బాలుడిని అపహరించి.. ముక్కు, చెవులు కోసి..!

బంధువులే ఆ బాలుడి మృత్యుపాశాలయ్యారు. బాలుడిని ఎత్తుకెళ్లి ముక్కు, చెవులు కోసి అత్యంత పాశవికంగా హత్యచేశారు.....

Published : 29 Dec 2020 01:26 IST

జైపుర్‌: బంధువులే ఆ బాలుడి పాలిట మృత్యుపాశాలయ్యారు. బాలుడిని ఎత్తుకెళ్లి ముక్కు, చెవులు కోసి అత్యంత పాశవికంగా హత్యచేశారు. అనంతరం వ్యవసాయ పొలంలో పడేశారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని అల్వార్‌ జిల్లాలో చోటుచేసుకుంది. నవేలి గ్రామానికి చెందిన 11 ఏళ్ల బాలుడు శనివారం నుంచి కనిపించకుండా పోయాడు. అయితే బాలుడిని తమకు తెలిసిన కొందరు వ్యక్తులే ఎత్తుకెళ్లి ఉంటారని బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు ఓ పంట పొలంలో బాలుడి మృతదేహం లభ్యమైంది. అతడి ముక్కు, చెవులను కోసి హత్య చేశారు. దర్యాప్తులో బాలుడి బంధువులే అపహరించి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధరించారు. పలువురిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. డబ్బు కోసమో లేదా క్షుద్రపూజల కోసమో బంధువులు ఈ హత్యచేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఫిర్యాదు చేసినప్పుడు పోలీసులు స్పందించలేదని, తక్షణ చర్యలు తీసుకొని ఉంటే తమ కుమారుడు బ్రతికుండేవాడని బాలుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

ఇవీ చదవండి...

భార్యను హత్యచేసి.. సాక్ష్యాలను మార్చేసి..!

రేవ్‌ పార్టీ.. పోలీసుల అదుపులో యువతులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని