అత్తామామలను ఒప్పించి.. భర్తను మెప్పించి
అప్పటివరకు ఉన్నతంగా చదివిన అమ్మాయిలు పెళ్లయిన తర్వాత ఇంటికే పరిమితమయ్యేవారు.. ఇది గతం.. కాలం మారింది.. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వారు ప్రభుత్వ కొలువే లక్ష్యంగా ముందుకు
ఉద్యోగ పరీక్షలకు సన్నద్ధమవుతున్న గృహిణులు
న్యూస్టుడే, భుక్తాపూర్(ఆదిలాబాద్)
జిల్లా కేంద్ర గ్రంథాలయంలో మహిళలు
అప్పటివరకు ఉన్నతంగా చదివిన అమ్మాయిలు పెళ్లయిన తర్వాత ఇంటికే పరిమితమయ్యేవారు.. ఇది గతం.. కాలం మారింది.. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వారు ప్రభుత్వ కొలువే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. పిల్లల చదువులు, కుటుంబ అవసరాలు తీర్చేందుకు పట్టుదలతో ఉద్యోగ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. అందుకు వారు భర్త, అత్త, మామయ్యలను ఒప్పించారు, మెప్పించారు. ఉదయమే వంటలు, ఇతర పనులు చేసుకుంటున్నారు. తమ పిల్లలను ఇంటి పెద్దల వద్ద వదిలేసి గ్రంథాలయ బాట పడుతున్నారు. ఇతర మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘న్యూస్టుడే’ గృహిణులతో పలకరించింది.. ప్రభుత్వ కొలువే లక్ష్యంగా పదేసి గంటలు పఠన గదిలో గడుపుతున్నామంటున్నారు.
జిల్లా కేంద్ర గ్రంథాలయానికి రోజూ 30 మందికి పైగా మహిళలు ఉద్యోగ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు వస్తున్నారు. అందులో సగం మంది వివాహితులు ఉండడం విశేషం.
అందరి ప్రోత్సాహంతో..
- చనగరపు భావన, ఆదిలాబాద్
మా ఆయన పేరు సంజయ్కుమార్. సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ఇంటి నుంచే విధులు నిర్వహిస్తున్నారు. 2019లో పెళ్లయింది. మాకొక పాప. అందరం కలిసే ఉంటాం. నేను డీఈడీ, బీఈడీ, డిగ్రీ పూర్తి చేశా. పెళ్లికంటే ముందు డీఎస్సీ రాశా. స్వల్ప మార్కులతో ప్రభుత్వ ఉద్యోగం రాలేదు. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకొని టెట్ పరీక్షకు సన్నద్ధమవుతున్నా. అత్త, మామయ్య, భర్త ప్రోత్సాహంతో రోజూ గ్రంథాలయానికి వస్తున్నా.
గూడ నుంచి రోజూ ఆదిలాబాద్కు..
- గొంటిముక్కుల సరిత, గూడ(జైనథ్)
నేను, నా భర్త సంజీవ్ ఇద్దరం రోజూ జైనథ్ మండలం గూడ నుంచి 15 కి.మీ.లు ప్రయాణించి ఆదిలాబాద్కు వస్తున్నాం. గ్రంథాలయంలో వేర్వేరుగా టెట్ కోసం సన్నద్ధమవుతున్నాం. 2010లో పెళ్లయింది. మాకు ముగ్గురు ఆడ పిల్లలు. నా విద్యాభ్యాసం అంతా ప్రభుత్వ రంగ సంస్థల్లో సాగింది. ఎంఏ తెలుగు, బీఈడీ పూర్తయింది. రెండేళ్లు విద్యావాలంటీరు(వీవీ)గా పని చేశా. కరోనా అనంతరం మళ్లీ వీవీగా తీసుకోలేదు. బోధన రంగంలో ఎదగాలన్నదే నా అభిలాష.
పట్టుదలతో ముందుకు..
- ప్రజ్ఞ, కూర(జైనథ్)
భర్త వెంకటి. వ్యవసాయం చేస్తుంటారు. 2018లో పెళ్లయింది. నాలుగేళ్ల పాప ఉంది. 2017లో బీఈడీ పూర్తయింది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో 2018 నుంచి 2020 వరకు విద్యావాలంటీర్గా పని చేశాను. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని పట్టుదలతో రోజూ జైనథ్ మండలం కూర గ్రామం నుంచి బస్సులో వస్తున్నా. పాపను అత్తమ్మ, మామయ్య బాగా చూసుకుంటున్నారు. అమ్మ గుర్తుకు రాకుండా ఆడిస్తున్నారు. లాలిస్తున్నారు. సాయంత్రం 7 గంటలకు తిరిగి నా గ్రామానికి బస్సులో వెళుతున్నా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పండగ రోజులా భావించి ఓటేసేందుకు రండి
[ 10-05-2024]
‘ఇవి దేశం కోసం జరుగుతున్న ఎన్నికలు. కోరుకున్న ప్రభుత్వ విధానాలు అమలు కావాలన్నా.. నచ్చిన ప్రభుత్వం ఏర్పడాలన్నా ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలి. -
మోసగించే పార్టీలకు బుద్ధి చెప్పాలి
[ 10-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం బాగుపడ్డదా..తెలంగాణ అప్పుడెట్లుండే. ఇప్పుడెట్లైంది.. కేసీఆర్ ఆనాడే అన్నారు కాంగ్రెస్, భాజపాల మాటలకు మోసపోతే గోసపడుతారని, ఇప్పుడు 5 నెలలకే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింద’ని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. -
గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తాం
[ 10-05-2024]
పదేళ్లు అధికారంలో ఉన్న భారాస, భాజపాలు జిల్లాలో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమయ్యాయని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక్క విమర్శించారు. -
సరిహద్దుపై నజర్
[ 10-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ సమీపించింది. ఎన్నికలు సజావుగా సాగేలా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. -
బాధ్యతగా ఓటేద్దాం
[ 10-05-2024]
ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలంటే ఓటు హక్కును ప్రతి ఓటరు వినియోగించుకోవాలి. అప్పుడే మన దేశ భవిష్యత్తు బాగుంటుంది. -
గిరిజన కోటలో.. గిరిజనేతరుల ఓట్లే కీలకం
[ 10-05-2024]
ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి జరుగుతున్న ఎన్నికల సంగ్రామంలో ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపులో గిరిజనులతో పాటు గిరిజనేతరుల ఓట్లు కీలకంగా మారాయి. -
ఓటరు చీటీ అందలేదా.. ఇలా తెలుసుకోండి
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఓటరుకు సంబంధించి ఓటరు చీటీలను ఇంటింటా బీఎల్వోల సాయంతో పంపిణీ చేస్తున్నారు. -
ఎంపీగా గెలిచిన వారికి వసతులు బోలెడు
[ 10-05-2024]
ఎంపీగా గెలిచిన వారికి కేంద్ర ప్రభుత్వం అనేక వసతులు కల్పిస్తోంది. -
గ్రామస్థులను పలకరించి... కన్నీళ్లు పెట్టుకొని
[ 10-05-2024]
‘పార్టీలను పక్కన పెట్టి మీ ఊరి బిడ్డగా నన్ను ఆశీర్వదించండి. ఈ గ్రామంలో పేరుకు పోయిన సమస్యలను పరిష్కరిస్తాను. -
ఓటు వేయడం.. బాద్యతగా భావిద్దాం
[ 10-05-2024]
జిల్లాలోని నిర్మల్, ముథోల్, ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ నెల 13న నిర్వహించనున్న ఆదిలాబాద్ పార్లమెంటు ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. -
ఉద్ధృతంగా ఇంటింటి ప్రచారం
[ 10-05-2024]
ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గరపడుతోంది. ప్రచారానికి ఇంకా రెండు రోజులే మిగిలి ఉండటంతో ప్రధాన పార్టీలు కీలక నేతలు తమ ప్రచారపంథాను పూర్తిగా మార్చివేశారు. -
ప్రత్యేక కేంద్రం.. శతశాతం లక్ష్యం
[ 10-05-2024]
ప్రజాస్వామ్యంలో మంచి పాలకులను ఎన్నుకోవడానికి ఓటు హక్కు వజ్రాయుధం. ఇందుకోసం ఇప్పటికే జిల్లా అధికారులు ఓటరు నమోదు శాతం పెంపునకు కళాజాత బృందాలతో ప్రదర్శనలు, 2కే రన్, విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. -
ఇక రెండు రోజులే..
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్కు మూడు రోజులు మాత్రమే గడువు ఉండగా.. ప్రచారం శనివారం సాయంత్రానికే పరిసమాప్తం కానుంది. -
అనుమతి ఒకటి.. చేసేది మరొకటి!
[ 10-05-2024]
రహదారి నిర్మాణం కోసం అవసరమైన మొరం కోసం అనుమతులు తీసుకుని యథేచ్ఛగా వెంచర్లకు లారీల్లో మొరం తరలిస్తున్న ఉదంతం ఇది. -
ఫోన్ చేయండి.. కథలు వినండి!
[ 10-05-2024]
కథల పుస్తకాలు చదవడం ద్వారా పిల్లల్లో జ్ఞానాన్ని, ఆలోచన శక్తిని పెంపొందించవచ్చని మండల విద్యాధికారి ఎం.వెంకటేశ్వరస్వామి అన్నారు. -
చరవాణికి బానిసై విద్యార్థి ఆత్మహత్య
[ 10-05-2024]
చరవాణికి బానిసైన తొమ్మిదో తరగతి విద్యార్థి (17) ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం బోరిగాం గ్రామంలో చోటు చేసుకుంది.