15 మంది ఉపాధ్యాయులకు షోకాజ్
విద్యా ప్రమాణాలు మెరుగుపడకపోతే కఠిన చర్యలు తప్పవని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ రమేష్ ఉపాధ్యాయులను హెచ్చరించారు.
విద్యార్థి ట్యాబ్ని పరిశీలిస్తున్న డీఈఓ రమేష్
కొయ్యూరు, న్యూస్టుడే: విద్యా ప్రమాణాలు మెరుగుపడకపోతే కఠిన చర్యలు తప్పవని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ రమేష్ ఉపాధ్యాయులను హెచ్చరించారు. శనివారం కొయ్యూరు ప్రభుత్వోన్నత, మంపలోని ఆశ్రమ పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ రెండు పాఠశాలల్లోని 15 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వోన్నత పాఠశాలలోని తరగతులన్నింటినీ సందర్శించారు. పదో తరగతి విద్యార్థులకు గణితంలోని త్రికోణమితి సూత్రాలను అడిగారు. విద్యార్థులు సక్రమంగా చెప్పకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆరో తరగతి విద్యార్థులు రాసిన నోట్ పుస్తకాలను పరిశీలించారు. కొన్ని పాఠ్యాంశాలపైనే రాసి, మిగిలిన వాటిని రాయకపోవడాన్ని గుర్తించారు. ఎనిమిదో తరగతి విద్యార్థులకు పంపిణీ చేసిన ట్యాబ్లు పరిశీలించారు. వీటి వినియోగంపై మానిటరింగ్ అధికారి శివప్రసాద్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. మీరెందుకు పదో తరగతి విద్యార్థులకు పాఠాలు చెప్పడం లేదని ప్రధానోపాధ్యాయుడు రామారావును డీఈఓ ప్రశ్నించారు. విద్యార్థులు ప్రశ్నలకు సరిగా సమాధానాలు చెప్పకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు సరిగా బోధించడం లేదంటూ ఈ పాఠశాలలోని 11 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని వ్యక్తిగత కార్యదర్శిని ఆదేశించారు. మధ్యాహ్న భోజనంలో సాంబారులో పప్పు సరిగా కనిపించడం లేదని, ఇకపై ఎక్కువ వేయాలని నిర్వాహకులను ఆదేశించారు. అనంతరం కస్తూర్బా విద్యాలయాన్ని తనిఖీ చేశారు. మంపలోని అల్లూరి స్మారక ఉద్యానాన్ని సందర్శించారు. మంప ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసి అక్కడ నలుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రాజేంద్రపాలెంలోని అల్లూరి స్మారక ఉద్యానాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ జిల్లాలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్న 70 మంది ఉపాధ్యాయులకు ఇప్పటివరకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఎంఈఓ బోడంనాయుడు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిషేధమన్నావు.. నిషాలో ముంచావు!
[ 08-05-2024]
మ్యానిఫెస్టోలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం. మూడు దశల్లో మద్యం నిషేధిస్తాం. 2024 ఎన్నికల్లో ఓటడిగే సమయానికి మద్యం దుకాణాలే లేకుండా చేస్తాం. -
వైకాపాను తరిమికొడదాం
[ 08-05-2024]
వైకాపాను తరిమికొట్టి, తెదేపాను గద్దెనెక్కిద్దామని ఎన్డీఏ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి అన్నారు. జి.మాడుగుల వారపు సంతలో కూటమి నాయకులు, కార్యకర్తలు మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. -
జగన్కు పల్లకీ మోత.. గిరిజనులకు డోలీమోత
[ 08-05-2024]
మన్యంలో మరణమృదంగం మోగుతూనే ఉంది. కొండపై నివసించే గిరిజనుల బతుకులు తరచూ కొండెక్కిపోతున్నాయి. -
అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు
[ 08-05-2024]
చింతపల్లి నుంచి నర్సీపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సు మంగళవారం ప్రమాదానికి గురైంది. -
పోలవరం నిర్వాసితులను మోసంచేసిన వైకాపా
[ 08-05-2024]
కూటమి అభ్యర్థుల గెలుపుతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అరకు ఎంపీ కూటమి అభ్యర్థిని కొత్తపల్లి గీత అన్నారు. -
సర్కారు తీరుతో పింఛను కష్టాలు
[ 08-05-2024]
ప్రతి నెలా ఒకటో తేదీన అందాల్సిన పింఛను రాష్ట్ర ప్రభుత్వ తీరుతో ఈ నెల ఏడో తేదీ వరకు అందలేదు. దీంతో వృద్ధులు ఇబ్బందులకు గురవుతున్నారు. -
అంతకు మించి అన్నారు.. అలా వంచించారు!
[ 08-05-2024]
మత్స్యకారులు నా కుటుంబ సభ్యులు. వారి జీవితాలను బాగుచేస్తాం. వైకాపా అధికారంలోకొస్తే ఇంటికో ఉద్యోగం, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి రూ. 5 లక్షల చొప్పున ఏపీఐఐసీ పైపులైను పరిహారం చెల్లిస్తాం. -
జగన్ ప్రచార సభ వెలవెల
[ 08-05-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సాయంత్రం గాజువాక కూడలిలో నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సభ పేలవంగా సాగింది. -
రోడ్డు ప్రమాదంలో ఇంజినీర్ దుర్మరణం
[ 08-05-2024]
బొలెరో వాహనం అదుపు తప్పి ఇంజినీర్ దుర్మరణం పాలైన ఘటన మంగళవారం హుకుంపేట మండలంలో చోటుచేసుకుంది. -
ఆదివాసీల ఐక్యతకు కృషిచేసేవారిని గెలిపించండి
[ 08-05-2024]
ఆదివాసీల హక్కులు, ఐక్యతకు కృషి చేసే ఇండియా కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యురాలు బృందాకారాట్ పేర్కొన్నారు. -
గందరగోళం.. పోస్టల్ బ్యాలెట్
[ 08-05-2024]
నాలుగు రోజులుగా ఇక్కడ నిర్వహిస్తున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. -
రాష్ట్రంలో వైకాపా నియంత పాలన
[ 08-05-2024]
రాష్ట్రంలో నియంత పాలన సాగిస్తున్న వైకాపాకు ఓటుతో బుద్ధి చెప్పాలని ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పిలుపునిచ్చారు.