విద్యార్థి ఆత్మహత్య ఘటనపై ఉన్నతాధికారుల సమీక్ష
బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థి ఆత్మహత్యపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. మంగళవారం ఎస్పీ జానకిషర్మిల, సంబంధిత అధికారులతో కలిసి జిల్లా పాలనాధికారి అశిష్ సంగ్వాన్ బాసరకు వచ్చారు.
ముథోల్(బాసర), న్యూస్టుడే: బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థి ఆత్మహత్యపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. మంగళవారం ఎస్పీ జానకిషర్మిల, సంబంధిత అధికారులతో కలిసి జిల్లా పాలనాధికారి అశిష్ సంగ్వాన్ బాసరకు వచ్చారు. విశ్వవిద్యాలయంలోని సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యార్థి ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై విశ్వవిద్యాలయం అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థి హాజరు శాతం తగ్గితే యూనివర్సిటీ పరంగా కౌన్సిలింగ్ నిర్వహించారా అనే ప్రశ్నకు అధికారులు సరైన సమాధానం చెప్పలేదని తెలిసింది. వసతి గృహంలోని గదుల్లో ఏం జరుగుతుందో మీకు తెలుస్తోందా, వరుసగా విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటుంటే ఏం చర్యలు తీసుకుంటున్నారని మందలించారని సమాచారం.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనిపై ఏం చర్యలు తీసుకుంటారో పూర్తి స్థాయిలో నివేదిక అందజేయాలని సూచించారు. 60-65 మంది విద్యార్థులను బృందంగా విభజించి ఒక ఫ్యాకల్టీని కేటాయించాలన్నారు. తరచూ విద్యార్థులను గమనించాలన్నారు. కౌన్సిలింగ్ విభాగాన్ని బలోపేతం చేయాలని సూచించారు. వసతి గృహాల్లో సీసీ టీవీలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. భైంసా ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్, ఆర్జీయూకేటీ ఆయా విభాగాల అధ్యాపకులు పాల్గొన్నారు.
నిర్లక్ష్యం చేస్తే చర్యలు
నిర్మల్ పట్టణం: జిల్లాకేంద్రంలో పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా పాలనాధికారి అశిష్ సాంగ్వాన్ మున్సిపల్ అధికారులు, సిబ్బందిని హెచ్చరించారు. పట్టణంలోని ఈద్గాం, శివాజీచౌక్ ప్రాంతాల్లో మంగళవారం పర్యటించారు. మురుగుకాలువలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ప్రతి ఇంటి నుంచి తడి, పొడిచెత్తను వేరువేరుగా సేకరించి డంపింగ్యార్డుకు తరలించాలన్నారు. ప్రధాన కూడళ్లు, రహదారులు, మురుగుకాలువల్లో చెత్తచెదారం పడేయకుండా పరిశుభ్రంగా ఉంచాలని చెప్పారు. రహదారులపై చెత్త వేస్తే దుకాణం, హోటల్స్, మాల్స్, ఆసుపత్రుల యజమానులకు అపరాధ రుసుము విధించాలని ఆదేశించారు. వందశాతం ఆస్తి పన్ను వసూళ్లు చేపట్టాలన్నారు. అదనపు పాలనాధికారి ఫైజాన్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్ సి.వి.ఎన్.రాజు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అగ్రనేతలొస్తున్నారు
[ 30-04-2024]
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయం క్రమంగా వేడెక్కుతోంది. అగ్రనేతలు రానుండటంతో ప్రచారం పతాకస్థాయికి చేరుకుంటోంది. -
కాంగ్రెస్కు ఓటేస్తే భవిష్యత్తుకు లేదు గ్యారెంటీ!
[ 30-04-2024]
హస్తం పార్టీకి ఓటు వేస్తే భవిష్యత్తుకు గ్యారెంటీ లేదని, ఉచిత పథకాలు ఉత్తి మాటలేనని భారాస ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు, మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. -
పెరుగుతున్న ఎండ.. వసతులుంటేనే అండ
[ 30-04-2024]
రోజురోజుకూ పెరుగుతున్న ఎండల తీవ్రత కారణంగా లోక్సభ ఎన్నికల నిర్వహణ విషయంలో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోక తప్పని పరిస్థితి నెలకొంది. -
దురాశకు పోయి.. దుఃఖానికి చేరువై
[ 30-04-2024]
ప్రభుత్వ ఉద్యోగం.. చాలామందికి తీరని కల. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎంతో కష్టపడితే, అదృష్టం కలిసొస్తే తప్ప సొంతమవని జీవితం. -
చోదకుల నిర్లక్ష్యం.. గాలిలో ప్రాణాలు
[ 30-04-2024]
కారణాలు ఏమైనా రహదారులపై సరకు రవాణా వాహనాలు నిర్లక్ష్యంగా నిలుపుతున్నారు. నిద్రమత్తు, అతివేగం, పొగమంచు, తదితర కారణాలతో రహదారిపై నిలిచి ఉన్న వాహనాలను గమనించలేని ప్రయాణికుల వాహనాల చోదకులు వాటిని బలంగా ఢీకొంటున్న ఘటనలు పెరుగుతున్నాయి. -
ప్రజాప్రతినిధుల తీరు.. నాయకుల బేజారు
[ 30-04-2024]
జిల్లాలో ఇటీవల ఓ ప్రధాన పార్టీ సభ నిర్వహించింది. ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి జనసమీకరణ బాధ్యతను ఆయా వార్డుల బాధ్యులకు అప్పగించారు. ఒక్కొక్కరికి ఒక్కో సంఖ్యను లక్ష్యంగా ఇచ్చి పూర్తి చేయాలని ఆదేశించారు. -
భారాసను గెలిపిస్తేనే హామీల అమలు
[ 30-04-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారాసను గెలిపిస్తేనే కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలుకు నోచుకుంటాయని పెద్దపల్లి పార్లమెంట్ స్థానం భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. -
భాజపాకు కలిసొచ్చేనా?
[ 30-04-2024]
పెద్దపల్లి ఎంపీ బొర్లకుంట వెంకటేశ్నేత పార్టీ మార్పు ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. హైదరాబాద్లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి సమక్షంలో సోమవారం ఆయన భాజపా తీర్థం పుచ్చుకున్నారు. -
ధనార్జనే ధ్యేయం.. వైద్యం ప్రాణాంతకం
[ 30-04-2024]
రెండ్రోజుల కిందట కాగజ్నగర్లోని నౌగాంబస్తీకి చెందిన నిండు గర్భిణి ప్రసూతి నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి ఉదయం వెళ్లింది. స్కానింగ్ చేసిన వైద్యులు పురిటిల్లోనే శిశువు మృతి చెందినట్లు నిర్ధారించారు. -
నిబంధనలకు లోబడి ఎన్నికల విధుల నిర్వహణ
[ 30-04-2024]
లోకసభ ఎన్నికల్లో భాగంగా సిర్పూరు, ఆసిఫాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్నికల ప్రక్రియను నిబంధనలకు లోబడి సమర్థంగా నిర్వహించాలని ఆదిలాబాద్ పార్లమెంటు -
ఆదిలాబాద్ బరిలో 12 మంది అభ్యర్థులు
[ 30-04-2024]
ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. నామపత్రాల పరిశీలన అనంతరం 13 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. -
కొనసాగుతున్న సార్వత్రిక పరీక్షలు
[ 30-04-2024]
ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా మంచిర్యాల, బెల్లంపల్లి డివిజన్ కేంద్రాల్లో 8 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలను విద్యాశాఖ నిర్వహిస్తోంది.