కస్తూర్బా విద్యార్థినులను పరామర్శించిన మంత్రి
శింగనమల మండలంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో అస్వస్థతకు గురైన విద్యార్థినులను మంత్రి ఉష శుక్రవారం అర్ధరాత్రి పరామర్శించారు.
బాధితురాలిని పరామర్శిస్తున్న మంత్రి ఉష
అనంతపురం విద్య, న్యూస్టుడే: శింగనమల మండలంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో అస్వస్థతకు గురైన విద్యార్థినులను మంత్రి ఉష శుక్రవారం అర్ధరాత్రి పరామర్శించారు. విషయం తెలుసుకున్న ఆమె అనంతపురం ఆసుపత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న విద్యార్థినులను, తల్లిదండ్రులను పరామర్శించారు.
తనిఖీ చేసిన కలెక్టర్
శింగనమల: శింగనమల కేజీబీవీని శనివారం కలెక్టర్ నాగలక్ష్మి తనిఖీ చేశారు. ఈ నెల 2న వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురైన విద్యార్థినుల ఆరోగ్య స్థితిని తెలుసుకొన్నారు. ఎక్కడ పొరపాటు జరిగిందని వంట వారిని ప్రశ్నించారు. పాఠశాల ప్రత్యేక అధికారి శ్రీలక్ష్మీకి వివిధ ప్రశ్నలు వేసి విద్యార్థినులు అస్వస్థతకు గురి కావడానికి గల కారణాలు తెలుసుకొన్నారు. పాఠశాలలోని సరకులు, పాలను సేకరించి పరిశీలనకు పంపాలని అధికారులను ఆదేశించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో ఆర్జేడీ వెంకటకృష్ణ, సమగ్రశిక్ష అధికారి విద్యాసాగర్, జిల్లా వైద్యాధికారి యుగంధర్, ఆర్డీవో మధుసూదన్, మండల అధికారులు పాల్గొన్నారు.
విద్యార్థినులు ఇంటికి... : పదోతరగతి చదువుతున్న విద్యార్థినులు ఇళ్లకు వెళ్లిపోయారు. అస్వస్థతకు గురైన విద్యార్థినులతో పాటు ఇతరులు కూడా వెళ్లారు. ప్రస్తుతం ఇంటర్ విద్యార్థినులు మాత్రమే ఉన్నారు.
నాయకులను అడ్డుకున్న పోలీసులు: జనసేన, భాజపా, విద్యార్థి, దళిత సంఘాల నాయకులు శనివారం శింగనమల కస్తూర్బా పరిశీలనకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకొన్నారు. జనసేన నాయకులు పురుషోత్తంరెడ్డి, సాకే మురళీకృష్ణ తదితరులు రోడ్డుపై భైఠాయించి నిరసన తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనాసురుడి దమనకాండ
[ 10-05-2024]
అక్రమాలపై ప్రశ్నిస్తే కేసులు.. అన్యాయాన్ని నిలదీస్తే ఎదురుదాడులు.. అవినీతిపై ఫిర్యాదు చేస్తే ఇక అంతే సంగతులు. జగనన్న ఐదేళ్ల పాలన సాగిన తీరిది. ప్రశ్నించడం దేవుడెరుగు ప్రతిపక్ష పార్టీల సమావేశాలకు వెళ్లినా తలలు పగలగొట్టారు. -
తుస్సుమన్న జగన్ సభ
[ 10-05-2024]
కళ్యాణదుర్గంలో గురువారం జరిగిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రోడ్షో, బహిరంగ సభ తుస్సుమంది. -
గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు
[ 10-05-2024]
‘జిల్లాలో జరిగే సార్వత్రిక ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా, ప్రశాంతంగా నిర్వహించడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడా ఏ సమస్య తలెత్తకుండా వ్యూహాత్మక ప్రణాళికతో సిద్ధంగా ఉన్నాం.నెక్కడైనా గొడవలు సృష్టిస్తే ఉక్కుపాదంతో అణచివేస్తాం. -
ఎడారి నివారణ ఎండమావే
[ 10-05-2024]
జిల్లాలోని బొమ్మనహాళ్, కణేకల్లు, బెళగుప్ప మండలాల్లోని వేదవతి హగరి పరివాహక ప్రాంతాల్లో ఇసుక దిబ్బలు రాజస్థాన్లోని థార్ ఎడారిని తలపిస్తున్నాయి. మొత్తం 4,700 ఎకరాల్లో ఇసుక దిబ్బలు విస్తరించి ఉన్నాయి. -
షరతులు పెట్టి.. రాయితీ ఎగ్గొట్టి..
[ 10-05-2024]
జగనన్న మైకు పట్టుకుంటే నా ఎస్సీ, నా ఎస్టీలు అంటూ మాట్లాడతాడు. అవన్నీ నీటి మీద రాతలే. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిపట్ల చిత్తశుద్ధి ఉందేమోనని అందరూ భావించారు. -
జానెడు రోడ్డేయలేని ఎమ్మెల్యే అవసరమా?: సునీత
[ 10-05-2024]
వచ్చే ఎన్నికల్లో రాప్తాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డికి పరాజయం తప్పదు. వైసీపీ నాయకులు తెదేపాలోకి కొనసాగుతున్న వలసలే ఓటమికి సంకేతమని మాజీ మంత్రి పరిటాల సునీత, ధర్మవరం ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు. -
ఫెసిలిటేషన్ కేంద్రం మూసివేత
[ 10-05-2024]
పోస్టల్ బ్యాలెట్లో ఉద్యోగులంతా తెదేపాకే మొగ్గు చూపడంతో వైకాపా నాయకులు కుట్రలకు తెరలేపారని, గురువారం గడువు ఉన్నప్పటికీ ఫెసిలిటేషన్ కేంద్రం మూసేశారని అనంతపురం అర్బన్ తెదేపా అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
వైకాపాను ఓటుతో తరిమివేయాలి: కాలవ
[ 10-05-2024]
నవరత్నాల పేరుతో సామాన్య ప్రజలను నట్టేట ముంచి ఐదేళ్లపాటు నయవంచక పాలన సాగించిన జగన్ను ఓటుతో తరిమి వేయాలని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. -
చెరువు మట్టినే కాదు.. చేపలనూ వదలని నాయకులు
[ 10-05-2024]
దోచుకోవడానికి ఏదీ అనర్హం కాదన్నట్లుగా హిందూపురంలో అధికార పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారు. చెరువు మట్టిని లేఅవుట్లకు తోలుకొని సొమ్ము చేసుకున్న నాయకులు కొందరైతే, చెరువుల్లోని చేపలను అమ్ముకున్నది మరికొందరు. -
ఓటరు స్లిప్పుల మాటున నగదు పంపిణీ
[ 10-05-2024]
పట్టణంలోని 11వ వార్డులో ఓటరు స్లిప్పుల మాటున నగదు పంపిణీ చేస్తున్న వైకాపా కార్యకర్తలకు స్థానికుల నుంచి ఊహించని రీతిలో తిరుగుబాటు ఎదురైంది. -
వేరే పార్టీకి ఓటేస్తే పథకాలు రావంటూ బెదిరింపు
[ 10-05-2024]
వేరే పార్టీకి ఓటు వేస్తే ఎలాంటి పథకాలు రావని ధర్మవరం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఓటర్లను బెదిరించేలా మాట్లాడారు. -
తెదేపాతోనే మీ భూములకు రక్షణ: నారా రోహిత్
[ 10-05-2024]
తెదేపా అధికారంలోకి వచ్చి నారాచంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే మీ భూములకు గ్యారంటీ లభిస్తుందని సినీ హీరో నారా రోహిత్ అన్నారు. గురువారం రొళ్లలో నిర్వహించిన తెదేపా ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. -
దోచుకొని.. దాచుకోవడానికే వచ్చిన వలస పక్షులు
[ 10-05-2024]
కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి నుంచి వైకాపా హిందూపురం ఎంపీ అభ్యర్థిగా శాంతమ్మ, బెంగళూరు/కళ్యాణదుర్గం నుంచి పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉషశ్రీచరణ్ అనే వలస పక్షులు ఎన్నికల్లో డబ్బులు వెదజల్లి ఎలాగైనా గెలుపొంది ప్రకృతి వనరులను దోచుకొని.. -
డీఐజీగా షేముషి బాధ్యతల స్వీకరణ
[ 10-05-2024]
అనంతపురం రేంజ్ డీఐజీగా షేముషి బాజ్పేయి గురువారం అనంతపురం పోలీస్ హెడ్క్వార్టర్స్లోని తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. -
న్యూస్టుడే విలేకరి రమేష్పై దాడి హేయం
[ 10-05-2024]
ముఖ్యమంత్రి జగన్ పర్యటన నేపథ్యంలో కళ్యాణదుర్గం బహిరంగసభలో న్యూస్టుడే విలేకరి రమేష్పై వైకాపా గూండాలు దాడి చేయడం అత్యంత బాధాకరమని... -
పెల్లుబుకిన ఆక్రోశం, అసంతృప్తి
[ 10-05-2024]
ఐదేళ్ల వైకాపా పాలనపై ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో ఆక్రోశం పెల్లుబుకింది. జగన్ పాలనపై వ్యతిరేకత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. నీ పాలన ఇక చాలంటూ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లో వారిలో కసి.. కోపం ప్రస్ఫుటమయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్కు తల్లిదండ్రుల స్వాగతం.. వారిని చూసి సీఎం భావోద్వేగం
-
బ్రిజ్ భూషణ్కు ఎదురుదెబ్బ.. అభియోగాల నమోదుకు కోర్టు ఆదేశం
-
మాల్దీవుల్ని వీడిన చివరి బ్యాచ్.. భారత సైనిక సిబ్బంది ఉపసంహరణ పూర్తి!
-
ఐఫోన్లు తయారు చేయడం స్టీవ్జాబ్స్కు ఇష్టంలేదట!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
తల్లితో కలిసి పిఠాపురానికి రామ్ చరణ్