రూకలివ్వలేదు.. రూపు మారలేదు!
విజయవాడ రూపురేఖలు మేమే మార్చాం. అభివృద్ధి మా ప్రభుత్వమే చేసింది’ అని సీఎం జగన్ విజయవాడ పర్యటనకు వచ్చినపుడు పదే పదే చెప్పే అబద్ధాలు చెప్పడం అలవాటు చేసుకున్నారు.
ఐటీఎంఎస్ ప్రాజెక్టుకు జగన్ పాతర
తీవ్ర ట్రాఫిక్తో నగరవాసికి నరకం
కేంద్రం నిధులూ వాడలేని దౌర్భాగ్యం
ఈనాడు, అమరావతి
బందరు రోడ్డులో నిత్యం ఇలానే..
విజయవాడ రూపురేఖలు మేమే మార్చాం. అభివృద్ధి మా ప్రభుత్వమే చేసింది’ అని సీఎం జగన్ విజయవాడ పర్యటనకు వచ్చినపుడు పదే పదే చెప్పే అబద్ధాలు చెప్పడం అలవాటు చేసుకున్నారు. మాటలు కోటలు దాటుతున్నా.. ఐదేళ్లలో బెజవాడ వాసుల ట్రాఫిక్ కష్టాలపై దృష్టి పెట్టలేదు. నగరంలో ట్రాఫిక్ నానాటికీ పెరుగుతోంది. రద్దీ వేళల్లో.. వీవీఐపీల రాకపోకల సమయంలో అధిక సమయం వాహనాలు నిలిపేస్తున్నారు. సమస్య పరిష్కారానికి పైసా విదల్చలేదు. కనీసం కేంద్రం ఇచ్చిన నిధులను సద్వినియోగం చేసుకోలేదు. ప్రభుత్వ వైఫల్యం కారణంగా విజయవాడ వాసులు ట్రాఫిక్తో నరకం చూస్తున్నారు.
సర్వేల్లో విజయవాడకు ఐటీఎంఎస్ మేలని తేలింది. 2019లో తెదేపా ప్రభుత్వ హయాంలోనే రూ.14.50 కోట్లతో పోలీసులు పంపిన సవివర నివేదికకు ఆమోదం లభించింది. ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్లో దీనిని చేర్చారు. అంచనా వ్యయంలో 33 శాతం అంటే.. రూ. 4,83,28,500 గత ప్రభుత్వం విడుదల చేసింది. ఆ మొత్తం ఖర్చు చేస్తే మిగిలింది దశల వారీగా విడుదల చేయనున్నట్లు చెప్పింది. టెండర్లు పిలిచి పనిని అప్పగించేందుకు పోలీసు శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం దానిని విస్మరించింది. ఫలితంగా నిధులు వెనక్కి వెళ్లాయి.
కష్టాలు కనిపించలేదా జగన్?
సీఎం జగన్ జిల్లాల పర్యటనలకు వెళ్లేందుకు తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయం వరకు రోడ్డు మార్గంలో దాదాపు 25 కి.మీ ప్రయాణం చేస్తుంటారు. ఎక్కువ భాగం విజయవాడ మీదుగానే వెళ్తారు. ఆయన రాకపోకల కోసం పోలీసులు ట్రాఫిక్ నిలిపివేస్తున్నారు. ఆ సమయాల్లో నగరవాసులు ట్రాఫిక్లో చిక్కుకుని అల్లాడిపోతున్నారు. ఐదేళ్లుగా ప్రయాణిస్తున్న సీఎం జగన్మోహన్రెడ్డికి తమ అవస్థలు కనిపించలేదా? అని నగరవాసులు నిలదీస్తున్నారు.
బెంజి సర్కిల్ కూడలి వద్ద మొండి స్తంభానికే పరిమితమైన సిగ్నల్ లైట్
కేంద్ర నిధులతో ప్రారంభమైనా..
రూ.15 కోట్ల వరకు వ్యయం అయ్యే ప్రాజెక్టును నిధుల కొరత దృష్ట్యా దశల వారీగా చేపట్టాలని నగరపాలిక, పోలీసు శాఖలు నిర్ణయించాయి. ‘నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం’ (ఎన్సీఏపీ) కింద నగరపాలికకు మంజూరైన కేంద్ర నిధులతో తొలి దశలో రూ.5 కోట్లను వీఎంసీ కేటాయించింది. 17 కూడళ్లలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్కు చెందిన ఎస్పీటీ నెట్వర్క్స్ సంస్థ రూ.3.94 కోట్లకు పనులు దక్కించుకుంది. గత ఏడాది మార్చిలో ఒప్పందం జరిగింది. 45 రోజుల్లో పూర్తి చేయాలని గడువు విధించారు. 14 కూడళ్లలో భూగర్భ కేబుల్ చేసి, స్తంభాలు పాతారు. పనులను కార్పొరేషన్ అధికారులు పరిశీలించి నాణ్యత లేదని తేల్చారు. సూచించిన మార్పులు చాన్నాళ్లకు కానీ గుత్తేదారు చేయలేదు. ఆ తర్వాత మళ్లీ పనులు ఆగిపోయాయి. పనుల పట్ల గుత్తేదారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా అధికారులు పట్టించుకోలేదు. పోలీసు, వీఎంసీ మధ్య సమన్వయం కొరవడింది. ఆ ప్రభావం పనులపై పడింది. మొదటి దశ పనులే ఇలా ఉంటే.. మిగిలినవి ఎప్పుడు ప్రారంభం అవుతాయో? అర్థం కాని పరిస్థితి.
ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం
ట్రాఫిక్ కష్టాల పట్ల నగర వైకాపా ప్రజాప్రతినిధులు కనీస బాధ్యతతో వ్యవహరించలేదు. పెద్ద సమస్య కాదన్నట్లుగా చూశారు. తమకు కాసులు కురిపించే సివిల్ పనులపైనే దృష్టి పెట్టారు. ఫలితంగా వైకాపా అధికారంలోకి వచ్చి ఐదేళ్లు అవుతున్నా.. సమస్య కొలిక్కి రాలేదు. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ కొన్నాళ్లు మంత్రిగా పనిచేశారు. సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కొన్ని పదవులు చేపట్టారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారంలో మాత్రం ఘోరంగా విఫలమయ్యారు. పైగా కేంద్ర నిధులతో పనులు ప్రారంభమైనా.. పూర్తి చేయించలేకపోయారు.
రాత్రి వేళల్లో రద్దీ
ఏమిటీ వ్యవస్థ
- ఐటీఎంఎస్ (ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్)లో ఇప్పుడున్న పాత సిగ్నలింగ్ బదులు ఆధునిక వ్యవస్థ రానుంది. కేంద్రీకృత నియంత్రిత విధానం ద్వారా అది పని చేస్తుంది. కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి ట్రాఫిక్ పర్యవేక్షిస్తారు.
- సిగ్నళ్ల స్తంభాలకు బిగించిన కెమెరాలు వాహనాలను గుర్తిస్తాయి. రద్దీ లేని మార్గంలో ఎరుపు సిగ్నల్ పడుతుంది. ఎక్కువ వాహనాలు ఉంటే.. అధిక సమయం ఆకుపచ్చ లైట్ వెలుగుతుంది.
- ఈ వ్యవస్థలో ఒకే మార్గంలోని సిగ్నళ్లు సమన్వయంతో పనిచేస్తాయి. ఫలితంగా నిరీక్షణ సమయం తగ్గుతుంది.
ఆశాజనక ఫలితాలు
- ఐటీఎంఎస్ విధానాన్ని ఐదేళ్ల నుంచి దశలవారీగా దేశంలోని వివిధ నగరాల్లో ఏర్పాటు చేశారు. చాలా చోట్ల సత్ఫలితాలను ఇస్తోంది.
- పుణెలో 68 కూడళ్లు, జైపుర్లో 25, కోల్కతాలో 95, అహ్మదాబాద్లో 93 కూడళ్లల్లో ఏర్పాటు చేశారు. మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. సగటు ప్రయాణ వేగం 10 శాతం పెరిగింది. ప్రయాణ జాప్యం 15 శాతం తగ్గింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అణువణువూ నిఘా!
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో సంచార నిఘా వాహనం ఏర్పాటు చేశారు. -
వైకాపా కూపన్లపై దర్యాప్తు ముమ్మరం
[ 30-04-2024]
అజిత్సింగ్నగర్లో ఆదివారం పట్టుబడిన వైకాపా కుక్కర్ల కూపన్లపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
ఓటమి భయంతో అవినాష్ అసత్య ప్రచారం
[ 30-04-2024]
వైకాపా విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్కు ఓటమి భయం పట్టుకుందని.. దీంతో హైదరాబాద్ గంగోత్రి పాఠశాల ప్రాంతంలో జరిగిన అభివృద్ధిని వీడియోగా చిత్రీకరించి.. అది విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైకాపా పాలనలో తాము చేసిన అభివృద్ధి అంటూ ఫేక్ ప్రచారాలు చేసుకునే స్థాయికి దిగజారిపోయారని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుల నియామకం
[ 30-04-2024]
సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికల కమిషన్ ఐఏఎస్, ఐఆర్ఎస్, ఐపీఎస్ అధికారులను పరిశీలకులుగా నియమించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. -
నాలుగేళ్లుగా నాన్చుడే పని
[ 30-04-2024]
-
వైకాపా అరాచకీయం!
[ 30-04-2024]
‘‘గుడివాడలో ఇటీవల రాజీనామాలు చేసిన ఒక్కో వాలంటీరుకు రూ.లక్షల్లో తాయిలాలు ఇచ్చి.. వారిని పోలింగ్ బూత్ ఏజెంట్లుగా వైకాపా తరఫున కూర్చోబెట్టేందుకు ఎమ్మెల్యే కొడాలి నాని వర్గం ప్రయత్నాలు ఆరంభించినట్టు తెలుస్తోంది. -
రసబరితం..!
[ 30-04-2024]
‘‘నామపత్ర ఘట్టం పూర్తయింది. బుజ్జగింపులకు తెరపడింది. కొందరు బరి నుంచి వైదొలిగారు. పోటీపడే అభ్యర్థుల లెక్క తేలింది. -
కత్తిగట్టారు.. కుట్రపన్నారు!
[ 30-04-2024]
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో 4,81,629 మంది పింఛనుదారులు ఉన్నారు. వీరికి రూ.142.98 కోట్లు సొమ్ము పంచాలి. మొత్తంగా 1,113 వార్డు, గ్రామ సచివాలయాలు ఉన్నాయి. -
కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో.. మహోన్నత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ : బుద్ధప్రసాద్
[ 30-04-2024]
కూటమి ప్రుభుత్వం ఏర్పాటుతో ఆంధ్ర ప్రదేశ్ మహోన్నత రాష్ట్రంగా రూపొందుతుందని మాజీ ఉపసబాపతి మండలి బుద్ధప్రసాద్ చెప్పారు. -
అత్యాచారం కేసులో ఇద్దరికి పదేళ్ల జైలు
[ 30-04-2024]
వివాహితపై సామూహిక అత్యాచారం చేసి ఆమెను చిత్రహింసలకు గురిచేసిన ఇద్దరికి పదేళ్ల జైలుశిక్ష, రూ.3 వేల చొప్పున జరిమానా విధిస్తూ విజయవాడ మహిళా సెషన్స్ న్యాయస్థానం న్యాయాధికారి ఐ.శైలజాదేవి సోమవారం తీర్పు చెప్పారు -
గురువులపై దమనకాండ
[ 30-04-2024]
జగన్ ప్రభుత్వం తమపై కక్ష గట్టి, పోలీసులతో కేసులు పెట్టించి.. ఉద్యమాన్ని అణచివేసేలా వ్యవహరించిందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
రాజధాని అమరావతితోనే నగరాభివృద్ధి
[ 30-04-2024]
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంతోనే విజయవాడ నగరం అభివృద్ధి చెందుతుందని జనసేన, భాజపా బలపరిచిన విజయవాడ పార్లమెంట్ తెదేపా ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్(చిన్ని) అన్నారు.