logo

Anantapur: పెళ్లైన ఏడు నెలలకే బలవన్మరణం

ఎన్నో ఆశలతో వివాహం చేసుకున్న యువతి క్షణికావేశంలో బలవన్మరణానికి పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం... మండలంలోని వెలగమేకలపల్లి తండాకు చెందిన ప్రతాప్‌ నాయక్‌కు తనకల్లు మండలం రెడ్డివారిపల్లికి చెందిన చంద్రకళా బాయి (19)తో ఏడు నెలల కిందట వివాహమైంది.

Updated : 24 Dec 2023 10:51 IST

చంద్రకళా బాయి (పాత చిత్రం)

సోమందేపల్లి, న్యూస్‌టుడే: ఎన్నో ఆశలతో వివాహం చేసుకున్న యువతి క్షణికావేశంలో బలవన్మరణానికి పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం... మండలంలోని వెలగమేకలపల్లి తండాకు చెందిన ప్రతాప్‌ నాయక్‌కు తనకల్లు మండలం రెడ్డివారిపల్లికి చెందిన చంద్రకళా బాయి (19)తో ఏడు నెలల కిందట వివాహమైంది. కొద్ది నెలలు కూడా సంసారం సక్రమంగా సాగకముందే..కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. జీవితంపై విరక్తి చెందిన ఆమె ఈనెల 13న మామ, భర్త పొలం వద్దకు వెళ్లిన సమయంలో పురుగు మందు తాగింది. అత్తలేదు. అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందతున్న ఆమె శనివారం సాయంత్రం మృతి చెందినట్లు ఎస్సై విజయ్‌కుమార్‌ చెప్పారు. ఆమె కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో గ్రామంలో విషాదఛాయలు అలుముకొన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని