logo

జాతీయ స్థాయి రగ్బీ పోటీలకు విద్యార్థిని ఎంపిక

జిల్లా కేంద్రం బంగారిగూడలోని తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థిని జేబా అమ్రిన్ ఎస్.జి.ఎఫ్. అండర్-17 ఏళ్ల విభాగంలో జాతీయ స్థాయి రగ్బీ పోటీలకు ఎంపికయ్యారు.

Published : 24 Apr 2024 16:45 IST

ఆదిలాబాద్ క్రీడావిభాగం: జిల్లా కేంద్రం బంగారిగూడలోని తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థిని జేబా అమ్రిన్ ఎస్.జి.ఎఫ్. అండర్-17 ఏళ్ల విభాగంలో జాతీయ స్థాయి రగ్బీ పోటీలకు ఎంపికయ్యారు. అమ్రిన్‌ మహబూబాబాద్ లోని తొర్రూరులో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. దీంతో ఈనెల 27 నుంచి పూణేలో నిర్వహించే జాతీయస్థాయి రగ్బీ పోటీల్లో  తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం వహించనుంది. ఈ సందర్భంగా ఆర్.ఎల్.సి. శ్రీధర్, ప్రిన్సిపల్ ఫిహ్మేదా తన్వీర్, పీడీ  గౌరమ్మ, పీఈటీ నుస్రత్ విద్యర్థినిని ప్రత్యేకంగా అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని