TTD: సర్వం సమస్యలే
సర్వదర్శనం టికెట్లకు రెండు రోజుల విరామం అనంతరం భక్తుల రాకను అంచనా వేయలేకపోవడం.. వేకువజామునే టోకెన్లు ఇవ్వకుండా ఆలస్యం చేయడం.. రద్దీకి అనుగుణంగా భద్రతా సిబ్బంది, పోలీసులను ఏర్పాటు చేయకపోవడం.. వెరసి భక్తుల మధ్య
భక్తుల రాకను అంచనా వేయలేకపోయిన తితిదే
నేరుగా కొండకు అనుమతించాలని అభిప్రాయం
ఈనాడు-తిరుపతి, న్యూస్టుడే, తిరుపతి(తితిదే, గాంధీరోడ్డు, వైద్యవిభాగం): సర్వదర్శనం టికెట్లకు రెండు రోజుల విరామం అనంతరం భక్తుల రాకను అంచనా వేయలేకపోవడం.. వేకువజామునే టోకెన్లు ఇవ్వకుండా ఆలస్యం చేయడం.. రద్దీకి అనుగుణంగా భద్రతా సిబ్బంది, పోలీసులను ఏర్పాటు చేయకపోవడం.. వెరసి భక్తుల మధ్య తిరుపతిలో తొక్కిసలాట చోటుచేసుకుంది. తిరునగరిలో మూడుచోట్ల సర్వదర్శనం టికెట్లు ఇవ్వగా గోవిందరాజస్వామి సత్రాలు, అలిపిరి భూదేవి కాంప్లెక్స్లోనే తొక్కిసలాట జరగడం గమనార్హం. శ్రీనివాసంలో క్యూలైన్ల నిర్వహణ బాగుండటంతోనే ఎలాంటి సమస్యలు తలెత్తలేదు. తితిదే అధికారులు టోకెన్లు లేకుండా తిరుమలకు అనుమతిస్తున్నట్లు ప్రకటించడంతో పెద్ద ముప్పు తప్పింది.
టైమ్స్లాట్ టోకెన్ల విధానం కొవిడ్ సమయంలో బాగున్నా.. పెరుగుతున్న రద్దీ దృష్ట్యా అమలు చేయడం కష్టసాధ్యమని పలువురు అభిప్రాయపడుతున్నారు. గతంలో సాధారణ భక్తులను నేరుగా తిరుమలకు అనుమతించి.. కంపార్ట్మెంట్లలోకి వచ్చిన తర్వాత రద్దీ మేరకు దర్శనం కల్పించేవారు. అప్పట్లో రోజుకు 75వేల మంది వరకు దర్శనం చేసుకునేవారని, ప్రస్తుతం 65వేల మంది కూడా ఉండట్లేదని అంటున్నారు. ముందున్న విధానంలోనే భక్తులను కొండకు అనుమతించి దర్శనం కల్పిస్తే బాగుంటుందని భాజపా అధికార ప్రతినిధి భానుప్రకాష్రెడ్డి సహా పలువురు నేతలు సూచిస్తున్నారు.
* శ్రీవారి దర్శన టిక్కెట్లు పొందే క్యూలో నెలకొన్న తొక్కిసలాటలో అస్వస్థతకు గురైన తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా అవిసిరి మండలం సింగారం గ్రామానికి చెందిన వెంకయ్య(65) తిరుపతి రుయా అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నారు.
క్యూలైన్లు పర్యవేక్షించిన పోలీసులు
టోకెన్ల కౌంటర్ల క్యూలైన్లో కొంత మేరకు తొక్కిసలాటను పోలీసులు నియంత్రించారు. టోకెన్ల మంజూరు ప్రారంభించిన కొద్దిసేపటికే తొక్కిసలాట జరగడంతో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అప్పటికే పదుల సంఖ్యలో భక్తులు కిందపడి అస్వస్థతకు గురయ్యారు. చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి, తిరుపతి అదనపు ఎస్పీలు సుప్రజ, ఆరిఫుల్లా పర్యవేక్షించారు. తిరుపతి తూర్పు సీఐ బీవీ శివప్రసాద్రెడ్డి, అలిపిరి సీఐ అబ్బన్న తమ సిబ్బందితో కౌంటర్ల వద్ద పర్యవేక్షించారు.
తెదేపా నాయకుల పరామర్శ
భక్తుల రద్దీని అంచనా వేయడంలో తితిదే విఫలమైందని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆరోపించారు. తిరుపతిలో సర్వదర్శన టోకెన్లు జారీ చేసే క్రమంలో జరిగిన తొక్కిసలాట, తోపులాట ప్రాంతాలను తెదేపా నాయకులు సందర్శించారు. అక్కడున్న భక్తులతో మాట్లాడారు. నాయకులు నరసింహయాదవ్, కార్పొరేటర్ ఆర్సీˆ మునికృష్ణ, దంపూరి భాస్కర్ యాదవ్, రవినాయుడు, సురేంద్రనాయుడు తదితరులు ఉన్నారు.
పాదయాత్రగా వచ్చి నిలిచిపోయా
గోపాల్, తిరువణ్ణామలై, తమిళనాడు
తిరువణ్ణామలై నుంచి 20 మంది బృందంతో కలిసి వచ్చా. అందరూ లైన్లోకి వెళ్లారు. తోపులాటలో ఊపిరి ఆడక బయటకొచ్చేశా. వందల కిలో మీటర్లు నడచి వచ్చినా ఇబ్బంది కలగలేదు. స్వామివారి దర్శనం కల్పించడంలో తితిదే పూర్తిగా విఫలమైంది. డబ్బులు పెట్టేవారికి మంచి దర్శనాలు కల్పిస్తోంది. మాలాంటి వారికి దర్శనం ఇవ్వరు.
రెండు రోజులుగా అన్నం, నీళ్లు లేవు
రాధమ్మ, కేజీఎఫ్, కర్ణాటక
మా గ్రామస్థులతో కలిసి వచ్చా. శనివారం రాత్రి తిరుపతికి వస్తే టికెట్లు ఇవ్వమని చెప్పడంతో ఇక్కడే చెట్ల కింద ఉన్నాం. ఇంత దూరం వచ్చిన తర్వాత స్వామి దర్శనం చేసుకోవాలని ఇక్కడే ఉంటున్నాం. రెండు రోజులుగా తాగడానికి నీళ్లు, తినడానికి అన్నం లేదు. తితిదే ఇంతమంది భక్తులకు సౌకర్యాలు కల్పించకపోతే ఎలా?
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రి పెద్దిరెడ్డి అనుచరుల ఘాతుకం.. బీసీవైపీ అధ్యక్షుడిపై దాడికి యత్నం
[ 29-04-2024]
చిత్తూరు జిల్లా సదుం పోలీస్స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీసీవైపీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్పై వైకాపా నేతలు దాడికి యత్నించారు. -
చిత్తూరు వైకాపా అభ్యర్థి కార్యాలయంలో నగదు స్వాధీనం
[ 29-04-2024]
చిత్తూరు నగరంలోని కొంగారెడ్డి పల్లిలో చిత్తూరు అసెంబ్లీ వైకాపా అభ్యర్ధి విజయానంద రెడ్డి కార్యాలయంలో జిల్లా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సోదాలు చేపట్టింది. -
పులివర్తి నానికి భద్రత కల్పించండి.. హైకోర్టు ఆదేశం
[ 29-04-2024]
చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానికి 1+1 సెక్యూరిటీ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
సిబ్బంది ఉన్నా ఇంటింటికీ పింఛను ఎందుకివ్వరు?: చంద్రబాబు
[ 29-04-2024]
వైకాపా కుట్రలు, కుతంత్రాల్లో అధికారులు కూడా భాగస్వామ్యం కావడం దురదృష్టకరమని తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. -
ఏపీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని ప్రార్థించా: సినీనటి జయప్రద
[ 29-04-2024]
ఏపీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని శ్రీవారిని ప్రార్థించానని సినీనటి, భాజపా నాయకురాలు జయప్రద అన్నారు. ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారి మూలమూర్తిని ఆమె దర్శించుకున్నారు. -
అంతా సొంత డబ్బా.. హామీలపై మాట్లాడరేమబ్బా!
[ 29-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వెంకటగిరిలో నిర్వహించిన సభ ఆత్మస్తుతి, పరనిందలా సాగింది. తన హయాంలో పథకాలు తెచ్చి సామాన్యుల జీవితాలను మార్చానంటూ గొప్పలు చెప్పుకొన్న సీఎం.. చంద్రబాబు హయాంలో ఒక్క పథకం పేరు గుర్తుకురాదని చెప్పడం ప్రజలను తీవ్ర విస్మయానికి గురిచేసింది. -
మాటలే తీపి.. లబ్ధిదారులకు టోపీ
[ 29-04-2024]
పేదలకు చేదు మిగిల్చిన ఘనత జగనన్న పాలనకే దక్కుతుంది.. బియ్యం కార్డుదారులకు ఇంటికే అన్ని రకాల నిత్యావసరాలు అందజేస్తున్నామంటూ ఆర్భాటపు ప్రకటనలు తప్ప క్షేత్రస్థాయిలో భిన్న పరిస్థితులు ఉన్నాయి. -
దాడులు, అరాచకమే ఎజెండా
[ 29-04-2024]
అరాచకమే ఎజెండాగా ఎన్నికల్లో నెగ్గాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుయుక్తులు పన్నుతున్నారు. ఈ క్రమంలో పుంగనూరు నియోజకవర్గంలో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయా అంటే తాజా పరిస్థితులను పరిశీలిస్తే సందేహమనే సమాధానం వస్తోంది. -
మాటల జ‘గన్’.. చేతల చూ‘ఫన్’
[ 29-04-2024]
కుప్పం పట్టణం, న్యూస్టుడే: ‘వైనాట్ కుప్పం అంటూ.. 2022 సెప్టెంబరు 23న ప్రతిపక్ష నాయకుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో పర్యటించిన సీఎం జగన్ తన సొంత నియోజకవర్గం పులివెందుల్లా కుప్పాన్ని చూస్తానని హామీ ఇచ్చారు. -
అయ్యోర్లపై అధికార బెత్తం
[ 29-04-2024]
చిత్తూరు గ్రామీణ మండలం మాపాక్షి జడ్పీ ఉన్నత పాఠశాలను ఇటీవల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాష్ తనిఖీ చేశారు. ఆ సమయంలో ఏడో తరగతిలో విద్యార్థులతో ఆయన మాట్లాడారు. -
ఇదేం పని మురుగేషా!
[ 29-04-2024]
బోధనారంగంలో ఉత్తమ ప్రతిభకనబరిచిన ఆ ఉపాధ్యాయుడికి 2007-08 విద్యాసంవత్సరంలో జిల్లాస్థాయి అవార్డు దక్కింది. దీనిపై స్పందించిన మండల ప్రజాప్రతినిధులు.. కుటుంబ సభ్యుల పేరుతో మూడు ఇంటి పట్టాలు అందించారు. -
అయ్యా.. ఐదేళ్లూ చాలలేదా..?
[ 29-04-2024]
ఒక ప్రాంత అభివృద్ధికి రహదారులు, అద్భుతమైన కట్టడాలే కొలమానం. అలాంటిది చిత్తూరు నగరంలో రహదారులు అధ్వానంగా మారాయి. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు నానా కష్టాలు పడుతున్నారు. -
‘అరాచక పాలనకు అంతం పలకండి’
[ 29-04-2024]
వైకాపా అరాచక పాలనకు అంతం పలికేందుకు ఎన్నికల రూపంలో అవకాశమొచ్చిందని, ప్రజలు మే 13న జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి తెదేపా కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు దగ్గుమళ్ల ప్రసాదరావు, గురజాల జగన్మోహన్ కోరారు. -
ఏం జరుగుతోంది భగవం‘తుడా’!
[ 29-04-2024]
తుడా.. ఈ పేరెత్తితే చాలు జిల్లా ప్రజల మెదళ్లు గిర్రున తిరుగుతాయి.. వందల అనుమానాలు తలెత్తుతాయి. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా)ను ఒకే ఒక వ్యక్తి తన అమ్ములపొదిగా.. రహస్య స్థావరంగా మార్చేశారంటే అతిశయోక్తి కాదు.. ఆయనే చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి. -
దోపిడీలు చేయడంలో డిగ్రీలు
[ 29-04-2024]
ఇతరులను బెదిరించి డబ్బులు వసూలు చేయడంలో స్థానిక ఎమ్మెల్యే డిగ్రీలు చేశారని సినీనటుడు నందమూరి బాలకృష్ణ ఆరోపించారు. నియోజకవర్గంలో ఇసుక, గ్రావెల్ మాఫియా రాజ్యమేలుతున్నారని ఆయన అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం
-
సొంతగడ్డపై చెలరేగిన కోల్కతా.. దిల్లీపై ఘన విజయం
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!