Andhra News: గుడివాడలో ఆర్‌ఐపై మట్టి మాఫియా హత్యాయత్నం

జిల్లాలోని గుడివాడ మండలం మోటూరులో గురువారం రాత్రి ఆర్‌ఐపై దాడి జరిగింది. అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకున్న ఆర్‌ఐ అరవింద్‌పై మట్టి మాఫియా దాడికి దిగింది.

Updated : 22 Apr 2022 08:44 IST

కృష్ణా: జిల్లాలోని గుడివాడ మండలం మోటూరులో గురువారం రాత్రి ఆర్‌ఐపై దాడి జరిగింది. అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకున్న ఆర్‌ఐ అరవింద్‌పై మట్టి మాఫియా హత్యాయత్నానికి తెగబడింది. కొన్నిరోజులుగా రాత్రివేళ అధికార పార్టీ నేతలు మట్టి తవ్వుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు తనిఖీలు చేడుతోంది. అడ్డుకుంటున్న అధికారులను మట్టి మాఫియా బెదిరిస్తోంది. ఈ క్రమంలో ఆర్ఐ అరవింద్‌పై దాడి జరిగింది. జేసీబీతో ఆర్‌ఐని మట్టి మాఫియా బ్యాచ్‌ నెట్టేసింది. ఈ ఘటనపై రెవెన్యూ సంఘాలు స్పందించాయి. దాడి చేసిన వారిని అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని