అక్రమ దందా.. అధికారుల అండ
రాయితీ బియ్యం దందా చూడడానికి మామూలుగా అనిపిస్తుంది. దీనిపై లోతుగా తెలుసుకుంటే విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
రాయితీ బియ్యం రవాణాలో పోలీసులపై వెల్లువెత్తుతున్న ఆరోపణలు
తాండూరు మండలం రేచిని గ్రామ సమీపంలో పట్టుకున్న రేషన్ బియ్యం(పాతచిత్రం)
బెల్లంపల్లి పట్టణం, న్యూస్టుడే: రాయితీ బియ్యం దందా చూడడానికి మామూలుగా అనిపిస్తుంది. దీనిపై లోతుగా తెలుసుకుంటే విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రూ. లక్షల్లో నెలవారీగా మామూళ్లు చెల్లిస్తున్నారంటే వారికి బియ్యం అక్రమ రవాణా మీద ఎంత ఆదాయం సమకూరుతుందో అర్థమవుతుంది. ఇదో పెద్ద మాఫియాలాగా మారింది. వీటి రవాణా సమాచారం ఇచ్చిన వారి వివరాలు సేకరించి మరీ బెదిరింపులకు దిగుతున్న పరిస్థితి ఉంది. గ్రామాల్లో తిరిగి సేకరించి, డీలర్లనుంచి తీసుకుని టన్నుల కొద్దీ లారీల్లో బియ్యాన్ని మహారాష్ట్రకు తరలిస్తున్నారు. మహారాష్ట్రలో దొడ్డు బియ్యానికి డిమాండ్ కనిపిస్తుంది. ఇక్కడ తక్కువ ధరకు కొని మహారాష్ట్రలో అధిక ధరకు విక్రయిస్తున్నారు. కొంతమంది పోలీసులతోపాటు ఇతర వర్గాల వారికి కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఓ వ్యాపారి ప్రతి నెలా మామూళ్లు ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రైళ్లలో బంద్... లారీల్లో తరలింపు
గతంలో భాగ్యనగర్తో పాటు మరికొన్ని రైళ్లలో రాయితీ బియ్యాన్ని మహారాష్ట్రలోని వీరూర్కు అక్రమ రవాణా చేసేవారు. రైల్వే శాఖ బియ్యం రవాణాను సీˆరియస్గా తీసుకుని అడ్డుకుంది. ఎక్కడికక్కడ రైల్వే పోలీసులు రంగ ప్రవేశం చేసి తరచూ తనిఖీలు చేయడంతో ఆ దందా నిలిచిపోయింది. స్థానిక దళారులే బియ్యాన్ని ఇంటింటికీ తిరుగుతూ సేకరించి వాటిని అక్రమంగా రెబ్బెనలోని ఓ వ్యాపారి వద్దకు పంపుతున్నారు. ఇదే సమయంలో రేషన్డీలర్లు సైతం లబ్ధిదారుల వద్ద రూ.10 నుంచి రూ.12 వరకు కొనుగోలు చేసి స్థానిక దళారులకే అప్పగిస్తున్నారు. తమ చేతికి మట్టి అంటకుండా ఎంతో కొంత లాభం చూసుకుని విక్రయిస్తున్నారు.
అంతా ‘మామూలుగా’
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలానికి చెందిన ఓ వ్యాపారి నిర్మించుకున్న రేషన్ సామ్రాజ్యం మామూలుగా ఉండదు. అంతా మామూళ్లమయమే చేసేశాడు. రెండు జిల్లాల్లో ఈ దందా కొనసాగిస్తున్నాడంటే అతనికి ఏ స్థాయిలో అండదండలు ఉన్నాయో అర్థమవుతుంది. రాయితీ బియ్యం అక్రమ రవాణా అధిపతి మీద ఈగ వాలిన కాపాడడానికి మేమున్నామంటూ చాలా మంది ముందుకు వస్తారంటే అతిశయోక్తి కాదు. ప్రతి నెలా క్రమం తప్పకుండా వేతనాల వలే మామూళ్లు ఇస్తున్నారంటే రాయితీ బియ్యం దందా ఏ స్థాయిలో కొనసాగిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల నుంచి రాయితీ బియ్యం మొత్తం ఇతని వద్దకే వెళుతుంది. అక్కడి నుంచి లారీల్లో మహారాష్ట్రకు తరలిస్తుంటారు.
షరతు విధించి..
జిల్లాలోని కొన్ని మండలాల రాజకీయ నాయకులు తాము చెప్పినోళ్లకే రాయితీ బియ్యం విక్రయించాలని షరతులు విధిస్తున్నారు. ఇలా మాటలతోనే రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు. స్థానికంగా దళారులను సృష్టించి దందా కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సదరు నాయకులకు తెలియకుండా బియ్యం మండలం నుంచి బయటకు పోకుండా చూస్తుంటారు.
ఇలా విక్రయిస్తారు
గ్రామాలు, పట్టణాల్లో నేరుగా లబ్ధిదారుల వద్ద రేషన్డీలర్లు కొనడం ఒక మార్గం. మరో మార్గంలో లబ్ధిదారుల వద్ద నుంచి సేకరించడం. ఈ స్థాయిలో కిలో రేషన్ బియ్యానికి రూ.10 నుంచి రూ.12 వరకు స్థానిక దళారులు కొనుగోలు చేస్తారు. ఆ తర్వాత వీరు వెళ్లి సదరు వ్యాపారికి రూ.16 నుంచి రూ.18కు విక్రయిస్తారు. అక్కడి నుంచి మహారాష్ట్రకు తరలించి రూ.25 నుంచి రూ.30 వరకు అమ్ముతుంటారు. లక్షల్లో వ్యాపారం జరుగుతుండడంతో రాయితీ బియ్యం దందా కొనసాగుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విధులు బహిష్కరించిన న్యాయవాదులు
[ 06-05-2024]
నిర్మల్ జిల్లా ఖానాపూర్ కోర్టు న్యాయవాది వెంకట మహేంద్రపై కొందరు దాడి చేసి హత్యాయత్నం చేశారని ఆరోపిస్తూ ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు సోమవారం విధులు బహిష్కరించారు. -
శివాలయంలో మహా అన్నదాన కార్యక్రమం
[ 06-05-2024]
జిల్లా కేంద్రంలోని గంగపుత్ర శివాలయంలో సోమవారం భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. -
ఆసిఫాబాద్లో మారిన నీట్ ప్రశ్నపత్రం
[ 06-05-2024]
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నీట్ ప్రశ్నపత్రం మారింది. -
పెళ్లైన నాలుగు రోజులకే.. నవ వధువును ఇంటికి పంపిన వరుడు
[ 06-05-2024]
బెల్లంపల్లి మండలం కాసిరెడ్డిపల్లె గ్రామంలో ఆదివారం ఓ నవ వధువు వరుడి ఇంటి ముందు బంధువులతో కలిసి ఆందోళన చేసింది. వధువు కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. -
కమలదళం.. కదనోత్సాహం
[ 06-05-2024]
‘‘గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబాకు ప్రణామం.. బాసర సరస్వతీ, పోరాటయోధుడు కుమురం భీం, రాంజీగోండ్, కొండా లక్ష్మణ్ బాపూజీలకు ప్రణామాలు..’’ అంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా కాగజ్నగర్లో నిర్వహించిన వికాస సంకల్ప సభలో ప్రసంగం ప్రారంభించారు. -
‘గిరి’యువతకు ఉపాధి కరవు
[ 06-05-2024]
ఆదివాసీ గిరిజన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కలగానే మిగులుతోంది. యూత్ ట్రైనింగ్ సెంటర్(వైటీసీ)లలో యువత ఆసక్తి, అభిరుచికి అనుగుణంగా నైపుణ్యాల శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాల్సి ఉండగా.. శిక్షణ కార్యక్రమాల నిర్వహణ, జాబ్ మేళాల ఏర్పాటు కోసం నిధుల కేటాయింపులో ప్రభుత్వం జాప్యం చేస్తోంది. -
కాంగ్రెస్లో కొత్తదనం.. కలిసొచ్చిన పాతతరం
[ 06-05-2024]
ప్రజలకు అభివాదం చేస్తూ, యువతకు స్వీయచిత్రాల అవకాశమిచ్చిన అగ్రనేత రాహుల్గాంధీ, గాడిద గుడ్డు కథ వివరిస్తూ నినాదాలు చేయించిన సీఎం రేవంత్రెడ్డి, ఒకే వేదికపై కూచాడి శ్రీహరిరావు, ఇంద్రకరణ్రెడ్డి, విఠల్రెడ్డి, వేణుగోపాలాచారి కనిపించటం, భారీగా తరలివచ్చిన జనం.. -
మండుతున్న ఎండలు.. వేడెక్కుతున్న భవనాలు
[ 06-05-2024]
వేసవిలో మండుతున్న ఎండలకు పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతున్నాయి. సిమెంటు కాంక్రీటు భవనాలు వేడెక్కుతున్నాయి. సాధారణంగా గది ఉష్ణోగ్రత 24 డిగ్రీలు ఉంటుంది. మండుతున్న ఎండలతో ఈ ఉష్ణోగ్రతలు సైతం సాధారణ స్థాయిని మించి నమోదవుతున్నాయి. -
కేంద్రాలు దూరం.. తప్పని భారం!
[ 06-05-2024]
కాకతీయ విశ్వవిద్యాలయ (కేయూ) పరిధిలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న డిగ్రీ పరీక్షల్లో విద్యార్థులకు అవస్థలు తప్పేలా లేవు. వారం రోజులుగా 45, 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ ఉదయం నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. -
ప్రశాంతంగా నీట్
[ 06-05-2024]
వైద్య విద్యలో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్ యూజీ-2024) ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో 5 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. -
సెలవు కరవు.. విధుల బరువు..
[ 06-05-2024]
కనిపించని నాలుగో సింహం పోలీస్. ఇది అక్షర సత్యం. అదే సమయంలో పోలీసు జీవితం వెనక కనిపించని కష్టాలు, ఒత్తిళ్లు, ఆరోగ్య, కుటుంబ సమస్యలతో పోలీసులు మానసికంగా కుంగిపోతున్నారు. ఖాకీ చొక్కా.. ప్యాంటులో హుందాతనంగా కనిపిస్తుంటారు. -
వసతులు లేక ఇక్కట్లు
[ 06-05-2024]
పేదలకు గూడు కల్పించేందుకు గత ప్రభుత్వం తీసుకొచ్చిన రెండు పడకగదుల ఇళ్ల పథకంలో భాగంగా పట్టణంలోని బంగల్పేట్ శివారులో పెద్దమొత్తంలో జీప్లస్2 విధానంలో గృహాలను నిర్మించారు. -
చిన్నగూడు.. ఆదర్శం చూడు
[ 06-05-2024]
ఎక్కడి నుంచో వలస వచ్చిన కూలీలు వారు. ఉండేందుకు తాత్కాలికంగా టార్పాలిన్లతో కట్టుకున్న నివాసాలు వారివి. పనికెళితేనే పూట గడిసే పరిస్థితి. వారి గురించి ఇంతే చెబితే అందులో ప్రత్యేకత ఉండదు. -
పెన్సిల్తో అద్భుతాలు.. జీవం ఉట్టిపడేలా చిత్రాలు
[ 06-05-2024]
చిన్నప్పటి నుంచి బొమ్మలు వేయడమంటే అమితాసక్తి ప్రదర్శించే ఆ యువకుడు పెన్సిల్తో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. బొమ్మను చూస్తే చాలు ఉన్నది ఉన్నట్టు గీస్తూ ఔరా అనిపిస్తున్నాడు. -
డిగ్రీ ప్రవేశాల.. ‘దోస్త్’
[ 06-05-2024]
ప్రభుత్వం డిగ్రీ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) ప్రకటన జారీ చేసింది. డిగ్రీ కళాశాలల్లో సీట్ల భర్తీకి ఈ నెల 6వ తేదీ రిజిస్ట్రేషన్లు ప్రారంభమై మూడు విడతల్లో సీట్లు కేటాయింపు జరగనుంది. -
నేటి నుంచి డిగ్రీ పరీక్షలు
[ 06-05-2024]
కాకతీయ విశ్వవిద్యాలయ పరిధిలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఒకవైపు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రస్తుత తరుణంలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ తదితర కోర్సుల్లో రెండు, నాలుగు, ఆరో సెమిస్టర్ పరీక్షల నిర్వహిస్తుండటం సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
క్రాంతినగర్ ఘటనలో 40 మందిపై కేసులు
[ 06-05-2024]
ఆదిలాబాద్ పట్టణంలోని క్రాంతినగర్లో శుక్రవారం రాత్రి, శనివారం చోటు చేసుకున్న అవాంఛనీయ ఘటనలో ఇరు వర్గాలకు చెందిన 40 మందిని బాధ్యులుగా గుర్తించి ఆదిలాబాద్ రెండో పట్టణ పోలీసులు ఆదివారం కేసులు నమోదు చేశారు. -
విజ్ఞాన భాండాగారం.. అంతర్జాలం
[ 06-05-2024]
దేశంలో ఓ వైపు ఎన్నికల వేడి, హడావుడి నడుస్తుండగా విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులకు పోటీ పరీక్షల కాలం ముందుంది. రాజకీయ నాయకులు ఓట్ల కోసం పోటీ పడుతుండగా నిరుద్యోగులు ఉద్యోగాల కోసం పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
-
ఏపీ నూతన డీజీపీ కోసం ముగ్గురు పేర్లతో ఈసీకి సిఫార్సు
-
పలు పాఠశాలలకు బెదిరింపులు..విదేశీ ఐపీ అడ్రెస్ నుంచి మెయిల్స్..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
-
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు