ఎట్టకేలకు భూగర్భ రైలు వంతెన పూర్తి
నగరవాసులు చాలాకాలంగా ఎదురు చూస్తున్న గడియారం స్తంభం కూడలిలోని ప్రధాన వంతెన కింద ఏర్పాటు చేసిన భూగర్భ రైలు వంతెన పనులు ఎట్టకేలకు పూర్తి చేశారు.
వాహనాల రాకపోకలు ప్రారంభం
పూర్తయిన భూగర్భ రైలు వంతెన
అనంతపురం(రైల్వే), న్యూస్టుడే: నగరవాసులు చాలాకాలంగా ఎదురు చూస్తున్న గడియారం స్తంభం కూడలిలోని ప్రధాన వంతెన కింద ఏర్పాటు చేసిన భూగర్భ రైలు వంతెన పనులు ఎట్టకేలకు పూర్తి చేశారు. ప్రధాన వంతెన పూర్తి అయినప్పటికీ భూగర్భ రైలు వంతెన పనులు రైల్వే శాఖ నుంచి అనుమతులు రావడంలో ఆలస్యమైంది. రైల్వే శాఖ నుంచి అనుమతులు వచ్చిన తర్వాత రైల్వే ఇంజినీర్ల పర్యవేక్షణలో పట్టాల కింద తవ్వకాల పనులు చేపట్టారు. అనంతరం రైలు పట్టాలకు గరండాలను ఏర్పాటు చేసి సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం భూగర్భ రైలు వంతెన పనులు పూర్తి అయ్యాయి. ఇక రైల్వే శాఖ గరండాలను తొలగించి సాధారణ రైలు పట్టాలను వేయాల్సి ఉంది. అప్పటి వరకు రైళ్ల రాకపోకలు సాగుతాయి. ఈ వంతెనలో మంగళవారం నుంచి వాహనాల రాకపోకలు ప్రారంభం అయ్యాయి.
రోడ్డు ఉపరితల వంతెన (ఆర్వోబీ)పై వెళ్లే వాహనాలు నడిమివంక దాటిన తర్వాత యూ టర్న్ తీసుకొని ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు రోడ్లవైపు వెళ్లాల్సి ఉంటుంది. వాహన చోదకులు ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం భూగర్భ రైలు వంతెన (ఆర్యూబీ) రావడంతో గడియారం కూడలి, కోర్డు రోడ్డు నుంచి ఒకటో రోడ్డు వైపు ఒకటి, రెండు, మూడు, నాలుగు రోడ్ల వైపు నివసించే వాసులతో పాటు ఆర్కేనగర్, రజకనగర్ వైపు వాసులకు సౌలభ్యంగా ఉంటుంది. ప్రధానంగా గడియారం స్తంభం వైపు ఉన్న ప్రయాణికులు ఒకటో రోడ్డు వైపు ఉన్న ప్రధాన రైల్వేస్టేషన్ ఒకటో ప్లాట్ఫారానికి వెళ్లడానికి వీలుగా ఉంటుంది. అనంతపురం నుంచి గుత్తి, గుంతకల్లు, విజయవాడ, హైదరాబాద్ వెళ్లే రైళ్లు ఒకటో ప్లాట్ఫారంలోనే ఆగుతాయి. గడియారం వైపు ఉన్న ప్రయాణికులు భూగర్భ రైలు వంతెన ద్వారా రెండో రోడ్డు, ఒకటవ రోడ్డు మీదుగా రైల్వేస్టేషన్కు చేరడానికి వీలుగా ఉంటుంది. ఒకటి, రెండు, మూడు, నాలుగురోడ్లవైపు ప్రజలు కోర్టు రోడ్డుకు వెళ్లడానికి సౌలభ్యంగా ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి హల్చల్..
[ 28-04-2024]
ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో శనివారం అర్ధరాత్రి వైకాపా నేతలు దౌర్జన్యం చేశారు. -
వైకాపాకు షాక్ మంత్రి వచ్చిన రోజునే రాజీనామా..
[ 28-04-2024]
అధికార వైకాపాకు షాక్ తగిలింది. హిందూపురంపై ప్రత్యేక దృష్టి సారించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం పట్టణానికి వచ్చి నాయకులు, కార్యకర్తలను దిశా నిర్దేశం చేశారు. -
రోడ్ల మంత్రి ప్రారంభించిన పనులకే దిక్కులేదు
[ 28-04-2024]
రాష్ట్ర రహదారులు-భవనాల శాఖ మంత్రిగా శంకర నారాయణ ప్రారంభించిన రోడ్డు నిర్మాణ పనులకే దిక్కులేకుండా పోయింది. -
వైకాపా నాయకుడి బరితెగింపు
[ 28-04-2024]
ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా.. అన్నట్లుంది అధికార వైకాపా నాయకుల తీరు. పార్టీ పెద్దలు పంచభూతాలను ఆదాయ వనరులుగా మార్చుకుంటే.. కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు తామేం తక్కువన్నట్లు బరితెగిస్తున్నారు. ప్రభుత్వ భూములే లక్ష్యంగా చేసుకుని ఆదాయ వనరులు పెంచుకుంటున్నారు. -
పంట అమ్మాలంటే కర్ణాటక వెళ్లాల్సిందే..
[ 28-04-2024]
ఉరవకొండ నియోజకవర్గంలో రైతులు పంట దిగుబడులను అమ్ముకోవడానికి పడుతున్నట్లు ఇబ్బందులు వర్ణనాతీతం. -
వైకాపాను సాగనంపుదాం
[ 28-04-2024]
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని తెదేపా అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు. రాయదుర్గం పట్టణంలోని 28వ వార్డులో, బొమ్మనహాళ్ మండలంలోని బొల్లనగుడ్డం, కల్హోళ, తారకాపురం, కల్లుదేవనహళ్లి గ్రామాల్లో శనివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
మెట్టుకు ఓటేస్తే చెత్తబుట్టలో వేసినట్టే : కాలవ
[ 28-04-2024]
మెట్టు గోవిందరెడ్డి తన పదవులను అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించటం తప్పా నియోజకవర్గానికి చేసిందేమీ లేదని, ఆయనకు ఓటేస్తే చెత్త బుట్టలో వేసినట్లేనని రాయదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు ఎద్దేవా చేశారు. -
‘రెండేళ్లలో బీటీపీకి కృష్ణాజలాలు తీసుకొస్తాం’
[ 28-04-2024]
అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోపు కాలువ పనులు పూర్తి చేసి బ్రహ్మసముద్రం మండలం, బీటీపీ జలాశయానికి గ్రావీటి ద్వారా కృష్ణా జలాలు తీసుకొస్తానని కళ్యాణదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు హామీ ఇచ్చారు. -
వైకాపాకు మరో అవకాశం ఇస్తే.. అరాచక పాలనే
[ 28-04-2024]
ఒక్క ఛాన్స్ పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన వైకాపాకు మరో ఛాన్స్ ఇస్తే రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. -
వైకాపా పతనానికి రోజులు దగ్గర పడ్డాయి : కేశవ్
[ 28-04-2024]
వైకాపా ప్రభుత్వ పతనానికి రోజులు దగ్గర పడ్డాయని ఉరవకొండ తెదేపా అభ్యర్థి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. -
జగనా.. రద్దు తగునా?
[ 28-04-2024]
ఉమ్మడి జిల్లాలో వ్యవసాయం తర్వాత పాడిపరిశ్రమకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. తెదేపా ప్రభుత్వ హయాంలో వివిధ జాతులకు సంబంధించి పాడి ఆవులు, గేదెలు కొనుగోలు చేయడంతో పాటు మాగుడు గడ్డి, దాణామృతం తదితర పోషకాలను రాయితీతో అందించి ప్రోత్సహించారు. -
వాలంటీర్ల వద్దే సెల్ఫోన్లు
[ 28-04-2024]
గ్రామ వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచడంతో పాటు వారి నుంచి సెల్ఫోన్లు, ఇతర ప్రభుత్వ సామగ్రిని స్వాధీనం చేసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించిన విషయం తెలిసిందే. -
అవినీతిలోనూ పెద్దాయనే..
[ 28-04-2024]
అవినీతికి..అరాచకానికి చొక్కా, పంచె తొడిగితే అచ్చం అయనలాగే ఉంటుంది. తాడిపత్రిలో వైకాపా ప్రజాప్రతినిధిగా చలామణి అవుతున్న ‘పెద్ద’మనిషి అక్రమాలను చెప్తే చాంతాడంతా.. రాస్తే రామాయణమంతా అవుతుంది. -
ఐదేళ్లలో ఇష్టారాజ్యంగా ప్రకృతి వనరుల దోపిడీ
[ 28-04-2024]
వైకాపా ఐదేళ్ల పాలనలో దోపిడీ, అవినీతి, అక్రమాలు జరిగాయని, ప్రకృతి వనరులను సైతం దోచుకున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. -
కాలం చెల్లి.. కదలనంటోన్న ప్రగతి రథచక్రం
[ 28-04-2024]
‘అనంతపురం ఆర్టీసీ బస్టాండులో ఈనెల 7న హిందూపురం డిపోకు చెందిన బస్సు 8వ ఫ్లాట్ఫాం మీదకు పరుగులు పెట్టింది. -
జగనా.. మజాకా
[ 28-04-2024]
తాడిపత్రికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వస్తున్నారని పోలీసులు విధించిన పలు ఆంక్షలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
-
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు: తమన్నా
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఎంపీ ప్రజ్వల్, రేవణ్ణలపై కేసు
-
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ డార్ నియామకం
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?