మాయమాటలతో పాస్టర్ ప్రేమాయణం!
మాయమాటలు చెప్పి బాలికతో ప్రేమాయణం నడిపిన పాస్టర్ను గన్నవరం పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు.
గన్నవరం గ్రామీణం, న్యూస్టుడే: మాయమాటలు చెప్పి బాలికతో ప్రేమాయణం నడిపిన పాస్టర్ను గన్నవరం పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లాలో మొదలైన పాస్టర్ వ్యవహారం.. ఏలూరు జిల్లా నూజివీడు వేదికగా తలెత్తిన వివాదానికి గన్నవరంలో అడ్డుకట్ట పడింది. పోలీసులు కథనం ప్రకారం. తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన కల్యాణి నాగేశ్వరరావు.. ఏలూరు జిల్లా నూజివీడు ఎన్టీఆర్ కాలనీలో చర్చి పాస్టర్గా జీవనం సాగిస్తున్నారు. రెండేళ్ల క్రితం స్థానికంగా చర్చి ఏర్పాటు చేసిన పాస్టర్ నాగేశ్వరరావుకు అదే కాలనీకి చెందిన 17 ఏళ్ల బాలికతో పరిచయం ఏర్పడింది. ఆరోగ్యం బాగాలేదని ఓసారి పాస్టర్ వద్దకు సదరు బాలిక వెళ్లగా.. ప్రత్యేక ప్రార్థన చేస్తే తగ్గిపోతుందంటూ ఆమెకు దగ్గరయ్యాడని బాలిక బంధువులు ఆరోపించారు. పాస్టర్ ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు గన్నవరం మండలం ముస్తాబాదలోని బంధువుల ఇంటికి బాలికను పంపించారు. ఈనెల 2వ తేదీ సదరు బాలిక ఇంట్లో కనిపించక పోవడంతో గన్నవరం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అదృశ్యం కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. బాలిక పాస్టర్తో కలిసి హైదరాబాద్లో ఉన్నట్లు గుర్తించారు. ఇరువురిని అదుపులోకి గన్నవరం తీసుకొచ్చిన పోలీసులు.. పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్లో ప్రార్థనల నిమిత్తం మాత్రమే తాము వెళ్లినట్లు బాలిక, పాస్టర్ చెబుతున్నారని గన్నవరం సీఐ సత్యనారాయణ వివరించారు. పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టి వివరాలు వెల్లడిస్తామని సీఐ పేర్కొన్నారు. మరోవైపు అనారోగ్య కారణాలతో భార్య చనిపోయి ఇద్దరు పిల్లలున్న పాస్టర్ నాగేశ్వరరావు.. మాయమాటలతో తమ కూతుర్ని ఎత్తుకెళ్లి వేధిస్తున్నాడని, అతడిపై పోక్సో చట్ట ప్రకారం చర్యలు తీసుకొని న్యాయం చేయాలంటూ బాధిత తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ మేరకు పాస్టర్పై పోక్సో కేసు నమోదు చేశామని ఎస్.ఐ రమేష్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జనంపైకి ‘రాకాసి చట్టం’
[ 05-05-2024]
బలవంతుడిదే రాజ్యం.. రౌడీయిజంతో దౌర్జన్యం చేసేవారికే భూమి అన్నట్టు వైకాపా ప్రభుత్వం వినాశకర చట్టాన్ని తెస్తోంది. అధికారం అండ ఉన్నవారి మాటే చెల్లుబాటయ్యేలా తనదైన విధ్వంసకర విధానాలను జనంపై రుద్దుతోంది. -
బూతులు.. గోతులు.. మనకొద్దు!
[ 05-05-2024]
జనసేనాని పవన్ కల్యాణ్ రాకతో ఎన్డీయే కూటమిలోనూతనోత్సాహం వచ్చింది. గుడివాడ, అవనిగడ్డల్లో శనివారం వారాహి విజయభేరి బహిరంగ సభల్లో పవన్ పాల్గొన్నారు. -
సూపర్-6లో సంక్షేమం కొత్త పుంతలు
[ 05-05-2024]
ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉన్న మచిలీపట్నం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనేది నా అభిమతం. శాసనసభ్యుడిగా, మంత్రిగా ఉన్న సమయంలో దాదాపు రూ.2000 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశా. -
ఎత్తిపోయలే... ఒట్టి మాటలే...
[ 05-05-2024]
ఎన్నెస్పీ నీరు అందని చోట ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేశారు. వాటిలో చాలా మరమ్మతులకు గురయ్యాయి. ప్రతిపాదనలు పంపినా అయిదేళ్లలో పైసా విదల్చలేదు. -
అనువుగాని భూములే.. అపూర్వమా పేర్ని!
[ 05-05-2024]
వ్యవసాయ పరిశోధన స్థానానికి కేటాయించిన భూమి పరిశోధనలకు అనువుగా ఉండదు. అక్కడ భూసార పరీక్షలు కూడా చేశాం. చౌడు ఎక్కువగా ఉండడంతో పంటలు పండే అవకాశం ఉండదు. -
పోస్టల్ బ్యాలట్ వినియోగంలో సమాచార లోపం
[ 05-05-2024]
పోస్టల్ బ్యాలట్ వినియోగించుకునే తేదీల విషయంలో సక్రమమైన సమాచారం ఇవ్వకపోవడంతో పలువురు ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. -
ఓటింగ్ ప్రక్రియ గందరగోళం.. పోస్టల్ బ్యాలట్లు మురిగే ప్రమాదం
[ 05-05-2024]
గుడివాడ పట్టణంలోని వీకేఆర్, వీఎన్బీ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలట్్ ఫెసిలిటేషన్ సెంటర్లో శనివారం ఉదయం 9 గంటలకు ప్రారంభించాల్సిన పోలింగ్ ఒక బూత్లో 9:50కి మరో బూత్లో 10:30 గంటలకు ప్రారంభం -
మ్యానిఫెస్టోలో పథకాలు అమలు చేస్తాం: కొల్లు
[ 05-05-2024]
అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులందరికీ పింఛన్లు అందజేయడంతోపాటు ప్రతి ఒక్కరికీ నెలకు రూ.4వేలు అందిస్తామని కూటమి ఎమ్మెల్యే అభ్యర్ధి కొల్లు రవీంద్ర అన్నారు. -
స్కౌట్స్ అండ్ గైడ్స్ కమిషనర్గా రామ గంగాధర్
[ 05-05-2024]
హిందూస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆంధ్రప్రదేశ్ నూతన కమిషనర్గా దోర్నాసుల రామ గంగాధర్ నియమితులయ్యారు. -
యార్లగడ్డ ప్రచారానికి అడ్డంకి.. ఆపై కత్తితో దాడి అని కేసు
[ 05-05-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కొయ్యూరులో తెదేపా అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ప్రచారం సందర్భంగా శుక్రవారం రాత్రి వైకాపాకు చెందిన కొందరు గలాటా సృష్టించారు. -
దివిసీమ విశిష్టత వివరించిన జనసేనాని
[ 05-05-2024]
అవనిగడ్డ సభలో జనసేన పార్టీ అధినేత పవన్కల్యాణ్ మాట్లాడుతూ దివిసీమ గొప్పతనం గురించి వివరిస్తూ ప్రజల్లో చైతన్యం నింపారు. -
వైకాపా నాయకుడి నోటి దురుసు
[ 05-05-2024]
ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న తెదేపా మహిళా కార్యకర్తను వైకాపా నాయకుడు అసభ్య పదజాలంతో దూషించిన ఘటన రాణిగారితోటలో చోటుచేసుకుంది.