సిద్ధం..ప్రయాణానికి యుద్ధం
‘ఎక్కడైనా సీఎం వస్తున్నాడంటే వరాలు జల్లులు కురిపిస్తారని ఆనందపడతారు. జగన్ వస్తే మాత్రం అమ్మో అంటున్నారు. ఈ సీఎం వస్తే పచ్చని చెట్లపై గొడ్డలి వేటు పడాల్సిందే.. కరెంటు తీగలు తొలగించాల్సిందే.
కాకినాడ సభకు ఉమ్మడి జిల్లా నుంచి 450 బస్సుల తరలింపు
నేడు కశింకోటలో సభకు అంతకు మించి సమకూర్చిన ఆర్టీసీ
జాతీయ రహదారిపై రాకపోకలకు నరకం
ఈనాడు, అనకాపల్లి, న్యూస్టుడే, కొత్తూరు(అనకాపల్లి)
‘ఎక్కడైనా సీఎం వస్తున్నాడంటే వరాలు జల్లులు కురిపిస్తారని ఆనందపడతారు. జగన్ వస్తే మాత్రం అమ్మో అంటున్నారు. ఈ సీఎం వస్తే పచ్చని చెట్లపై గొడ్డలి వేటు పడాల్సిందే.. కరెంటు తీగలు తొలగించాల్సిందే. అన్నకు హారతులివ్వడానికి, పూలు జల్లడానికి బలవంతపు ఏర్పాట్లు చేయాల్సిందే. జనాల అవస్థలతో జగన్కు సంబంధం లేదు. రోడ్లపై గంటల తరబడి ట్రాఫిక్లో ఇరుక్కుపోయిన ప్రజలంతా తన కోసమే వచ్చారంటూ డ్రోన్ కెమెరాలతో ఫొటోలు తీయించుకుంటారు.
మందీమార్బలంతో ‘మేమంతా సిద్ధం’ అంటూ బస్సు యాత్ర సాగిస్తున్న జగన్ శుక్రవారం రాత్రి అనకాపల్లి జిల్లాలోకి ప్రవేశించారు. శనివారం కశింకోట మండలం గొబ్బూరులో ఎన్నికల సభ నిర్వహించబోతున్నారు. రెండునెలల క్రితం ఇదే మండలంలో చేయూత సభ పెట్టి, జాతీయ రహదారిని దిగ్భందం చేసి ప్రయాణికులకు నరకం చూపించారు. తాజాగా జాతీయ రహదారిని ఆనుకునే మరలా సభ నిర్వహిస్తుండడంతో బాబోయ్ జగన్ అంటూ భయపడుతున్నారు.
ట్రాఫిక్ కష్టాలు షురూ..
కశింకోట మండలం పిసినికాడ సమీపంలో రెండు నెలల క్రితం చేయూత సభ పెట్టారు. జాతీయ రహదారిపై రాకపోకలను 40 కి.మీ ముందే మళ్లించేశారు. సభకు జనాలను తరలించే వాహనాలతో ఒక పూటంతా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎంతలా అంటే అంబులెన్స్లకు కూడా దారివ్వలేనంతగా. గుండెపోటుకు గురైన ఓ ఉపాధ్యాయురాలు సీఎం సభ ట్రాఫిక్ కారణంగా సకాలంలో ఆసుపత్రి చేరలేక మృతిచెందింది. ఇప్పుడు ఏకంగా నక్కపల్లి మండలం గొడిచర్ల నుంచి అనకాపల్లి పట్టణం వరకు బస్సు యాత్ర జాతీయ రహదారిపైనే సాగనుంది. గొబ్బూరు వద్ద సభ ఏర్పాటు చేస్తున్నారు. జగన్ బస్సు యాత్ర గురించి తెలిసిన వారిలో కొంతమంది ప్రత్యామ్నాయ మార్గాల్లో రవాణా వెతుక్కుంటున్నారు. మరికొందరు ప్రయాణాన్ని రద్దు చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు.
బస్సులన్నీ వాళ్లకే..
కాకినాడలో సిద్ధం సభ జరిగితే విశాఖ నుంచి 350, అనకాపల్లి జిల్లా నుంచి 100 బస్సులు వైకాపాకు అప్పగించారు. ఉమ్మడి జిల్లాలో శుక్రవారం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శనివారం నాటి సిద్ధం సభకు ఉమ్మడి జిల్లాలో 700 పైగా బస్సులు వినియోగిస్తున్నారు. పొరుగు జిల్లాల నుంచి బస్సులు ఎక్కువ తరలించబోతున్నారు. దీంతో ప్రయాణ కష్టాలు మరింత తీవ్రం కానున్నాయి. అనకాపల్లి, నర్సీపట్నం డిపోల నుంచి 120 బస్సులను కేటాయించామని జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి పద్మావతి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రక్షకభటులపై కక్ష
[ 03-05-2024]
ఉద్యోగులకు అది చేస్తాం.. ఇది చేస్తాం అని మాటలు చెప్పి.. వారికి తీరని అన్యాయం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుంది. నెత్తిన టోపీతో శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం శ్రమించేవారికి జగన్ పెద్ద టోపీయే పెట్టారు. -
ఎండలో పండుటాకులు.. బ్యాంకులో పడిగాపులు.. నరకం చూపించారు...!
[ 03-05-2024]
పింఛను సొమ్ము తీసుకునేందుకు వృద్ధులు, దివ్యాంగుల అవస్థలు వర్ణనాతీతం. అధిక శాతం మంది పింఛనుదారుల బ్యాంక్ అకౌంట్లు యాక్టివ్లో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
పథకాలను ప్రజలకు చేరువ చేస్తాం
[ 03-05-2024]
‘ఐదేళ్ల వైకాపా పాలనలో గిరిజన చట్టాలు నిర్వీర్యమయ్యాయి. బతుకులు అతలాకుతలమయ్యాయి. గిరిజనులకు ప్రాణవాయువులాంటి జీవో నం.3ను అటకెక్కించారు. నిరుపేదలకు అందాల్సిన రాయితీ పథకాలను రద్దు చేశారు. పల్లెల్లో ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతున్నారు. -
పండుటాకులపై పగ
[ 03-05-2024]
సామాజిక పింఛన్లపైనే ఆధారపడి జీవిస్తున్న వృద్ధులు, దివ్యాంగులు పింఛను సొమ్ము పొందేందుకు నానా అగచాట్లు పడుతున్నారు. -
వైకాపా సమర్పించు ‘అస్తవ్యస్త విస్తరణ’
[ 03-05-2024]
అనకాపల్లి జిల్లా రంగస్థల కళాకారులకు పుట్టినిల్లు. జిల్లాలోని వైకాపాకు చెందిన పాలకులు ఈ కళాకారుల సృజనను తలదన్నేలా చాలా సిత్రాలే చేశారు. పట్టణాలనే నాటకరంగంగా మార్చేసుకుని తెగ నటించేశారు. -
గిడ్డి ఈశ్వరి విజయానికి కృషి
[ 03-05-2024]
పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని తెదేపా రాష్ట్ర కార్యదర్శి కిల్లు వెంకట రమేష్నాయుడు తెలిపారు. -
ఎక్కడికెళ్లినా రోడ్ల దుర్గతే చెబుతున్నారు!
[ 03-05-2024]
అనకాపల్లి జిల్లాకు చెందిన మేధావులతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి గురువారం వేపగుంటలో సమావేశం నిర్వహించారు. -
భౌతిక దాడులు రాజ్యాంగ విరుద్ధం
[ 03-05-2024]
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం భారత రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తోందని రాజ్యాంగ పరిరక్షణ వేదిక కన్వీనర్, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. -
ప్రజా సంక్షేమం కూటమితోనే సాధ్యం
[ 03-05-2024]
రాష్ట్రం అభివృద్ధి కావాలంటే వైకాపా ప్రభుత్వాన్ని గద్దెదించాలని పేట కూటమి అభ్యర్థిని వంగలపూడి అనిత అన్నారు. -
ఓటరు స్లిప్పులు వచ్చేశాయి..
[ 03-05-2024]
ఈనెల 13న నిర్వహించనున్న ఎన్నికకు సంబంధించి ఓటర్లకు స్లిప్పులు వచ్చేశాయి. -
జనసేన కార్యకర్తపై వైకాపా నాయకుడి దాడి
[ 03-05-2024]
ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న జనసేన కార్యకర్తపై వైకాపా నాయకుడు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. -
చిమ్మచీకట్లో డోలీమోత
[ 03-05-2024]
పాలకుల నిర్లక్ష్యం గిరిజనులకు శాపంగా మారింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు వంతెన నిర్మించాలని వేడుకున్నా, ఆమెకు పలుమార్లు వినతులు ఇచ్చినా ఫలితం లేదు. -
ఊపిరితీసిన వాగులు
[ 03-05-2024]
మన్యంలో పర్యటక ప్రాంతాలను చూద్దామని సరదాగా వచ్చిన వారికి తీరని విషాదం మిగిలింది. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు చిన్నారులు సహా నలుగురు మృత్యువాత పడటం ఆయా కుటుంబాల వారిని శోకసంద్రంలో ముంచింది.