బెదిరిస్తాం.. కొనిస్తాం
మహిళా పక్షపాతినని ప్రకటించుకునే సీఎం జగన్.. మహిళా సాధికారత నిర్వచనాన్నే మార్చేస్తున్నారు. పొదుపు మహిళల కోసమని మార్టులు తెచ్చిన ఆయన అందులో వారితోనే పెట్టుబడి పెట్టించి విక్రయిస్తున్నారు.
ఇదీ జగన్ ‘మార్ట్’ పాలన
మహిళా పక్షపాతినని ప్రకటించుకునే సీఎం జగన్.. మహిళా సాధికారత నిర్వచనాన్నే మార్చేస్తున్నారు. పొదుపు మహిళల కోసమని మార్టులు తెచ్చిన ఆయన అందులో వారితోనే పెట్టుబడి పెట్టించి విక్రయిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. విక్రయాలు జరగకపోవడంతో వారితోనే సరకులు కొనుగోలు చేయిస్తున్నారు. మాట వినకుంటే పథకాలు, రుణాలు రావని బెదిరిస్తున్నారు. వీటన్నింటినీ చూసి పొదుపు మహిళలు ఇదేనా జగన్ ‘మార్ట్’ పాలన? అని నివ్వెరపోతున్నారు.
ఈనాడు, చిత్తూరు: పట్టణాల్లోని పేద మహిళల ఆర్థిక స్వయం సమృద్ధి సాధన కోసమంటూ వైకాపా ప్రభుత్వం జగనన్న మహిళా మార్టులను ప్రారంభించింది. పట్టణ సమాఖ్యల సభ్యుల పొదుపు మొత్తాలే పెట్టుబడిగా వీటిని మొదలుపెట్టారు. తొలుత వైఎస్సార్ జిల్లా పులివెందులలో 2021 జనవరిలో మార్టును అందుబాటులోకి తీసుకువచ్చారు. అనంతరం 2022 మార్చిలో పుంగనూరు పట్టణంలో ఏర్పాటు చేశారు. పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి మహిళ నుంచి సభ్యత్వ రుసుంగా రూ.150 వసూలు చేశారు. ఇలా బలవంతంగా డబ్బులు తీసుకోవడంపై ప్రారంభంలో తీవ్ర విమర్శలు వచ్చాయి. మార్ట్లపై అంత శ్రద్ధ ఉంటే ప్రభుత్వమే రుసుం చెల్లించవచ్చు కదా? అని మహిళలు మండిపడ్డారు. వీటన్నింటినీ లెక్క చేయకుండా జగన్ ప్రభుత్వం ముందుకు వెళ్లింది. జిల్లాలో తొలుత పట్టణ ప్రాంతాల్లో అనంతరం మండల కేంద్రాల్లోనూ నెలకొల్పారు.
తీవ్రంగా ఒత్తిడి తెస్తూ..
ప్రస్తుతం పుంగనూరు, చిత్తూరు, పుత్తూరు, తవణంపల్లె, పెనుమూరులో జగనన్న మహిళా మార్టులున్నాయి. ప్రధానంగా జిల్లా కేంద్రం చిత్తూరులో పొదుపు మహిళలపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తెస్తున్నారు. 110 సమాఖ్యల్లో కలిపి 32 వేల మంది వరకు ఉండగా ప్రతి ఒక్కరూ రూ.వెయ్యి- రూ.2 వేల వరకు సరకులు కొనాల్సిందేనని హుకుం జారీ చేశారు. ప్రారంభంలో ఇది స్వచ్ఛందమేనని చెప్పి ప్రస్తుతం నిర్బంధం చేస్తున్నారని వాపోతున్నారు. ఆర్పీలు, సీవోలు ఉదయాన్నే పదేపదే ఫోన్లు చేసి వస్తువులు కొనుగోలు చేయాలని హెచ్చరిస్తున్నారు. కొనకపోతే బ్యాంకు రుణాలు రావని బెదిరిస్తున్నారు. దీంతో మహిళలు ఇళ్ల దగ్గర ఉన్న దుకాణాలు వదిలేసి ఛార్జీలు పెట్టుకుని ఇక్కడకు వస్తున్నారు. పుంగనూరు పట్టణంలోనూ ఇదే తరహా దుస్థితి నెలకొంది. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కొందరు కౌన్సిలర్లు ఈ విషయాన్ని ప్రస్తావించారంటేనే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పుత్తూరులో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చే కొన్ని రోజుల ముందు మంత్రి రోజా ప్రారంభించారు. ఇక్కడ కూడా ఇప్పుడు పొదుపు మహిళలకు లక్ష్యం పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారు.
నాణ్యత అంతంతమాత్రం..
మార్టులో వస్తువుల నాణ్యత అంతంతమాత్రంగానే ఉందని మహిళలు చెబుతున్నారు. ఇతర ప్రైవేటు సూపర్మార్కెట్లలో ఇంతకన్నా తక్కువ రేటుకు సరకులు లభిస్తున్నాయని.. అటువంటప్పుడు మహిళా మార్టులోనే ఎందుకు కొనుగోలు చేయాలని పొదుపు సంఘాల్లోని సభ్యులు లోలోపల వాపోతున్నారు. తవణంపల్లె, పెనుమూరులో నెలకు రూ.2 లక్షల వ్యాపారం చేయాలని జిల్లా సమాఖ్య నిర్దేశించింది. ఆ డబ్బులు కూడా మూడు- నాలుగు రోజుల్లోనే చెల్లించాలని ఆదేశించారు. దీంతో ఏం చేయాలో మహిళలకు దిక్కుతోచడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పింఛను పంచన.. నయా వంచన
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికల ముంగిట ముఖ్యమంత్రి జగన్, ఆయన ప్రభుత్వంలోని అధికారులు పండుటాకులను ఇబ్బంది పెట్టేందుకు మరో వికృత క్రీడకు తెరలేపారు. -
జన, ధన, మాన చోరుడు జగన్..
[ 30-04-2024]
‘ఒక్క అవకాశం అంటూ గద్దెనెక్కిన జగన్మోహన్రెడ్డి.. రాష్ట్ర ప్రగతిని గోతిలో పాతిపెట్టాడు. రూ.లక్షల కోట్లు హాంఫట్ చేసి రాష్ట్ర ప్రజల నెత్తిన అప్పుల భారం మోపాడు. -
వారాంతపు సెలవులు హుష్ఖాకీ
[ 30-04-2024]
జిల్లాలో ఆధ్యాత్మిక కేంద్రాలు ఉండటంతో వీఐపీల తాకిడి అధికంగా ఉంటుంది.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, పలు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులతో పాటు వివిధ రాష్ట్రాల సీఎంలు, మంత్రులు తరచూ తిరుమల, కాణిపాకం, శ్రీకాళహస్తి, అరగొండ ఆలయాలను సందర్శిస్తుంటారు.. -
సదుంలో రణరంగం
[ 30-04-2024]
బీసీవైసీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్.. మంత్రి పెద్దిరెడ్డి స్వగ్రామం యర్రాతివారిపల్లెలో చేపట్టిన ప్రచారం ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీశాయి. -
రూ. 5 కోట్ల పనులు.. ఐదేళ్లూ విస్మరించారు
[ 30-04-2024]
త్రిరాష్ట్ర కూడలిలో శుభకార్యాలు, సమావేశాలు, సదస్సులు నిర్వహణకు సరైన వేదిక లేక ఇబ్బందులుండేవి. -
పోరు.. ఖరారు
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టం పూర్తయింది. బరిలో నిలిచింది ఎందరో తేలిపోయింది. మరోవైపు తుది, అనుబంధ ఓటర్ల జాబితాలు ఖరారయ్యాయి. -
వనితే నిర్ణేత..!
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల విజయాన్ని మహిళలు నిర్ణయించనున్నారు. జిల్లా పరిధిలో 25వ తేదీ నాటికి మొత్తం 18,12,980 ఓటర్లు ఉన్నారు. -
ఓటుకొస్తే అమ్మ.. జీతాలకొస్తే ఆ..యమ్మ
[ 30-04-2024]
కాలే కడుపులు.. అర్ధాకలితో ఉన్నా తమకు అప్పజెప్పిన పనులు పూర్తిచేయడంలో ఆయాలు ముందుంటారనడంలో సందేహం లేదు. -
తిరుమల పవిత్రతను మంటగలిపారు
[ 30-04-2024]
శ్రీవారి దర్శనం టికెట్ల ధరను విపరీతంగా పెంచేసి తిరుమలకు వచ్చే భక్తులను గత ఐదేళ్లలో దోచుకున్నారని ఎన్డీయే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఆరోపించారు. -
వైకాపా ప్రచారానికి అనుమతులేవీ?
[ 30-04-2024]
వడ్డించేవాడు మనవాడైతే.. చాలన్న చందాన తిరుపతిలో వైకాపా, పోలీసుల తీరు కొనసాగుతోంది. -
ఆలయంలో అధికార పార్టీ ప్రచారం
[ 30-04-2024]
పట్టణంలోని బజారువీధి రామమందిరంలో సోమవారం రాత్రి అధికార పార్టీ అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి ప్రచారం చేపట్టారు. -
బ్యాంకు ఖాతాల్లేకుంటే ఇంటి వద్దే పింఛన్ పంపిణీ: కలెక్టర్
[ 30-04-2024]
సామాజిక భద్రత పింఛన్ల పంపిణీని మే ఒకటిన రెండు పద్ధతుల్లో చేపట్టనున్నామని కలెక్టర్ షన్మోహన్ తెలిపారు. -
బ్యాండేజ్ వేసుకుని వినూత్నంగా ఎన్నికల ప్రచారం
[ 30-04-2024]
ఎన్నికల్లో సానుభూతి పొందాలని సీఎం జగన్ ఆడిన గులకరాయి డ్రామాను ప్రజలు నమ్మేస్థితిలో లేరని తెదేపా, జనసేన నాయకులు ఎద్దేవా చేశారు. -
కోర్టులో కేసున్నా.. రోడ్డు నిర్మాణం
[ 30-04-2024]
మండలంలోని ముడిపల్లి పంచాయితీలోని వెంగన్న కండ్రిగ ఎస్టీకాలనీ వద్ద వైకాపా నాయకులు దౌర్జన్యంగా రోడ్డు వేస్తున్నారని గ్రామస్థులు సోమవారం ఆరోపించారు. -
ఇద్దరు వాలంటీర్లపై వేటుకు సిఫార్సు
[ 30-04-2024]
ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రచారంలో పాల్గొన్న ఇద్దరు వాలంటీర్లపై చర్యలకు ఉన్నతాధికారులకు సిఫార్సు చేశామని ఎంపీడీవో వరప్రసాద్ తెలిపారు. -
చీటీల మోసం కేసులో నిందితుడికి తొమ్మిదేళ్ల జైలు
[ 30-04-2024]
చీటీల పేరుతో మోసానికి పాల్పడిన కేసులో నిందితుడికి తొమ్మిదేళ్ల జైలు శిక్ష విధిస్తూ సోమవారం స్థానిక జిల్లా ప్రధాన సెషన్స్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి భీమారావు సోమవారం తీర్పు చెప్పారు. -
కమ్యూనిటీ హాలులో వైకాపా నాయకుల సమావేశం?
[ 30-04-2024]
తిరుమలలో కూటమి అభ్యర్థి ఎన్నికల ప్రచారం నేపథ్యంలో అదే సమయంలో వైకాపా తిరుమల విభాగం అధ్యక్షుడు చిన్నముని ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి స్థానిక కమ్యూనిటీ భవనంలో సమావేశమయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!