చెన్నూరుపై వీడని ఉత్కంఠ
చెన్నూరు నియోజకవర్గంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్, వామపక్షాల పొత్తులో భాగంగా చెన్నూరును సీపీఐకి కేటాయిస్తారన్న ప్రచారంతో ఇరు పార్టీల శ్రేణులు ఆందోళనలో ఉన్నాయి. పొత్తులో ఏ పార్టీకి సీటు దక్కుతుందో తెలియని ఆయోమయ పరిస్థితులు నెలకొనగా నేడు ఉత్కంఠ వీడే అవకాశాలు ఉన్నాయి.
కాంగ్రెస్కా.. సీపీఐకా?
చెన్నూరు, చెన్నూరు గ్రామీణం, మందమర్రి పట్టణం, న్యూస్టుడే : చెన్నూరు నియోజకవర్గంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్, వామపక్షాల పొత్తులో భాగంగా చెన్నూరును సీపీఐకి కేటాయిస్తారన్న ప్రచారంతో ఇరు పార్టీల శ్రేణులు ఆందోళనలో ఉన్నాయి. పొత్తులో ఏ పార్టీకి సీటు దక్కుతుందో తెలియని ఆయోమయ పరిస్థితులు నెలకొనగా నేడు ఉత్కంఠ వీడే అవకాశాలు ఉన్నాయి. పొత్తులో భాగంగా కొత్తగూడెంతోపాటు చెన్నూరు నియోజకవర్గాన్ని సీపీఐకి కేటాయిస్తూ కాంగ్రెస్ అదిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. బుధవారం కాంగ్రెస్ ఎన్నికల కమిటీ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించనున్నట్లు తెలిసింది. దీంతో చెన్నూరుపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడే అవకాశాలు ఉన్నాయి.
శ్రేణుల్లో నిరాశ
చెన్నూరు స్థానం ఆశిస్తూ కాంగ్రెస్ నుంచి 14 మంది ఆశావహులు ఎన్నికల ప్రచారంలో తిరిగారు. అభ్యర్థిత్వం ఖరారు కాకున్నా ఎవరి ప్రయత్నాలు వారు చేపట్టారు. వామపక్షాల పొత్తులో ఈ స్థానం సీపీఐకి కేటాయిస్తున్నట్లు ప్రచారం జరగడంతో ఆందోళనకు గురై కొంత వెనక్కి తగ్గారు. ఇక్కడ బలంగా ఉన్న కాంగ్రెస్ను కాదని సీపీఐకి కేటాయించడంపై పార్టీ శ్రేణులు నియోజకవర్గ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. ఇంతకాలం క్షేత్రస్థాయిలో ప్రచారం సాగించిన నేతలు తమ రాజకీయ భవిష్యత్తు ఏంటని ఆందోళనకు గురవుతున్నారు. అయితే కార్మిక క్షేత్రానికి చెందిన నల్లాల ఓదెలు కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం భారాసను వీడి కాంగ్రెస్లో చేరారు. అధిష్ఠానం ఓదెలు వైపే మొగ్గుచూపుతోందని ప్రచారం జరిగింది. సీపీఐకి కేటాయిస్తున్నట్లు వార్తలు రావడంతో ఆయన రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తి నెలకొంది. అధికారికంగా ప్రకటన వెలువడిన అనంతరం ఓదెలు తమ అనుచరవర్గంతో చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు సమాచారం.
సీపీఐ అభ్యర్థిపై చర్చ
చెన్నూరుపై సీపీఐ పార్టీ అంతగా దృష్టి సారించకపోవడంతో నియోజకవర్గంలో ఆపార్టీ అభ్యర్థి ఎవరనేది ఇప్పటి వరకు తెరపైకి రాలేదు. నియోజకవర్గంలో ఎవరి పేరు ఖరారు కాకపోగా మంచిర్యాల నియోజకవర్గంలోని నస్పూరుకు చెందిన ఓ ప్రజాప్రతినిధి బరిలో నిలవనున్నట్లు తెలుస్తోంది. అధిష్ఠానం స్పష్టమైన నిర్ణయం తీసుకుంటే తప్ప అభ్యర్థి ఎవరనేది తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.
కాంగ్రెస్లోకి ఓ కీలక నేత?
భాజపాకు చెందిన ఓ కీలక నేత కాంగ్రెస్లో చేరుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఇక్కడి నుంచి పోటీ చేసేందుకే ఆయన కాంగ్రెస్లో చేరుతున్నారని ప్రచారం జరుగుతున్న క్రమంలో ఈ స్థానం సీపీఐకి కేటాయిస్తున్నారన్న అంశం తెరపైకి రావడంతో అంతా కంగుతింటున్నారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని.. చివరి నిమిషంలో రాజకీయ పరిస్థితులు మారడం సహజమని విశ్లేషకులు భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వంతెనలు లేక.. చింతలు తీరక
[ 29-04-2024]
వర్షంవస్తే ఆదిలాబాద్ జిల్లాలో నేటికీ బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండే వందలాది గ్రామాలున్నాయి. అక్కడ పురిటి నొప్పులతో సకాలంలో ఆసుపత్రులకు వెళ్లలేక మృత్యువాత పడుతున్న తల్లుల వేదన పట్టించుకునే వారు కరవయ్యారు. -
గొలుసుకట్టు.. అంతా కనికట్టు
[ 29-04-2024]
మీకు స్మార్ట్ఫోన్ ఉంటే చాలు.. రోజుకు రూ.5 వేలు మొదలుకొని నెలకు రూ.లక్షపైనే ఆదాయం పొందవచ్చని నమ్మబలికింది ఓ విదేశీ ఆన్లైన్ కంపెనీ. సంప్రదింపులు లేకుండా చాటింగ్ ద్వారా లావాదేవీలు నడిపి పెద్ద ఎత్తున యువకులు పెట్టుబడి పెట్టేలా ఎరవేసింది. -
పెరిగిన వినియోగం.. తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు
[ 29-04-2024]
ఎండల తీవ్రత కారణంగా విద్యుత్తు వాడకం పెరిగిపోవడంతో గృహజ్యోతి కింద జీరో బిల్లులు పొందే వారి సంఖ్య తగ్గిపోయింది. ప్రభుత్వ నిబంధనల మేరకు 200 యూనిట్ల లోపు వినియోగించుకునే వారికి జీరో బిల్లు ఇస్తారు. -
ఎన్నికల వేళ.. గొలుసు దుకాణాల గోల
[ 29-04-2024]
‘లోక్సభ ఎన్నికల కోడ్ అమలులో వచ్చిన సందర్భంగా గంజాయి అక్రమ రవాణా, మద్యం గొలుసుదుకాణదారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇందుకు సంబంధించిన వ్యక్తులపై కేసులు నమోదు చేస్తాం. -
తాళం వేసుందా.. సొమ్ము గోవిందా
[ 29-04-2024]
జిల్లాలో తాళం వేసిన ఇళ్లు, దుకాణాలే లక్ష్యంగా చోరీలు జరుగుతున్నాయి. ప్రస్తుతం పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో చాలామంది విహారయాత్రలు, ప్రముఖ దేవాలయాలు, బంధువుల ఇళ్లకు వెళ్తుంటారు. -
పురిటిలోనే బిడ్డ.. వైద్యం అందక తల్లి మృతి
[ 29-04-2024]
కాగజ్నగర్ పట్టణం పెట్రోల్బంకు ఏరియాలోని ఓ ప్రైవేటు ప్రసూతి ఆసుపత్రిలో గర్భిణి మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన చోటు చేసుకుందని బాధిత బంధువులు ఆదివారం రాత్రి ఆసుపత్రి ఎదుట మృతదేహంతో ఆందోళన చేపట్టారు. -
ఓటు మీది.. అభివృద్ధి మాది
[ 29-04-2024]
పదేళ్లలో కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో భారాస చేసిందేమి లేదని, కాంగ్రెస్తోనే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. -
తాగునీటి కష్టాలు మొదలు..
[ 29-04-2024]
గత నెల రోజులుగా ఎండ తీవ్రత పెరగడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. మంచిర్యాల పట్టణ ప్రజలకు తాగునీరు సరఫరా చేయడానికి గోదావరినదిలో నిర్మించిన ఇన్టేక్వెల్స్ వద్ద నీటిమట్టం ఇప్పటికే తగ్గిపోయింది. -
కళాశాలలు డీలా.. గురుకులాలు భళా
[ 29-04-2024]
ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ కళాశాలలు నిరాశపరిచాయి. ప్రైవేట్కు దీటుగా గురుకులాలు ఉత్తీర్ణత శాతం సాధించాయి. రాష్ట్రస్థాయిలో ఈ ఏడాది 46.29 శాతంతో ప్రథమంలో 32వ స్థానం, 59.53 శాతంతో ద్వితీయంలో 30వ స్థానాల్లో మంచిర్యాల నిలిచింది. -
పోలింగ్ చీటీ.. ఓటరు దిక్సూచీ
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికల నిర్వహణ కోసం అధికార యంత్రాంగం అన్నీ సిద్ధం చేస్తోంది. ఓటర్లు అందరూ స్వేచ్ఛాయుతంగా ఓటువేసేందుకు సౌకర్యాల కల్పనకు చర్యలు చేపట్టిన ఎన్నికల సంఘం ఓటర్లకు పోలింగ్ చీటీలు పంపిణీ చేస్తోంది. -
ఎన్నికలకు సమాయత్తం
[ 29-04-2024]
ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని జిల్లాలోని నిర్మల్, ముథోల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో ఎన్నికల సమరానికి జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. జిల్లా పాలనాధికారి అశిష్ సంగ్వాన్ నేతృత్వంలో ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. -
ఓటు... మరింత చేరువ!
[ 29-04-2024]
ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో అనేక గ్రామాల్లో ఓటర్ల సంఖ్య తక్కువగా ఉండటంతో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడం కుదిరేది కాదు. ఆయా గ్రామాల ప్రజలు ఓట్లు వేయాలంటే కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. -
పరిమితి మించితే చిక్కులే..
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికల నిర్వహణలో కీలక ఘట్టమైన నామపత్రాల స్వీకరణపర్వం పూర్తయింది. పెద్దపల్లి, ఆదిలాబాద్ లోక్సభ స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇతర అభ్యర్థులు నామపత్రాలను దాఖలు చేశారు. -
16 శాతం రాకుంటే డిపాజిట్ గల్లంతే..
[ 29-04-2024]
ఎన్నికల్లో పోటీచేసిన పలువురు అభ్యర్థులు ఫలితాలు వెలువడిన తర్వాత డిపాజిట్లు కోల్పోయారనే మాటలు తరచూ వింటాం.. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఎన్నికల సంఘం నిర్ణయించిన రుసుమును సంబంధిత ఆర్వో వద్ద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. -
57 మంది అధ్యాపకులకు నోటీసులు
[ 29-04-2024]
ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం తగ్గడంపై ఇంటర్మీడియట్ విద్యాశాఖ దృష్టి సారించింది. జిల్లాలోని 10 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జనరల్, వొకేషనల్ విభాగంలో ప్రథమ సంవత్సరంలో 29.28 శాతం,
తాజా వార్తలు (Latest News)
-
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
-
రంగంలోకి బైడెన్.. గాజాలోకి మరింత సాయానికి ఇజ్రాయెల్ అనుమతి
-
యూపీఎస్సీ ఫలితాల్లో టీ మాస్టర్ కుమారుడి సత్తా
-
డబ్బన్నావ్.. డబ్బాకొట్టుకున్నావ్!!
-
‘ప్రభుత్వానికి భజన చేస్తూ.. కొన్ని సంఘాలు దిగజారాయి’
-
అంతా సొంత డబ్బా.. హామీలపై మాట్లాడరేమబ్బా!