గ్యాంగ్‌రేప్‌కి పాల్పడి.. వీడియోని వైరల్‌ చేసి..

ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. రాష్ట్రంలో కొద్దిరోజులుగా..

Updated : 22 Dec 2022 17:16 IST

ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో దారుణం

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. రాష్ట్రంలో కొద్ది రోజులుగా బాలికలపై అఘాయిత్యాలు కొనసాగుతున్నాయి. తాజాగా సీతాపుర్‌లో ఓ 15 ఏళ్ల బాలికపై గ్యాంగ్‌రేప్‌కి పాల్పడ్డ దుండగులు ఘటనను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. అప్రమత్తమైన పోలీసులు ఓ నిందితుడిని అదుపులోకి తీసుకొని మిగతావారి కోసం గాలిస్తున్నారు. సూపరింటెండెంట్‌ ప్రకాశ్‌సింగ్‌ వివరాల ప్రకారం.. సెప్టెంబర్‌7న సుల్తాన్‌పురా ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల బాలికను అపహరించుకుపోయిన ఐదుగురు దుండగులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ ఘటనను వీడియో కూడా తీశారు. విషయం బయటకు చెబితే ఆ వీడియోను వైరల్‌ చేస్తామంటూ బాలికను బెదిరించారు. దీంతో ఆమె ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. కాగా సదరు వీడియోను ఓ నిందితుడు సామాజిక మాధ్యమంలో ఉంచగా అది కాస్తా వైరల్‌ అయ్యింది. దాన్ని చూసిన పోలీసులు అప్రమత్తమై ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి మిగతావారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. క్లిప్‌ను కట్టడిచేసేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. బాలికను వైద్య పరీక్షల కోసం తరలించనున్నట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని