అవకాశం వచ్చింది.. త్వరపడితే మంచిది
బాలికల విద్యకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నడిచే కస్తూర్బా బాలిక విద్యాలయాల్లో రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరణ మొదలైంది.
పాడేరు, నక్కపల్లి, న్యూస్టుడే : బాలికల విద్యకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నడిచే కస్తూర్బా బాలిక విద్యాలయాల్లో రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరణ మొదలైంది. ఈ మేరకు సమగ్ర శిక్ష అభియాన్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.
ఉమ్మడి జిల్లాలో 39 కస్తూర్బా పాఠశాలలు, కళాశాలలున్నాయి. ఇందులో ఆరు నుంచి ఇంటర్ వరకు తరగతులున్నాయి. అనకాపల్లి జిల్లాకు సంబంధించి ఆరో తరగతికి 800, ఇంటర్ మొదటి ఏడాదిలో ప్రవేశాలకు 800 ఖాళీలున్నాయి. వీటితో పాటు 7, 8, 9 తరగతుల్లో మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది స్థానికంగా ఉన్న ఖాళీలపై ఆధారపడి ఉంటుంది. ఇందులో చదువుకునే వారికి ఉచితంగా బోధన, వసతి, భోజనం ఉంటుంది. బోధనతో పాటు, ప్రతిరోజూ విధిగా వ్యాయామం, యోగాసనాలు, ఆటపాటలుంటాయి.
అర్హులు వీరే... అనాథలు, తల్లి గానీ తండ్రిగానీ లేనివారు, మధ్యలో బడి మానేసినవారు, ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన కులాలవారికి వారికి అవకాశం ఉంటుంది. ఆసక్తి ఉన్నవారంతా సమీపంలోని ఆన్లైన్ సెంటర్కు వెళ్లి తమ పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు/సంరక్షకుల ఆధార్ కార్డులు, కుల ధ్రువీకరణ, దరఖాస్తుదారు పాస్పోర్టుసైజ్ ఫొటో, జనన ధ్రువపత్రం, కుల ధ్రువీకరణ, స్టడీ, రేషన్కార్డు, బ్యాంకు ఖాతా, ఫోన్ నంబరు వివరాలు అప్లోడ్ చేయించాలి.
ఇంటర్లో కోర్సులు... ఎంఈసీ: చీడికాడ, ఎంపీహెచ్డబ్ల్యూ(నర్సింగ్): గొలుగొండ, రోలుగుంట, కె.కోటపాడు, ఎం.ఎల్.టి.(ల్యాబ్ టెక్నీషియన్): రాంబిల్లి, చోడవరం, ఎంపీసీ: మునగపాక, దేవరాపల్లి, మాకరవపాలెం, ఎస్.రాయవరం, బైపీసీ: నాతవరం, కోటవురట్ల, నక్కపల్లి, బుచ్చెయ్యపేట, అచ్యుతాపురం, నర్సీపట్నం, కశింకోట, వి.మాడుగుల, సబ్బవరం, రావికమతం.
దరఖాస్తుల గడువు వచ్చే నెల 11 వరకు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో వచ్చే విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అల్లూరి జిల్లా విద్యాశాఖాధికారి బ్రహ్మాజీరావు తెలిపారు. ఈ నెల 12వ తేదీ నుంచి ఏప్రిల్ 11వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా పరిధిలో 19 కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల, కళాశాలలు ఉన్నాయని చెప్పారు. 7, 8, 9 తరగతుల్లో మిగిలిన సీట్లలో ప్రవేశాలకూ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని చెప్పారు. 19 విద్యాలయాల్లో మొత్తం 760 ఖాళీలకు ప్రవేశాలు కల్పిస్తామని పేర్కొన్నారు.
అవకాశం వినియోగించుకోవాలి...
కేజీబీవీల్లో బోధన, సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయి. ఏటా ఇక్కడ మంచి ఫలితాలు వస్తున్నాయి. బోధనే కాకుండా, ఇతర నైపుణ్యాలపైనా ఇందులో శిక్షణ ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణ ఇప్పటికే మొదలైంది. ఏప్రిల్ 11వ తేదీ వరకు గడువుంది. అర్హులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి తెరిచే సమయానికి అర్హులంతా తరగతుల్లో చేరిపోతారు. ఏమైనా సందేహాలుంటే స్థానికంగా ఉన్న కేజీబీవీల్లో, 18004258599 నంబర్కు సంప్రదించొచ్చు. -ఎం.వెంకట లక్ష్మమ్మ, డీఈఓ
కేజీబీవీల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ
విద్యార్థినులకు బోధన
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘అమ్మో జగన్ బొమ్మా’ళీ.. అడ్డగోలుగా ఫైబర్నెట్ ధరల పెంపు!
[ 28-04-2024]
తెదేపా హయాంలో విశాఖ జిల్లాలో 80 వేలు వరకు ఉన్న వినియోగదారుల సంఖ్య వైకాపా ప్రభుత్వం వచ్చాక తగ్గిపోయింది. చాలా మంది కనెక్షన్లు తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. -
చెప్పేది నా ఎస్టీ... చేసేది లూటీ
[ 28-04-2024]
రాష్ట్రంలో 14,132 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో గిరిజన ప్రాంతం విస్తరించి ఉంది. ఇందులో 36 గిరిజన మండలాలు, 613 గ్రామ పంచాయతీల పరిధిలో 4,765 గిరిజన గ్రామాలున్నాయి. -
కూటమితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 28-04-2024]
వైకాపా ప్రభుత్వ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని రంపచోడవరం నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మిరియాల శిరీషాదేవి ఆరోపించారు. -
గిరిజనుల గోడు పట్టని వైకాపా
[ 28-04-2024]
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై ఛార్జిషీట్ దాఖలు చేయాలని పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి డిమాండ్ చేశారు. -
మన్యాన్ని గంజాయివనంగా మార్చిన జగన్
[ 28-04-2024]
ఎన్నికల ముందు గిరిజనులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి విఫలమయ్యారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. -
ఆసరా ఆశలు ఆవిరేనా?
[ 28-04-2024]
ఆసరా పేరుతో ఆశలు రేపి ఇప్పటివరకు నాలుగో విడత నిధులు జమ చేయకపోవడంపై మహిళలు మండిపడుతున్నారు. -
పింఛన్ల పంపిణీ ఆలస్యానికి కుట్ర
[ 28-04-2024]
వచ్చే నెల ఒకటో తేదీన లబ్ధిదారుల ఇళ్ల వద్దనే పింఛన్లు పంపిణీ చేయాలని కూటమి అభ్యర్థి పాంగి రాజారావు, తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి సియారి దొన్నుదొర డిమాండ్ చేశారు. -
యువత చొరవతో మూగజీవికి ఊరట
[ 28-04-2024]
మురుగు ట్యాంకులో పడిపోయిన ఆవును యువకులు బయటకు తీసి, సపర్యలు చేయడంతో ప్రాణాలతో బయటపడింది. -
ఇంకా కష్టాల్లోనే ‘విశాఖ ఉక్కు’
[ 28-04-2024]
న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని గత 19 రోజులుగా నిర్వాసిత కార్మికులు గంగవరం పోర్టులో సమ్మె బాట పట్టారు. -
108 అంబులెన్సుల్లో ప్రసవాలు
[ 28-04-2024]
మండలంలోని వేర్వేరు గ్రామాల్లో ఇద్దరు గర్భిణులు 108 వాహనాల్లోనే ప్రసవించారు. వివరాలు ఇలా ఉన్నాయి. మారేడుమిల్లి మండలం తాడేపల్లి పంచాయతీ పరిధిలోని మద్దివీడు గ్రామానికి చెందిన బి.సన్యాసమ్మకు నెలలు నిండటంతో పురిటి నొప్పులు మొదలయ్యాయి. -
అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
[ 28-04-2024]
‘అనకాపల్లి ఎంపీగా గెలవగానే ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అభివృద్ధికి చర్యలు చేపడతానని కూటమి అభ్యర్థి సీఎం రమేశ్ పేర్కొన్నారు. -
గిరిజన సంక్షేమానికి వైకాపా తూట్లు
[ 28-04-2024]
గిరిజన సంక్షేమానికి 40 ఏళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఐటీడీఏలు ఏర్పాటు చేసింది. తద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు చర్యలు చేపట్టింది. -
గిరిజన గ్రామాల్లో కూటమి విస్తృత ప్రచారం
[ 28-04-2024]
డుంబ్రిగుడ మండలంలో కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ శనివారం కూటమి నాయకులు విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. -
22 నామినేషన్ల ఆమోదం
[ 28-04-2024]
అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గంలో 28 మంది అభ్యర్థులు 44 నామినేషన్లు దాఖలు చేశారని రిటర్నింగ్ అధికారి అభిషేక్ శనివారం తెలిపారు. -
జిల్లాలో ఓటర్లు 7,71,193 మంది
[ 28-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు జిల్లాలో ఓటర్ల తుది జాబితా శనివారం విడుదలైంది.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్కు ఘోర పరాభవం.. సొంతగడ్డపై అదరగొట్టిన చెన్నై
-
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
-
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు: తమన్నా
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఎంపీ ప్రజ్వల్, రేవణ్ణలపై కేసు
-
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ డార్ నియామకం