కరెంటోళ్లు కనికరించరేం?
జిల్లా వ్యాప్తంగా యాసంగి సీజన్ ఆలస్యం కావడంతో.. ఇప్పుడిప్పుడే పంటలు చివరి దశకు చేరుతున్నాయి. వరి పంట కంకి దశలో ఉంది.
పంటలు ఎండుతున్నా.. నియంత్రికల మరమ్మతులు కరవు!
కాగజ్నగర్ గ్రామీణం, న్యూస్టుడే: జిల్లా వ్యాప్తంగా యాసంగి సీజన్ ఆలస్యం కావడంతో.. ఇప్పుడిప్పుడే పంటలు చివరి దశకు చేరుతున్నాయి. వరి పంట కంకి దశలో ఉంది. ఈ సమయంలో నీటి తడులు అందించాల్సి ఉండగా.. విద్యుత్తు సరఫరాలో ఎదురవుతున్న సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా నియంత్రికల మరమ్మతుల విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని, దీంతో పంటలు ఎండిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలోని చెరువులు, ప్రాజెక్టులు, బోరుబావుల ఆయకట్టు కింద ఈ యాసంగిలో 18,034 ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేశారు. ఆసిఫాబాద్, కాగజ్నగర్ సబ్ డివిజన్ల పరిధిలో వ్యవసాయ కనెక్షన్లు 12,812 వరకు ఉండగా.. 5,921 నియంత్రికలు ఉన్నాయి. అత్యవసర వేళల్లో కొన్నింటిని అధికారులు నిల్వ ఉంచుకోవాలి. ప్రస్తుత వేసవిలో చాలా ముఖ్యం. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైనా మరమ్మతులకు గురైతే 48 గంటల్లో మరొకటి అమర్చాలనే నిబంధనలున్నాయి. నియంత్రికలను మరమ్మతు చేసి పొలం వరకు రవాణా చేయడానికి విద్యుత్తు శాఖనే ఖర్చులు భరించాల్సి ఉంటుంది. కానీ రైతుల అవసరాలను ఆసరాగా తీసుకుని రవాణా ఖర్చుల భారం వారిపైనే వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా బోరుబావుల కింద సాగు చేస్తున్న అన్నదాతలకు నియంత్రికల మరమ్మతుల సమస్య కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. కొన్ని మండలాల్లో ఏఈ స్థాయి అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అత్యవసర వేళల్లో చరవాణిలో సంప్రదించినా స్పందించడం లేదని, చేయి తడిపిన వారికే పనులు చేస్తున్నారని వాపోతున్నారు.
ఈజ్గాం శివారులోని పొలంలో మరమ్మతుకు నోచుకోని నియంత్రిక వద్ద ఉన్న రైతు పేరు రాంటెంకి మల్లయ్య. మూడు ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేశారు. నాట్లు పూర్తికాగానే నియంత్రిక మరమ్మతులకు గురైంది. పలుమార్లు ఏఈకి సమస్యపై సమాచారం ఇచ్చినప్పటికీ నెలరోజులైనా మరమ్మతులు చేయలేదని, వేరేది అమర్చలేదని వాపోతున్నారు. బోరులో నీరున్నా విద్యుత్తు లేక పొలం మొత్తం ఎండిపోయింది. దీంతో అతను పంటనే వదిలేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అగ్రనేతలొస్తున్నారు
[ 30-04-2024]
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయం క్రమంగా వేడెక్కుతోంది. అగ్రనేతలు రానుండటంతో ప్రచారం పతాకస్థాయికి చేరుకుంటోంది. -
కాంగ్రెస్కు ఓటేస్తే భవిష్యత్తుకు లేదు గ్యారెంటీ!
[ 30-04-2024]
హస్తం పార్టీకి ఓటు వేస్తే భవిష్యత్తుకు గ్యారెంటీ లేదని, ఉచిత పథకాలు ఉత్తి మాటలేనని భారాస ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు, మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. -
పెరుగుతున్న ఎండ.. వసతులుంటేనే అండ
[ 30-04-2024]
రోజురోజుకూ పెరుగుతున్న ఎండల తీవ్రత కారణంగా లోక్సభ ఎన్నికల నిర్వహణ విషయంలో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోక తప్పని పరిస్థితి నెలకొంది. -
దురాశకు పోయి.. దుఃఖానికి చేరువై
[ 30-04-2024]
ప్రభుత్వ ఉద్యోగం.. చాలామందికి తీరని కల. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎంతో కష్టపడితే, అదృష్టం కలిసొస్తే తప్ప సొంతమవని జీవితం. -
చోదకుల నిర్లక్ష్యం.. గాలిలో ప్రాణాలు
[ 30-04-2024]
కారణాలు ఏమైనా రహదారులపై సరకు రవాణా వాహనాలు నిర్లక్ష్యంగా నిలుపుతున్నారు. నిద్రమత్తు, అతివేగం, పొగమంచు, తదితర కారణాలతో రహదారిపై నిలిచి ఉన్న వాహనాలను గమనించలేని ప్రయాణికుల వాహనాల చోదకులు వాటిని బలంగా ఢీకొంటున్న ఘటనలు పెరుగుతున్నాయి. -
ప్రజాప్రతినిధుల తీరు.. నాయకుల బేజారు
[ 30-04-2024]
జిల్లాలో ఇటీవల ఓ ప్రధాన పార్టీ సభ నిర్వహించింది. ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి జనసమీకరణ బాధ్యతను ఆయా వార్డుల బాధ్యులకు అప్పగించారు. ఒక్కొక్కరికి ఒక్కో సంఖ్యను లక్ష్యంగా ఇచ్చి పూర్తి చేయాలని ఆదేశించారు. -
భారాసను గెలిపిస్తేనే హామీల అమలు
[ 30-04-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారాసను గెలిపిస్తేనే కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలుకు నోచుకుంటాయని పెద్దపల్లి పార్లమెంట్ స్థానం భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. -
భాజపాకు కలిసొచ్చేనా?
[ 30-04-2024]
పెద్దపల్లి ఎంపీ బొర్లకుంట వెంకటేశ్నేత పార్టీ మార్పు ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. హైదరాబాద్లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి సమక్షంలో సోమవారం ఆయన భాజపా తీర్థం పుచ్చుకున్నారు. -
ధనార్జనే ధ్యేయం.. వైద్యం ప్రాణాంతకం
[ 30-04-2024]
రెండ్రోజుల కిందట కాగజ్నగర్లోని నౌగాంబస్తీకి చెందిన నిండు గర్భిణి ప్రసూతి నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి ఉదయం వెళ్లింది. స్కానింగ్ చేసిన వైద్యులు పురిటిల్లోనే శిశువు మృతి చెందినట్లు నిర్ధారించారు. -
నిబంధనలకు లోబడి ఎన్నికల విధుల నిర్వహణ
[ 30-04-2024]
లోకసభ ఎన్నికల్లో భాగంగా సిర్పూరు, ఆసిఫాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్నికల ప్రక్రియను నిబంధనలకు లోబడి సమర్థంగా నిర్వహించాలని ఆదిలాబాద్ పార్లమెంటు -
ఆదిలాబాద్ బరిలో 12 మంది అభ్యర్థులు
[ 30-04-2024]
ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. నామపత్రాల పరిశీలన అనంతరం 13 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. -
కొనసాగుతున్న సార్వత్రిక పరీక్షలు
[ 30-04-2024]
ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా మంచిర్యాల, బెల్లంపల్లి డివిజన్ కేంద్రాల్లో 8 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలను విద్యాశాఖ నిర్వహిస్తోంది.