logo

‘రాష్ట్రంలో వైకాపా రాక్షస పాలన’

రాష్ట్రంలో వైకాపా రాక్షస పాలనతో జనం విలవిలలాడుతున్నారని సెంట్రల్‌ సీపీఎం అభ్యర్థి సి.హెచ్‌.బాబూరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 18 Apr 2024 05:00 IST

ఎన్నికల ప్రచారంలో బాబూరావు తదితరులు

అజిత్‌సింగ్‌నగర్‌ (మధురానగర్‌), న్యూస్‌టుడే : రాష్ట్రంలో వైకాపా రాక్షస పాలనతో జనం విలవిలలాడుతున్నారని సెంట్రల్‌ సీపీఎం అభ్యర్థి సి.హెచ్‌.బాబూరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం అజిత్‌సింగ్‌నగర్‌లో ఆయన పర్యటించారు. ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థించారు. ముఖ్యమంత్రిపై రాయి దాడి కేసులో అమాయకులను వేధించటం తగదన్నారు. అజిత్‌సింగ్‌నగర్‌పై చెడు ముద్ర వేయడం సరికాదన్నారు. విద్యుత్తు కోత, అంతర్జాల కేబుళ్ల తొలగింపు, చెట్లు నరకటం ఏంటని ప్రశ్నించారు. ఇది ప్రజల్లో తీవ్ర ఆగ్రహం కలిగించిందన్నారు. కాంగ్రెస్‌, సీపీఐ నాయకులు పి.వై.కిరణ్‌, తమ్మిన దుర్గ తదితరులు మాట్లాడారు. నగరంలో ప్రశాంత వాతావరణం కోసం ఇండియా వేదిక బలపరిచిన బాబూరావును గెలిపించాలని కోరారు. రమణారావు, చిట్టిబాబు, సన్యాసిరావు, రసూల్‌, రషీద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని