దువ్వాడ మీదుగా వెళ్లిపోతున్నాయ్..!
వాల్తేరు డివిజన్లో విశాఖ రైల్వేస్టేషన్ పెద్దది. ఇక్కడి నుంచి నిత్యం సుమారు వందకుపైగా రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. 8 ప్లాట్ఫామ్లు ఉన్నాయి.. కాని స్టేషన్కు ఉన్న ప్రతిబంధకం కారణంగా ఇక్కడికొచ్చిన ప్రతి రైలు తిరిగి వెనక్కి వెళ్లాలి.
విశాఖ స్టేషన్కు రాని 10 రైళ్లు
ప్లాట్ఫామ్లపై రద్దీయే కారణం
విశాఖపట్నం, న్యూస్టుడే
ఉత్తర సింహాచలం రైల్వేస్టేషన్
వాల్తేరు డివిజన్లో విశాఖ రైల్వేస్టేషన్ పెద్దది. ఇక్కడి నుంచి నిత్యం సుమారు వందకుపైగా రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. 8 ప్లాట్ఫామ్లు ఉన్నాయి.. కాని స్టేషన్కు ఉన్న ప్రతిబంధకం కారణంగా ఇక్కడికొచ్చిన ప్రతి రైలు తిరిగి వెనక్కి వెళ్లాలి. దీని కోసం ఇంజిన్ మార్చాల్సి రావడంతో 20నిమిషాల వరకు ప్లాట్ఫామ్పై ఉండాల్సిన పరిస్థితి. ఫలితంగా మరిన్ని రైళ్లు విశాఖ స్టేషన్కు వచ్చే అవకాశం లేకుండా పోతోంది.
విశాఖ స్టేషన్లోని ఒక్కో ప్లాట్ఫామ్ పైన సరాసరి రోజుకు 4గంటల చొప్పున రైళ్లు నిలిచి ఉంటున్నాయని అంచనా.. సాధారణంగా విజయవాడ తదితర పెద్ద స్టేషన్లలో రైళ్లు 5 నుంచి 10 నిమిషాలు ఆగుతాయి. ఈ లెక్కన తీసుకుంటే విశాఖ స్టేషన్లో రెట్టింపు సమయం వృథా అవుతోంది. ఈ కారణంగానే పలు రైళ్లను దువ్వాడ మీదుగా నడపాల్సి వస్తోందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఉత్తర సింహాచలం స్టేషన్ మీదుగానే 10 రైళ్లు దువ్వాడ వెళుతున్నాయి. విశాఖ స్టేషన్ నుంచి ఇక్కడికి 11కి.మీ. దూరం కాగా, దువ్వాడ 23కి.మీ. దూరం ఉంటుంది. ఈ దృష్ట్యా నగరవాసులకు ఉత్తర సింహాచలం స్టేషన్ కొంత సౌకర్యంగా ఉంటుంది. అయితే ఇక్కడ సరైన సౌకర్యాలు లేవు. రాత్రుళ్లు స్టేషన్లోకి వెళ్లాలంటే సాహసం చేయాల్సిందే. విశాఖ స్టేషన్లో రైళ్ల రద్దీ ఎక్కువగా ఉన్న దృష్ట్యా 10 రైళ్లను ఇక్కడ నిలిపితే నగర ప్రయాణికులకు ఉపయుక్తంగా ఉంటుందని డీఆర్యూసీసీ(డివిజనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ) కోరుతోంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు కళ్లు తెరవాలని కోరుతోంది. దీనిపై రైల్వే అధికారులు మాట్లాడుతూ వాణిజ్య పరంగా ఈ స్టేషన్కు వెసులుబాటు లేని కారణంగా అభివృద్ధి సాధ్యం కాదన్నారు. అందుకే ప్రతిపాదన చేయలేదన్నారు. కార్యకలాపాల సౌలభ్యం కోసం కొన్ని రైళ్లకు హాల్ట్ కల్పిస్తున్నట్లు చెప్పారు.
చెట్ల కొమ్మలు పడి నిలిచిన పలు రైళ్లు
దువ్వాడ కాపు జగ్గరాజుపేట గేటు సమీపంలో రైల్వే విద్యుత్ తీగలపై పలుచోట్ల చెట్లు కొమ్మలు పడటంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బుధవారం సాయంత్రం వీచిన భారీ గాలులకు దువ్వాడ-రాజమహేంద్రవరం ప్రధాన మార్గంతో పాటు దువ్వాడ స్టీల్ప్లాంట్లకు వెళ్లే రైలు మార్గంలో కొమ్మలు పడినట్లు గుర్తించిన సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని తొలగించేందుకు చర్యలు చేపట్టారు. దీంతో విశాఖ నుంచి బయలుదేరి వెళ్లాల్సిన విశాఖ-సికింద్రాబాద్ గరీబ్రథ్, భువనేశ్వర్-ఎస్ఎంవీటీ బెంగళూరు - హంసఫర్, విశాఖ- నాందేడ్ ఎక్స్ప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి. మరికొన్ని రైళ్లు గోపాలపట్నం, మర్రిపాలెం స్టేషన్ సమీపంలో నిలిపివేశారు. ముందుగా ప్రధాన మార్గంలో విద్యుత్ తీగలను సరి చేయడంతో ఒక్కొక్కటిగా బయలుదేరి వెళ్లాయి.
ఏయే రైళ్లు వెళుతున్నాయంటే..
* టాటా-ఈఆర్ఎస్ రైలు(ఆదివారం రాత్రి 8.45 గంటలకు)
* ఎస్బీపీ-సీబీఈ (ప్రత్యేక రైలు) (బుధవారం రాత్రి 8.45 )
* హావ్డా-ఎస్ఎస్పీఎన్ (గురువారం తెల్లవారుజామున 4.45)
* బీబీఎస్-తిరుపతి (శనివారం రాత్రి 7.37)
* తిరుపతి-బీబీఎస్ (సోమవారం ఉదయం 9.30గంటలకు)
* ఈఆర్ఎస్-టాటా (సోమవారం మధ్యాహ్నం 12.08)
* సీబీఈ-బీజేయూ (బుధవారం రాత్రి 10.40)
* ఈఆర్ఎస్-టాటా (గురువారం మధ్యాహ్నం 12.08)
* ఎస్ఎస్పీఎన్-హావ్డా(శుక్రవారం రాత్రి 11గంటలకు)
* సీబీఈ-ఎస్బీపీ (శనివారం మధ్యాహ్నం 12.08)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రక్షకభటులపై కక్ష
[ 03-05-2024]
ఉద్యోగులకు అది చేస్తాం.. ఇది చేస్తాం అని మాటలు చెప్పి.. వారికి తీరని అన్యాయం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుంది. నెత్తిన టోపీతో శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం శ్రమించేవారికి జగన్ పెద్ద టోపీయే పెట్టారు. -
ఎండలో పండుటాకులు.. బ్యాంకులో పడిగాపులు.. నరకం చూపించారు...!
[ 03-05-2024]
పింఛను సొమ్ము తీసుకునేందుకు వృద్ధులు, దివ్యాంగుల అవస్థలు వర్ణనాతీతం. అధిక శాతం మంది పింఛనుదారుల బ్యాంక్ అకౌంట్లు యాక్టివ్లో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
పథకాలను ప్రజలకు చేరువ చేస్తాం
[ 03-05-2024]
‘ఐదేళ్ల వైకాపా పాలనలో గిరిజన చట్టాలు నిర్వీర్యమయ్యాయి. బతుకులు అతలాకుతలమయ్యాయి. గిరిజనులకు ప్రాణవాయువులాంటి జీవో నం.3ను అటకెక్కించారు. నిరుపేదలకు అందాల్సిన రాయితీ పథకాలను రద్దు చేశారు. పల్లెల్లో ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతున్నారు. -
పండుటాకులపై పగ
[ 03-05-2024]
సామాజిక పింఛన్లపైనే ఆధారపడి జీవిస్తున్న వృద్ధులు, దివ్యాంగులు పింఛను సొమ్ము పొందేందుకు నానా అగచాట్లు పడుతున్నారు. -
వైకాపా సమర్పించు ‘అస్తవ్యస్త విస్తరణ’
[ 03-05-2024]
అనకాపల్లి జిల్లా రంగస్థల కళాకారులకు పుట్టినిల్లు. జిల్లాలోని వైకాపాకు చెందిన పాలకులు ఈ కళాకారుల సృజనను తలదన్నేలా చాలా సిత్రాలే చేశారు. పట్టణాలనే నాటకరంగంగా మార్చేసుకుని తెగ నటించేశారు. -
గిడ్డి ఈశ్వరి విజయానికి కృషి
[ 03-05-2024]
పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని తెదేపా రాష్ట్ర కార్యదర్శి కిల్లు వెంకట రమేష్నాయుడు తెలిపారు. -
ఎక్కడికెళ్లినా రోడ్ల దుర్గతే చెబుతున్నారు!
[ 03-05-2024]
అనకాపల్లి జిల్లాకు చెందిన మేధావులతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి గురువారం వేపగుంటలో సమావేశం నిర్వహించారు. -
భౌతిక దాడులు రాజ్యాంగ విరుద్ధం
[ 03-05-2024]
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం భారత రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తోందని రాజ్యాంగ పరిరక్షణ వేదిక కన్వీనర్, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. -
ప్రజా సంక్షేమం కూటమితోనే సాధ్యం
[ 03-05-2024]
రాష్ట్రం అభివృద్ధి కావాలంటే వైకాపా ప్రభుత్వాన్ని గద్దెదించాలని పేట కూటమి అభ్యర్థిని వంగలపూడి అనిత అన్నారు. -
ఓటరు స్లిప్పులు వచ్చేశాయి..
[ 03-05-2024]
ఈనెల 13న నిర్వహించనున్న ఎన్నికకు సంబంధించి ఓటర్లకు స్లిప్పులు వచ్చేశాయి. -
జనసేన కార్యకర్తపై వైకాపా నాయకుడి దాడి
[ 03-05-2024]
ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న జనసేన కార్యకర్తపై వైకాపా నాయకుడు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. -
చిమ్మచీకట్లో డోలీమోత
[ 03-05-2024]
పాలకుల నిర్లక్ష్యం గిరిజనులకు శాపంగా మారింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు వంతెన నిర్మించాలని వేడుకున్నా, ఆమెకు పలుమార్లు వినతులు ఇచ్చినా ఫలితం లేదు. -
ఊపిరితీసిన వాగులు
[ 03-05-2024]
మన్యంలో పర్యటక ప్రాంతాలను చూద్దామని సరదాగా వచ్చిన వారికి తీరని విషాదం మిగిలింది. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు చిన్నారులు సహా నలుగురు మృత్యువాత పడటం ఆయా కుటుంబాల వారిని శోకసంద్రంలో ముంచింది.