Hyderabad News: ఓఆర్‌ఆర్‌పై లారీని ఢీకొట్టిన కారు: ఒకరి మృతి.. ముగ్గురికి తీవ్రగాయాలు

రాజేంద్రనగర్- హిమాయత్‌సాగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం జరిగింది.

Updated : 28 Dec 2021 14:02 IST

హైదరాబాద్‌: రాజేంద్రనగర్- హిమాయత్‌సాగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. ఓ కారు ముందు వెళుతున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఐదుగురు యువకులు, ఓ యువతి కారులో శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. లారీని కారు వేగంగా ఢీకొట్టడంతో ముందు భాగంలో ఉన్న యువతి వాహనంలో ఇరుక్కుపోయింది. అతి కష్టం మీద ఓఆర్‌ఆర్‌ సిబ్బంది కారు నుంచి యువతిని బయటికి తీశారు. క్షతగాత్రులను నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కారులో ఉన్న వారిని డ్రైవర్‌ ప్రేమ్‌, కాశీనాథ్‌, గగన్‌, గోశాల్‌, అమిత్ కుమార్‌, వైష్ణవిగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని