logo

గణేష్ మందిరంలో చోరీ

ఆదిలాబాద్‌ పట్టణంలోని రిమ్స్ ఎదుట ఉన్న గణేష్ మందిరంలో ఇద్దరు వ్యక్తులు సోమవారం రాత్రి హుండీ చోరీ చేశారు.

Published : 16 Apr 2024 19:03 IST

ఎదులాపురం: ఆదిలాబాద్‌ పట్టణంలోని రిమ్స్ ఎదుట ఉన్న గణేష్ మందిరంలో ఇద్దరు వ్యక్తులు సోమవారం రాత్రి హుండీ చోరీ చేశారు. దొంగతనం కేసులో గత నెల 13న జైలుకు వెళ్ళిన మహమ్మద్ మోయిజ్, షేక్ అబ్దుల్ ఫయాజ్ లు సోమవారం జైలు నుంచి బెయిల్ పై విడుదలయ్యారు. అనంతరం రాత్రి మళ్ళీ చోరీకి పాల్పడ్డారు. టూ టౌన్ ఎస్ఐ జీవీ రమణారెడ్డి మంగళవారం వాహనాల తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా వెళుతున్న వారిని అదుపులోకి తీసుకొని విచారించగా గణేష్ మందిరంలో చోరీ చేసినట్లు వారు అంగీకరించారు. దీంతో కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని