AP News: పాదచారుల పైకి దూసుకెళ్లిన లారీ

చిత్తూరు జిల్లా వడమాలపేట టోల్‌గేట్‌ వద్ద లారీ బీభత్సం సృష్టించింది.

Updated : 18 Jul 2021 09:56 IST

ఒకరి మృతి.. 9 మందికి గాయాలు

చిత్తూరు: చిత్తూరు జిల్లా వడమాలపేట టోల్‌గేట్‌ వద్ద లారీ బీభత్సం సృష్టించింది. 10 మంది పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. తొమ్మిది మంది గాయపడ్డారు. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చెన్నై నుంచి భక్తులు తిరుమలకు కాలి నడకన వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఘటన అనంతరం లారీని వదిలేసి డ్రైవర్‌ పరారయ్యాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని