తీరిన వాహనదారుల కష్టాలు
టవర్క్లాక్ సమీపంలో నిర్మించిన నాలుగు వరుసల వంతెనపై వాహనాల రాకపోకలు ఆరంభమయ్యాయి. మే 29న వంతెనను కలెక్టర్ ప్రారంభించారు. ఈనెల 1వ తేదీ నుంచి వాహనాల రాకపోకలకు అనుమతిస్తామన్నారు.
వంతెనపై రాకపోకలు ఆరంభం
బస్సులకు ఇప్పుడే అనుమతిలేదు
టవర్క్లాక్ వద్ద వంతెనపై ప్రయాణిస్తున్న వాహనాలు
అనంతపురం విద్య, న్యూస్టుడే: టవర్క్లాక్ సమీపంలో నిర్మించిన నాలుగు వరుసల వంతెనపై వాహనాల రాకపోకలు ఆరంభమయ్యాయి. మే 29న వంతెనను కలెక్టర్ ప్రారంభించారు. ఈనెల 1వ తేదీ నుంచి వాహనాల రాకపోకలకు అనుమతిస్తామన్నారు. ప్రకటించిన తేదీ కంటే ముందుగానే అనుమతి లభించింది. వాహనచోదకులు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా మంగళవారం నుంచే వాహనాల రాకపోకలకు అడ్డు తొలగించారు. కానీ, బస్సులు, లారీలు వంటి భారీ వాహనాలకు ఇంకా అనుమతివ్వలేదు. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు తదితర లైట్ మోటారు వాహనాలు ఫ్లైఓవర్బ్రిడ్జిపై రాకపోకలు సాగిస్తున్నాయి. జాతీయ రహదారులశాఖ ఆధ్వర్యంలో ఈ వంతెన నిర్మాణం చేపట్టారు. సుమారు 16 నెలలుగా పనులు సాగుతున్నాయి. నాటి నుంచి వాహనదారుల కష్టాలు వర్ణనాతీతం. రైల్వేట్రాక్కు అటువైపు నివసిస్తున్న ప్రజలు టవర్క్లాక్ వద్దకు రావాలంటే చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి. కొన్ని రోడ్లలో ట్రాఫిక్ సమస్య పరిష్కరించలేక అడ్డంగా బారికేడ్లు నిర్మించారు. దీంతో వాహనదారులు సజావుగా వెళ్లలేని పరిస్థితి. వంతెనకు అటు, ఇటు ఉన్న దుకాణదారులు కూడా వ్యాపారాలు లేక ఇబ్బందులు పడ్డారు. అన్నివర్గాల ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. ఆర్వోబీ ప్రారంభించడంతో అనంత వాసుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.
ప్రయాణికులకు మరికొంత కాలం అదనపు భారం
ఫ్లైఓవర్ బ్రిడ్జిపై రాకపోకలకు అనుమతిచ్చినా.. ఆర్టీసీ బస్సులకు అనుమతించలేదు. నడిమివంకపై నిర్మిస్తున్న వంతెన ఒకవైపు మాత్రమే పూర్తి చేశారు. మరోవైపు మంగళవారం రాత్రి స్లాబ్పనులు పూర్తి చేశారు. బ్రిడ్జి క్యూరింగ్ దశలో ఉంది. జాతీయ రహదారులశాఖ అధికారులు వాహనాలకు అనుమతిచ్చారు. కానీ, ట్రాఫిక్పోలీసు అధికారులు భారీ వాహనాలకు అనుమతివ్వలేదు. బళ్లారి, ఉరవకొండ, కళ్యాణదుర్గం, రాయదుర్గం వైపు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు ఇస్కాన్ ఆలయం చుట్టుముట్టి రావాల్సిన పరిస్థితి. బస్టాండుకు చేరాలంటే సుమారు 6 కి.మీ. దూరం అదనంగా ప్రయాణించాలి. అదనపు ప్రయాణానికి ప్రయాణికుల నుంచి రూ.10 అదనంగా ఆర్టీసీ బస్సులో వసూలు చేస్తున్నారు. ఈ అదనపు భారం, సమయం మరికొంత కాలం భరించక తప్పదు. అధికారులేమంటున్నారంటే..
రాకపోకలకు అనుమతిచ్చాం
ప్రజలు ఇబ్బందులు పడకుండా సజావుగా ప్రయాణం సాగాలనే ఉద్దేశంతో రహదారి విస్తరణ, వంతెన నిర్మాణం చేపట్టాం. వంతెన పూర్తయింది. ఇంకా వాహనదారులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో వంతెనపై రాకపోకలకు అనుమతిచ్చాం. ప్రజల ఇక్కట్లు పరిష్కరించాం. అన్ని వాహనాలు ప్రయాణించవచ్చు.
జగదీశ్గుప్తా, డీఈ, జాతీయ రహదారులశాఖ
అప్పటి నుంచి అదనపు వసూళ్లు చేయం
వంతెనపై బస్సుల ప్రయాణానికి పోలీసుశాఖ నుంచి ఇంకా అనుమతి రాలేదు. ట్రాఫిక్ పోలీసులు అనుమతిచ్చిన వెంటనే వంతెనపై బస్సులు నడుపుతాం. అప్పటి నుంచి అదనంగా రూ.10 వసూలు చేయం. పాత టికెట్టు రేట్లే వర్తిస్తాయి.
నాగభూపాల్, డిపో మేనేజరు, ఆర్టీసీ
15 రోజుల తర్వాతే భారీ వాహనాలు
నడిమివంకపై బ్రిడ్జి పనులు ఇంకా పూర్తి కాలేదు. ఒకవైపు మాత్రమే వాహనాలు వెళ్తున్నాయి. దీంతో ట్రాఫిక్ సమస్య ఎదురవుతోంది. అందుకే భారీ వాహనాలను అనుమతించలేదు. బ్రిడ్జి క్యూరింగ్ పనులు పూర్తయ్యాక 15 రోజుల తరువాత బస్సులకు అనుమతిస్తాం.
వెంకటేష్నాయక్, ట్రాఫిక్ సీఐ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనాసురుడి దమనకాండ
[ 10-05-2024]
అక్రమాలపై ప్రశ్నిస్తే కేసులు.. అన్యాయాన్ని నిలదీస్తే ఎదురుదాడులు.. అవినీతిపై ఫిర్యాదు చేస్తే ఇక అంతే సంగతులు. జగనన్న ఐదేళ్ల పాలన సాగిన తీరిది. ప్రశ్నించడం దేవుడెరుగు ప్రతిపక్ష పార్టీల సమావేశాలకు వెళ్లినా తలలు పగలగొట్టారు. -
తుస్సుమన్న జగన్ సభ
[ 10-05-2024]
కళ్యాణదుర్గంలో గురువారం జరిగిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రోడ్షో, బహిరంగ సభ తుస్సుమంది. -
గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు
[ 10-05-2024]
‘జిల్లాలో జరిగే సార్వత్రిక ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా, ప్రశాంతంగా నిర్వహించడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడా ఏ సమస్య తలెత్తకుండా వ్యూహాత్మక ప్రణాళికతో సిద్ధంగా ఉన్నాం.నెక్కడైనా గొడవలు సృష్టిస్తే ఉక్కుపాదంతో అణచివేస్తాం. -
ఎడారి నివారణ ఎండమావే
[ 10-05-2024]
జిల్లాలోని బొమ్మనహాళ్, కణేకల్లు, బెళగుప్ప మండలాల్లోని వేదవతి హగరి పరివాహక ప్రాంతాల్లో ఇసుక దిబ్బలు రాజస్థాన్లోని థార్ ఎడారిని తలపిస్తున్నాయి. మొత్తం 4,700 ఎకరాల్లో ఇసుక దిబ్బలు విస్తరించి ఉన్నాయి. -
షరతులు పెట్టి.. రాయితీ ఎగ్గొట్టి..
[ 10-05-2024]
జగనన్న మైకు పట్టుకుంటే నా ఎస్సీ, నా ఎస్టీలు అంటూ మాట్లాడతాడు. అవన్నీ నీటి మీద రాతలే. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిపట్ల చిత్తశుద్ధి ఉందేమోనని అందరూ భావించారు. -
జానెడు రోడ్డేయలేని ఎమ్మెల్యే అవసరమా?: సునీత
[ 10-05-2024]
వచ్చే ఎన్నికల్లో రాప్తాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డికి పరాజయం తప్పదు. వైసీపీ నాయకులు తెదేపాలోకి కొనసాగుతున్న వలసలే ఓటమికి సంకేతమని మాజీ మంత్రి పరిటాల సునీత, ధర్మవరం ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు. -
ఫెసిలిటేషన్ కేంద్రం మూసివేత
[ 10-05-2024]
పోస్టల్ బ్యాలెట్లో ఉద్యోగులంతా తెదేపాకే మొగ్గు చూపడంతో వైకాపా నాయకులు కుట్రలకు తెరలేపారని, గురువారం గడువు ఉన్నప్పటికీ ఫెసిలిటేషన్ కేంద్రం మూసేశారని అనంతపురం అర్బన్ తెదేపా అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
వైకాపాను ఓటుతో తరిమివేయాలి: కాలవ
[ 10-05-2024]
నవరత్నాల పేరుతో సామాన్య ప్రజలను నట్టేట ముంచి ఐదేళ్లపాటు నయవంచక పాలన సాగించిన జగన్ను ఓటుతో తరిమి వేయాలని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. -
చెరువు మట్టినే కాదు.. చేపలనూ వదలని నాయకులు
[ 10-05-2024]
దోచుకోవడానికి ఏదీ అనర్హం కాదన్నట్లుగా హిందూపురంలో అధికార పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారు. చెరువు మట్టిని లేఅవుట్లకు తోలుకొని సొమ్ము చేసుకున్న నాయకులు కొందరైతే, చెరువుల్లోని చేపలను అమ్ముకున్నది మరికొందరు. -
ఓటరు స్లిప్పుల మాటున నగదు పంపిణీ
[ 10-05-2024]
పట్టణంలోని 11వ వార్డులో ఓటరు స్లిప్పుల మాటున నగదు పంపిణీ చేస్తున్న వైకాపా కార్యకర్తలకు స్థానికుల నుంచి ఊహించని రీతిలో తిరుగుబాటు ఎదురైంది. -
వేరే పార్టీకి ఓటేస్తే పథకాలు రావంటూ బెదిరింపు
[ 10-05-2024]
వేరే పార్టీకి ఓటు వేస్తే ఎలాంటి పథకాలు రావని ధర్మవరం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఓటర్లను బెదిరించేలా మాట్లాడారు. -
తెదేపాతోనే మీ భూములకు రక్షణ: నారా రోహిత్
[ 10-05-2024]
తెదేపా అధికారంలోకి వచ్చి నారాచంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే మీ భూములకు గ్యారంటీ లభిస్తుందని సినీ హీరో నారా రోహిత్ అన్నారు. గురువారం రొళ్లలో నిర్వహించిన తెదేపా ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. -
దోచుకొని.. దాచుకోవడానికే వచ్చిన వలస పక్షులు
[ 10-05-2024]
కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి నుంచి వైకాపా హిందూపురం ఎంపీ అభ్యర్థిగా శాంతమ్మ, బెంగళూరు/కళ్యాణదుర్గం నుంచి పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉషశ్రీచరణ్ అనే వలస పక్షులు ఎన్నికల్లో డబ్బులు వెదజల్లి ఎలాగైనా గెలుపొంది ప్రకృతి వనరులను దోచుకొని.. -
డీఐజీగా షేముషి బాధ్యతల స్వీకరణ
[ 10-05-2024]
అనంతపురం రేంజ్ డీఐజీగా షేముషి బాజ్పేయి గురువారం అనంతపురం పోలీస్ హెడ్క్వార్టర్స్లోని తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. -
న్యూస్టుడే విలేకరి రమేష్పై దాడి హేయం
[ 10-05-2024]
ముఖ్యమంత్రి జగన్ పర్యటన నేపథ్యంలో కళ్యాణదుర్గం బహిరంగసభలో న్యూస్టుడే విలేకరి రమేష్పై వైకాపా గూండాలు దాడి చేయడం అత్యంత బాధాకరమని... -
పెల్లుబుకిన ఆక్రోశం, అసంతృప్తి
[ 10-05-2024]
ఐదేళ్ల వైకాపా పాలనపై ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో ఆక్రోశం పెల్లుబుకింది. జగన్ పాలనపై వ్యతిరేకత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. నీ పాలన ఇక చాలంటూ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లో వారిలో కసి.. కోపం ప్రస్ఫుటమయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు.. అయిదుగురు మావోయిస్టుల మృతి!
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. నేడూ 75 విమానాలు రద్దు
-
అగార్కర్ నిర్ణయం మేరకే ఇషాన్ - శ్రేయస్లపై వేటు: బీసీసీఐ కార్యదర్శి
-
విజయ్ దేవరకొండ-రష్మికల జోడి మరోసారి మెరవనుందా!
-
వేర్పాటువాదుల ఆగడాలు..! కెనడాపై మండిపడ్డ జైశంకర్
-
పోలింగ్ డేటాపై ఆరోపణలు నిరాధారం: ఖర్గే లేఖపై ఈసీ ఆగ్రహం