జాబ్కార్డుతో ఆధార్ అనుసంధానం..
ఉపాధిహామీ పథకంలో పారదర్శకత కోసం కేంద్రం తాజాగా మరో మార్పు చేసింది. కూలీల జాబ్కార్డును ఆధార్తో అనుసంధానం చేసుకోవాలని ఆదేశించడంతో అధికారులు ఆ దిశగా చర్యలు మొదలుపెట్టారు.
ఉపాధిహామీ వేతనాల్లో పారదర్శకతకు అవకాశం
ఆసిఫాబాద్, న్యూస్టుడే
జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో అనుసంధాన అంశంపై ఉపాధి
సిబ్బందికి సూచనలిస్తున్న ఏపీవో చంద్రశేఖర్
ఉపాధిహామీ పథకంలో పారదర్శకత కోసం కేంద్రం తాజాగా మరో మార్పు చేసింది. కూలీల జాబ్కార్డును ఆధార్తో అనుసంధానం చేసుకోవాలని ఆదేశించడంతో అధికారులు ఆ దిశగా చర్యలు మొదలుపెట్టారు. జిల్లాలో ప్రస్తుతం తపాలాశాఖ, బ్యాంకులద్వారా కూలీ డబ్బులు చెల్లిస్తున్నారు. తపాలా చెల్లింపుల్లో ఆలస్యం జరుగుతుండటం, ఒక్కోసారి ఇతర ఖాతాల్లో డబ్బులు జమ కావడం వంటివి జరుగుతున్నాయి. ఇలాంటి పొరబాట్లకు అడ్డుకట్ట వేసేలా కేంద్రం ఆధార్ అనుసంధాన చెల్లింపు విధానాన్ని తెరపైకి తెచ్చింది. ఫిబ్రవరి నుంచి కొత్త విధానంలోనే చెల్లింపులు జరిగేలా ఆదేశాలు జారీ చేసింది.
ఉపాధిహామీ పథకం అమలులో పారదర్శకత కోసం ఇప్పటికే పలు సంస్కరణలు చేపట్టింది. తాజాగా కూలీ డబ్బులు చెల్లింపు విషయంలో ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేసింది. మొదట ఉపాధి పనులకు వచ్చేవారి జాబ్కార్డుల్లోని సభ్యులకు సంబంధించి అనుసంధానం చేయాలని ఆదేశించింది. జిల్లాలో 1,80,500 మంది కూలీలకు మొదట అనుసంధానం చేయాలని లక్ష్యం నిర్దేశించింది. దీంతో క్షేత్ర సహాయకులు, సాంకేతిక సహాయకులు, మేట్లు కూలీల ఆధార్, జాబ్కార్డుల వివరాల సేకరణలో నిమగ్నమయ్యారు. ఇప్పటి వరకు 1,19,081 మందివి అనుసంధానం కోసం అంతర్జాలంలో నమోదు చేశారు. ఇంకా 56,654 మందివి నమోదు చేయాల్సి ఉంది. మృతిచెందిన వారి వివరాలను తొలగిస్తున్నారు. ఈ నెల చివరి వరకు ఇవి పూర్తయితే.. వచ్చేనెల నుంచి ఆధార్ అనుసంధాన విధానంలో కూలీ డబ్బుల చెల్లింపులు జరుగుతాయి. అనుసంధానం కాకుంటే నిలిచిపోయే అవకాశం ఉంది.
నకిలీలకు అడ్డుకట్ట..
జిల్లాలో మేజారిటీ కూలీలకు తపాలాశాఖ ద్వారా ఉపాధి కూలీ డబ్బులు చెల్లిస్తున్నారు. కొన్ని మండలాల్లో 4 నుంచి 5 గ్రామపంచాయతీలకు ఒకే బీపీఎం కూలీ డబ్బులు చెల్లిస్తున్నారు. వేల సంఖ్యలో కూలీలు ఉండటంతో.. చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. పైగా కొన్నిచోట్ల కూలీల నుంచి కమీషన్ తీసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఇవే కాకుండా నకిలీలకు అడ్డుకట్ట పడుతుంది. ఆధార్ అనుసంధానంతో నిజమైన కూలీ ఖాతాలోకే డబ్బులు చేరనున్నాయి.
సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు..
ఆధార్ అనుసంధానం చేస్తున్న క్రమంలో సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు సిబ్బంది వాపోతున్నారు. ఆధార్కార్డు మార్చుకున్న వారిలో ఏవైనా స్వల్ప తేడాలంటే.. అలాంటివి అనుసంధానం కావడంలేదు. జాబ్కార్డులో, ఆధార్ కార్డులోని పేరులో ఏ మాత్రం తేడా వచ్చినా అనుమతించడం లేదు. వివాహమై కుటుంబ జాబ్కార్డు నుంచి తొలగించి, కొత్తగా వచ్చిన భాగస్వామితో కొత్త జాబ్కార్డు తీసుకోవడంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలాంటి వాటి విషయంలో వివరాలు నమోదు చేసి ఎంపీడీవోల సిఫార్సుతో డీఆర్డీవో లాగిన్కు అక్కడి నుంచి డీపీసీ లాగిన్కు పంపించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అక్కడ పరిష్కారం కాని వాటిని రాష్ట్రస్థాయికి పంపించాల్సి ఉంటుంది.
సర్వే కొనసాగుతోంది..
సురేందర్, డీఆర్డీవో
ఉపాధి కూలీల వేతన చెల్లింపులో ఇబ్బందులు రాకుండా ఆధార్ ఆనుసంధానం చేస్తున్నాం. ఆధార్ కార్డులోని వివరాలు, ఇదివరకున్న వివరాల్లో తేడా ఉంటే కూలీ డబ్బుల చెల్లింపు నిలిచే అవకాశం ఉంది. ఇలాంటివి తలెత్తకుండా జాబ్కార్డు కలిగిన ప్రతీ కూలీ ఆధార్ అనుసంధానం చేసేలా సర్వే కొనసాగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దూసుకెళ్తున్న వినియోగం.. షెడ్డుకొస్తున్న నియంత్రికలు
[ 26-04-2024]
జిల్లాలో ఎండలు మండిపోతుండటంతో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. బోరు బావుల్లో నీరు బాగా లోతుకు వెళుతుండటంతో దాని ప్రభావం నియంత్రికలపై పడి కాలిపోతున్నాయి. -
రెఫరీగా మారి.. ప్రచారం చేసి!
[ 26-04-2024]
సిరికొండ మండలం వాయిపేట్, రాజన్పేట్, చెమ్మన్గూడ తదితర గ్రామాల్లో భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ గురువారం ప్రచారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. -
సివిల్స్ ర్యాంకర్కు గవర్నర్ సన్మానం
[ 26-04-2024]
ఇటీవల ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో జాతీయస్థాయిలో 790 ర్యాంకు సాధించిన రేకులవార్ శుభంతో పాటు వారి తల్లిదండ్రులు జీవిత, సత్యనారాయణలను రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ సన్మానించారు. -
పేదలకు అండగా.. గిరిజన క్యాంటిన్
[ 26-04-2024]
టీ తాగాలన్నా కనీసం రూ.6 వెచ్చించాల్సిందే. అలాంటి పరిస్థితిలో కేవలం రూ.5 లకే అందిస్తున్న భోజనం ఉట్నూరువాసుల కడుపు నింపుతోంది. ఏజెన్సీలోని ఆదిమ గిరిజనుల(పీవీటీజీ)ను ఆదుకునేందుకు ఐటీడీఏ అధికారులు పలు పథకాలను ప్రవేశపెడుతున్నారు. -
రిమ్స్ సంచాలకుడిని బ్లాక్మెయిల్ చేసే యత్నం
[ 26-04-2024]
తాను స్పెషల్ బ్రాంచీ పోలీసునని చెప్పి రిమ్స్ సంచాలకుడు రాఠోడ్ జైసింÞ్ను, గజానంద్ ఆసుపత్రి వైద్యుడు అభిజిత్ నుగుర్వార్ను బ్లాక్ మెయిల్ చేసే యత్నం చేసిన గుర్తు తెలియని వ్యక్తిపై ఆదిలాబాద్ రెండో పట్టణ పోలీసులు గురువారం రాత్రి కేసు నమోదు చేశారు. -
వివాహితపై హెడ్కానిస్టేబుల్ లైంగిక వేధింపులు
[ 26-04-2024]
శాంతి, భద్రతలు కాపాడుతూ ప్రజలకు రక్షణ కల్పించాల్సిన హెడ్ కానిస్టేబుల్ మావల పోలీసు స్టేషన్ పరిధిలోని ఒక కాలనీలో వివాహితపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ సంఘటన గురువారం వెలుగు చూసింది. -
జేఈఈ మెయిన్స్లో గిరిజన విద్యార్థిని ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఉట్నూరు మండలం జైత్రంతండాకు చెందిన గిరిజన విద్యార్థిని చౌహాన్ మేఘన ప్రతిభ కనబర్చి పలువురి మన్ననలు అందుకున్నారు. -
గొలుసుకట్టు వ్యాపారంలో ‘బంపర్ ఆఫర్’
[ 26-04-2024]
అమాయకులను నిండా ముంచిన గొలుసుకట్టు వ్యాపారంలో కంపెనీ ఏజెంట్లకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది. డిపాజిట్దారులకు తిరిగి సొమ్మును చెల్లించే క్రమంలో హైదరాబాద్ నగరశివారులో ఉన్న భూమిని ప్రధాన ఏజెంట్లకు విక్రయించాలని యోచిస్తోంది. -
ఆశీర్వదించండి.. ఎంపీగా గెలిపించండి
[ 26-04-2024]
గోడం నగేష్ను ఆశీర్వదించి గెలిపించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. గురువారం భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ ఎంపీ రమేష్ రాఠోడ్, యువ నాయకుడు రితీష్ రాఠోడ్లతో కలిసి ఉట్నూరు మండలం పులిమడుగు, సాలెవాడ, కోపర్ఘడ్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
కాంగ్రెస్తోనే పేదలకు భవిష్యత్తు
[ 26-04-2024]
కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే పేదల బతుకులు బాగుపడతాయని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ అన్నారు. ఆదివారం పార్టీ నాయకులతో కలిసి పట్టణంలోని ఖానాపూర్, కొలీపుర, బొక్కలగూడ, అంబేడ్కర్నగర్లో రోడ్ షోలో పాల్గొన్నారు. -
తుక్కు పేరిట అక్రమ దందా!
[ 26-04-2024]
అనుమతులు, లైసెన్సులు లేకుండానే పలువురు ‘తుక్కు’ పేరిట జిల్లాలో అక్రమ దందా కొనసాగిస్తున్నారు. జిల్లాలోని ప్రధాన రహదారుల సమీపంలోని పెద్ద ప్రహరీలతో కూడిన గోదాములను ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు సాగిస్తున్నారు. -
నాలుగు గంటల వరకే పోలింగ్
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, పాలనాధికారి వెంకటేష్ ధోత్రే పేర్కొన్నారు. ఓటర్లందరికి ఓటరు చీటీలను అందజేస్తున్నామన్నారు. -
అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం
[ 26-04-2024]
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలైన ఘటన కుమురంభీం జిల్లా బెజ్జూరు మండలం పోతపల్లి-కోర్తేగూడ గ్రామాల మధ్య గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. -
చెట్టు పేరు చెప్పి.. ప్లాట్లు అంటగట్టి..
[ 26-04-2024]
మంచిర్యాల జిల్లా కేంద్రంలో అమ్మకానికి ఖాళీ స్థలాలు లేకపోవడంతో భూఅక్రమ వ్యాపారులు సరిహద్దు గ్రామాల్లోని వ్యవసాయ భూములను నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లుగా మార్చి అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. -
వెల్లువెత్తిన నామినేషన్లు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామపత్రాల స్వీకరణ పర్వం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ఖాన్ నామపత్రాలు స్వీకరించారు. -
దారి మళ్లించి.. మురుగుకాలువ ఆక్రమించి
[ 26-04-2024]
కబ్జాల తీరు కొంత పుంతలు తొక్కుతోంది. కబ్జాదారులకు హద్దూఅదుపులు లేకుండా పోతుండడంతో వారు రెచ్చిపోతున్నారు. పట్టణంలో మురుగుకాలువలను కబ్జా చేస్తున్నా మున్సిపల్ యంత్రాంగం చోద్యం చూస్తుంది. -
సన్న బియ్యం ధరలు పైపైకి
[ 26-04-2024]
బహిరంగ మార్కెట్లో సన్నబియ్యం ధరలు రోజురోజుకి సామాన్యులకు అందనంత ఎత్తుకు ఎదుగుతున్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబాలు సన్నబియ్యం కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. -
లైంగిక దాడి కేసులో పదేళ్ల జైలు
[ 26-04-2024]
మాయమాటలు చెప్పి బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో నేరస్థుడికి జైలు శిక్ష విధిస్తూ నిర్మల్ న్యాయస్థానం తీర్పునిచ్చింది. జిల్లా న్యాయస్థానాల సమన్వయాధికారి సక్రియానాయక్ తెలిపిన వివరాలిలా.. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
తూర్పున ఉత్సాహం.. పశ్చిమాన నైరాశ్యం
[ 26-04-2024]
ఉమ్మడి జిల్లాలో లోక్సభ ఎన్నికల ప్రచార శైలి భిన్నంగా సాగుతోంది. తూర్పున పెద్దపల్లి లోక్సభ స్థానం పరిధిలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరులో ప్రచారం ఉత్సాహంగా సాగుతుంటే పశ్చిమాన ఆదిలాబాద్ నియోజకవర్గంలోకి వచ్చే సిర్పూర్, ఆసిఫాబాద్, ఖానాపూర్, ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముథోల్లో మందకొడిగా కొనసాగుతోంది. -
ఇక లెక్క పక్కా!
[ 26-04-2024]
హరితహారం కార్యక్రమం విజయవంతం చేయడానికి అధికార యంత్రాంగం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకెళ్తోంది. గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టనుంది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు