గర్భిణి మృతి అనుమానాస్పదం?
అనంత కలెక్టర్ కార్యాలయ సర్కిల్లో ఉన్న ఫాదర్ ఫెర్రర్ విగ్రహం వద్ద చోటు చేసుకున్న గర్భిణి అంజలి (29) మృతి అనుమానాస్పదంగా మారింది.
కలెక్టరేట్ ఎదుట జరిగిన ఘటనలో కొత్త కోణం
పిల్లలతో ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి, ఆర్డీఓ వెంకటేశు, సీడీపీఓ లలిత, తదితరులు
జిల్లా సచివాలయం, న్యూస్టుడే: అనంత కలెక్టర్ కార్యాలయ సర్కిల్లో ఉన్న ఫాదర్ ఫెర్రర్ విగ్రహం వద్ద చోటు చేసుకున్న గర్భిణి అంజలి (29) మృతి అనుమానాస్పదంగా మారింది. మానవత్వం మంటగలిసేలా.. హృదయ విదారక నిజం తెరపైకి వచ్చింది. ఏదో ద్విచక్ర వాహనం ఢీకొట్టడం వల్లే గర్భిణి చనిపోయిందని భావించారు. ఇదే ఘటనపై మంగళవారం ‘సంక్షేమం ఎరగని నిరుపేద కుటుంబం’ అన్న కథనాన్ని ‘ఈనాడు’ ప్రచురించింది. ఐసీడీఎస్ పీడీ బీఎన్ శ్రీదేవి నేతృత్వంలో ఆర్డీఓ వెంకటేశు, సీడబ్ల్యూసీ ఛైర్పర్సన్ రామలక్ష్మి, సీఐ రెడ్డప్ప, సీడీపీఓ చల్లా లలిత జిల్లా స్త్రీ,శిశు సంక్షేమ కార్యాలయంలో మృతురాలి అత్త, బిడ్డలను వేర్వేరుగా విచారించడంతో అసలు నిజం మంగళవారం బయటకు వచ్చింది. మృతురాలి అత్త తులశమ్మ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 23న ఉదయం కూలి పని కల్పిస్తామంటూ ఓ ఇద్దరు వ్యక్తులు వచ్చి తీసుకెళ్లారు. రాత్రి 8 గంటల సమయంలో స్పృహ కోల్పోయిన స్థితిలో ద్విచక్ర వాహనంలో తీసుకొచ్చి పడేసి వెళ్లిపోయారు’ అంటూ అధికారుల విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. అప్పటికే రక్తస్రావం అయినట్లు చెప్పడంతో ఆమె చెప్పిన నిజాలు విన్న అధికారులు షాక్ అయ్యారు. అనంత నగరం నాయక్నగర్, మరవకొమ్మకాలనీకి చెందిన దస్తగిరి, బాల ఆ గర్భిణిని తీసుకెళ్లినట్లు ప్రాథమిక సమాచారం. ఒకటో పట్టణ పోలీస్స్టేషన్లో అంజలి మృతిని అనుమానాస్పదంగా నమోదు చేసినట్లు స్టేషన్ సీఐ రెడ్డప్ప ధ్రువీకరించారు. ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తామని చెప్పారు.
ఆ ముగ్గురికి ఆసరా..
మృతురాలైన అంజలి కుటుంబానికి జరిగిన అన్యాయంపై ‘ఈనాడు’లో వచ్చిన కథనానికి కలెక్టర్ గౌతమి స్పందించారు. ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి అన్ని విధాలా చర్యలు తీసుకోవాలంటూ ఐసీడీఎస్, రెవెన్యూ, పోలీసు, విద్య.. వంటి శాఖల అధికారులను అప్రమత్తం చేశారు. పీడీ శ్రీదేవి సారథ్యంలో అత్త తులశమ్మ, 13 ఏళ్ల కూతురు అఖిల, 10 ఏళ్ల చరణ్, 9 ఏళ్ల సాయిని ఐసీడీఎస్ కార్యాలయానికి తీసుకొచ్చారు. భర్త రాజు వెతికినా దొరకలేదు. ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నారు. ఎలా బతికారు. ఏమేం పనులు చేసుకుంటున్నారు.. వంటి వివరాలన్నీ వారితో ఆరా తీశారు. తాత్కాలిక వసతిలో భాగంగా అఖిలను బాలసదన్లో, తక్కిన ఇద్దరు బాలలను బీకే సముద్రం మండలం రోటరీపురంలో జీవని ఆశ్రమంలో చేర్పించారు. వృద్ధురాలు తులసమ్మను బుధవారం ఆకుతోటపల్లి సమీపంలోని అమ్మఒడి వృద్ధాశ్రమంలో చేర్పించేలా చర్యలకు ఉపక్రమించారు. వీరి ఆలనాపాలనా సంబంధిత అధికారులే తీసుకోనున్నారు.
విచారణ ఏదీ?
కలెక్టర్ కార్యాలయం ఫెర్రర్ విగ్రహం వద్ద ఈ ఆదివారం(24న) తెల్లవారుజామున గర్భిణి అంజలి మృతిపై సమాచారం అందుకున్న నగర పాలక సంస్థ సిబ్బంది ఓ సేవా సంస్థ సాయంతో హడావుడిగా జేఎన్టీయూ సమీపంలోని శ్మశాన వాటికలో ఖననం చేశారు. ఈ ఘటన ఎలా జరిగింది. ఆ కుటుంబ పరిస్థితి ఏంటి? అనే వివరాలు ఆరా తీయలేదు. ఆ రోజు నుంచి కేసు కూడా నమోదు చేయలేదు. నిరుపేద గర్భిణి కదా.. ఏం కాలేదన్న ఉద్దేశంతో అధికారులు చేతులు దులిపేసుకున్నట్లు తెలుస్తోంది. కనీస విచారణ చేయకుండానే ముగించాలని చూశారు. మృతురాలి కుటుంబ సభ్యుల విచారణతో అసలు బాగోతం తెరపైకి వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి హల్చల్..
[ 28-04-2024]
ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో శనివారం అర్ధరాత్రి వైకాపా నేతలు దౌర్జన్యం చేశారు. -
వైకాపాకు షాక్ మంత్రి వచ్చిన రోజునే రాజీనామా..
[ 28-04-2024]
అధికార వైకాపాకు షాక్ తగిలింది. హిందూపురంపై ప్రత్యేక దృష్టి సారించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం పట్టణానికి వచ్చి నాయకులు, కార్యకర్తలను దిశా నిర్దేశం చేశారు. -
రోడ్ల మంత్రి ప్రారంభించిన పనులకే దిక్కులేదు
[ 28-04-2024]
రాష్ట్ర రహదారులు-భవనాల శాఖ మంత్రిగా శంకర నారాయణ ప్రారంభించిన రోడ్డు నిర్మాణ పనులకే దిక్కులేకుండా పోయింది. -
వైకాపా నాయకుడి బరితెగింపు
[ 28-04-2024]
ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా.. అన్నట్లుంది అధికార వైకాపా నాయకుల తీరు. పార్టీ పెద్దలు పంచభూతాలను ఆదాయ వనరులుగా మార్చుకుంటే.. కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు తామేం తక్కువన్నట్లు బరితెగిస్తున్నారు. ప్రభుత్వ భూములే లక్ష్యంగా చేసుకుని ఆదాయ వనరులు పెంచుకుంటున్నారు. -
పంట అమ్మాలంటే కర్ణాటక వెళ్లాల్సిందే..
[ 28-04-2024]
ఉరవకొండ నియోజకవర్గంలో రైతులు పంట దిగుబడులను అమ్ముకోవడానికి పడుతున్నట్లు ఇబ్బందులు వర్ణనాతీతం. -
వైకాపాను సాగనంపుదాం
[ 28-04-2024]
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని తెదేపా అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు. రాయదుర్గం పట్టణంలోని 28వ వార్డులో, బొమ్మనహాళ్ మండలంలోని బొల్లనగుడ్డం, కల్హోళ, తారకాపురం, కల్లుదేవనహళ్లి గ్రామాల్లో శనివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
మెట్టుకు ఓటేస్తే చెత్తబుట్టలో వేసినట్టే : కాలవ
[ 28-04-2024]
మెట్టు గోవిందరెడ్డి తన పదవులను అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించటం తప్పా నియోజకవర్గానికి చేసిందేమీ లేదని, ఆయనకు ఓటేస్తే చెత్త బుట్టలో వేసినట్లేనని రాయదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు ఎద్దేవా చేశారు. -
‘రెండేళ్లలో బీటీపీకి కృష్ణాజలాలు తీసుకొస్తాం’
[ 28-04-2024]
అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోపు కాలువ పనులు పూర్తి చేసి బ్రహ్మసముద్రం మండలం, బీటీపీ జలాశయానికి గ్రావీటి ద్వారా కృష్ణా జలాలు తీసుకొస్తానని కళ్యాణదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు హామీ ఇచ్చారు. -
వైకాపాకు మరో అవకాశం ఇస్తే.. అరాచక పాలనే
[ 28-04-2024]
ఒక్క ఛాన్స్ పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన వైకాపాకు మరో ఛాన్స్ ఇస్తే రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. -
వైకాపా పతనానికి రోజులు దగ్గర పడ్డాయి : కేశవ్
[ 28-04-2024]
వైకాపా ప్రభుత్వ పతనానికి రోజులు దగ్గర పడ్డాయని ఉరవకొండ తెదేపా అభ్యర్థి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. -
జగనా.. రద్దు తగునా?
[ 28-04-2024]
ఉమ్మడి జిల్లాలో వ్యవసాయం తర్వాత పాడిపరిశ్రమకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. తెదేపా ప్రభుత్వ హయాంలో వివిధ జాతులకు సంబంధించి పాడి ఆవులు, గేదెలు కొనుగోలు చేయడంతో పాటు మాగుడు గడ్డి, దాణామృతం తదితర పోషకాలను రాయితీతో అందించి ప్రోత్సహించారు. -
వాలంటీర్ల వద్దే సెల్ఫోన్లు
[ 28-04-2024]
గ్రామ వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచడంతో పాటు వారి నుంచి సెల్ఫోన్లు, ఇతర ప్రభుత్వ సామగ్రిని స్వాధీనం చేసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించిన విషయం తెలిసిందే. -
అవినీతిలోనూ పెద్దాయనే..
[ 28-04-2024]
అవినీతికి..అరాచకానికి చొక్కా, పంచె తొడిగితే అచ్చం అయనలాగే ఉంటుంది. తాడిపత్రిలో వైకాపా ప్రజాప్రతినిధిగా చలామణి అవుతున్న ‘పెద్ద’మనిషి అక్రమాలను చెప్తే చాంతాడంతా.. రాస్తే రామాయణమంతా అవుతుంది. -
ఐదేళ్లలో ఇష్టారాజ్యంగా ప్రకృతి వనరుల దోపిడీ
[ 28-04-2024]
వైకాపా ఐదేళ్ల పాలనలో దోపిడీ, అవినీతి, అక్రమాలు జరిగాయని, ప్రకృతి వనరులను సైతం దోచుకున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. -
కాలం చెల్లి.. కదలనంటోన్న ప్రగతి రథచక్రం
[ 28-04-2024]
‘అనంతపురం ఆర్టీసీ బస్టాండులో ఈనెల 7న హిందూపురం డిపోకు చెందిన బస్సు 8వ ఫ్లాట్ఫాం మీదకు పరుగులు పెట్టింది. -
జగనా.. మజాకా
[ 28-04-2024]
తాడిపత్రికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వస్తున్నారని పోలీసులు విధించిన పలు ఆంక్షలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
-
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు: తమన్నా
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఎంపీ ప్రజ్వల్, రేవణ్ణలపై కేసు
-
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ డార్ నియామకం
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?