logo

దారిలో ప్రాణం వదిలిన భార్య.. తల్లడిల్లిపోయిన భర్త

భార్యకు వైద్యం చేయించేందుకు వెళ్తుండగా.. మార్గమధ్యంలో ఆమె మృతి చెందడంతో భర్త చేసిన రోదనలు మిన్నంటాయి.

Updated : 20 Aug 2023 07:46 IST

భార్య మృతదేహాన్ని పట్టుకుని రోదిస్తున్న ఈశ్వరప్ప

ఓబుళదేవరచెరువు, న్యూస్‌టుడే : భార్యకు వైద్యం చేయించేందుకు వెళ్తుండగా.. మార్గమధ్యంలో ఆమె మృతి చెందడంతో భర్త చేసిన రోదనలు మిన్నంటాయి. చూపరులను కంటతడి పెట్టించింది. అమడగూరు మండలంలోని మామిడిమేకలపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరప్ప తన భార్య చౌడమ్మ (35) అనారోగ్యంతో బాధపడుతుండటతో ఆమెను వైద్య పరీక్షల కోసమని అనంతపురానికి తీసుకెళ్లేందుకు స్వగ్రామం నుంచి ఆటోలో ఓబుళదేవరచెరువుకు చేరుకున్నారు. ఓబుళదేవరచెరువు బస్టాండ్‌కు రాగానే ఆమె పరిస్థితి విషమంగా మారింది. బస్సు కోసం వేచి చూసేలోగా ఆమె మృతి చెందింది. దీంతో మృతదేహాన్ని హత్తుకుని అతను బోరున విలపించడం అందరినీ కలిచివేసింది. కనీసం మృతదేహన్ని స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు కూడా అతని వద్ద డబ్బులు లేకపోవడంతో ప్రజలే చందాలు వసూలూ చేసి శవాన్ని ప్రైవేటు వాహనంలో స్వగ్రామనికి చేర్చి ఔదార్యం చాటుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు