logo

కట్టడాల విలువల సవరణకు ఆమోదం

గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో ఇంటి కట్టడాల విలువల సవరణకు జిల్లా ప్రజా పరిషత్‌ ఆమోదం లభించింది. జడ్పీ కార్యాలయంలో గురువారం సబ్‌ రిజిస్ట్రార్లతో జడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి సమావేశమయ్యారు. పట్టణ, మేజర్‌ పంచాయతీ, పంచాయతీల్లో సవరించిన

Published : 27 May 2022 05:43 IST


నిర్మాణాల విలువలపై జడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డికి వివరిస్తున్న సబ్‌ రిజిస్ట్రార్లు

చిత్తూరు(జిల్లా పరిషత్‌): గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో ఇంటి కట్టడాల విలువల సవరణకు జిల్లా ప్రజా పరిషత్‌ ఆమోదం లభించింది. జడ్పీ కార్యాలయంలో గురువారం సబ్‌ రిజిస్ట్రార్లతో జడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి సమావేశమయ్యారు. పట్టణ, మేజర్‌ పంచాయతీ, పంచాయతీల్లో సవరించిన కట్టడాల విలువల్ని సబ్‌ రిజిస్ట్రార్లు జడ్పీ సీఈవోకి తెలియజేశారు. పట్టణాభివృద్ధి సంస్థల ఆమోదం తర్వాత నివేదికను రాష్ట్ర ఉన్నతాధికారులకు సమర్పిస్తామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్‌ ఒకటి నుంచి సవరించిన విలువల మేరకు రిజిస్ట్రేషన్లు జరుగుతాయని సబ్‌ రిజిస్ట్రార్లు పేర్కొన్నారు. సబ్‌ రిజిస్ట్రార్లు హబీబుల్లా, వెంకటసుబ్బయ్య, శ్రీధర్‌గుప్తా, సుబ్రహ్మణ్యం, హరికుమార్, సత్యనారాయణ, లక్ష్మీనారాయణ, విజయకుమార్, శివకుమారి, పద్మశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని