జారీకి వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి ఐటీ శాఖ తనవంతు కృషి చేస్తోందని ఈ సందర్భంగా పేర్కొంది. ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని తెలియజేసింది. మునుపటి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అన్సెటిల్డ్ ట్యాక్స్ డిమాండ్ల గురించి ఐటీ శాఖ నుంచి తమకు సమాచారం అందిందంటూ కొందరు సోషల్ మీడియా వేదిక పోస్టులు పెడుతున్నారు. దీనిపై ఐటీ శాఖ స్పందించింది.
గూగుల్కు పోటీగా ఫోన్పే కొత్త యాప్స్టోర్
2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ 7.09 కోట్ల రిటర్నులు దాఖలవ్వగా.. అందులో 6.96 రిటర్నులు వెరిఫికేషన్ పూర్తయ్యాయని, 6.46 కోట్ల రిటర్నులు ప్రాసెస్ చేసినట్లు ఐటీ శాఖ తెలిపింది. 2.75 కోట్ల రిఫండ్ రిటర్నులు కూడా పూర్తి చేసినట్లు పేర్కొంది. కొంతమంది పన్ను చెల్లింపుదారుల విషయంలో ఇప్పటికీ ట్యాక్స్ డిమాండ్లు పెండింగ్లో ఉన్నాయని తెలిపింది. దీంతో ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 245 (1) కింద పాత డిమాండ్లను ప్రస్తుత రిఫండ్లలో సర్దుబాటు చేసుకునే అవకాశం పన్ను చెల్లింపుదారులకు కల్పిస్తున్నట్లు పేర్కొంది. ఇందుకు పెండింగ్లో ఉన్న డిమాండ్లను అంగీకరించడమో, తిరస్కరించడమో, డిమాండ్ స్టేటస్ స్థితిని తెలియజేయడమో చేయాలని సూచించింది. ఇందులో భాగంగానే పెండింగ్ డిమాండ్ల గురించి తెలియజేస్తున్నామని, ఆ డిమాండ్లను క్లీన్ చేయడం ద్వారా రిఫండ్లను త్వరగా పొందొచ్చని పేర్కొంది. పన్ను చెల్లింపుదారులు అటువంటి సూచనలకు ప్రతిస్పందించాలని ఐటీ శాఖ సూచించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
మారుతీ సుజుకీ త్వరలోనే అందుబాటు ధరలో హైబ్రిడ్ కార్లను తీసుకురావడంపై పని చేస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
గూగుల్లో ఉద్యోగం మొదలుపెట్టి 20 ఏళ్లు అయిందని సీఈఓ సుందర్ పిచాయ్ (Sundar Pichai) వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టు పెట్టారు. -
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్