సమర్థ ప్రభుత్వాన్ని ఎన్నుకోండి
వైకాపా అరాచక పాలనతో విసిగి వేశారిన ప్రజలకు ఎన్నికల రూపంలో ఇప్పుడు సరైన అవకాశం వచ్చిందని, అందరి సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చే సమర్థ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని తెదేపా అభ్యర్థి గురజాల జగన్మోహన్ అన్నారు.
చిత్తూరు(జిల్లా పంచాయతీ), న్యూస్టుడే: వైకాపా అరాచక పాలనతో విసిగి వేశారిన ప్రజలకు ఎన్నికల రూపంలో ఇప్పుడు సరైన అవకాశం వచ్చిందని, అందరి సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చే సమర్థ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని తెదేపా అభ్యర్థి గురజాల జగన్మోహన్ అన్నారు. లక్ష్మీనగర్ కాలనీలోని ఓంశక్తి ఆలయంలో పూజలు చేసి 11, 14, 15 వ డివిజన్ల పరిధిలోని జోగలకాలనీ, చెన్నమ్మగుడిపల్ల్లి, ఎన్.ఎన్.కండ్రిగ, ద్వారకాపురం, గోవిందపురం, బండపల్లి, ఎల్.బి.పురం, చెరువుముందరకండ్రిగ, గాజులపల్లి, కురపల్లి, తిమ్మసానిపల్లి, వై.ఎస్.కాలనీలో మంగళవారం ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు, నాయకులతో కలిసిప్రచారం చేశారు. చెన్నమ్మగుడిపల్లి, చెరువుముందరవూరులో వైకాపాను వీడి 30 కుటుంబాలు తెదేపాలో చేరారు. తిమ్మసానిపల్లిలో పలువురు పార్టీలో చేరారు. మాజీ ఎంపీ దుర్గా రామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు, మాజీ మేయర్ కఠారి హేమలత, తెదేపా చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కోదండయాదవ్, కార్పొరేటర్ జయలక్ష్మి, భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు, తెదేపా నాయకులు శేషాద్రినాయుడు, నాగరాజునాయుడు, మధునాయుడు, మాజీ కార్పొరేటర్ భార్గవి, వెంకటేష్యాదవ్, రాము, కోడిబాబు, శివ పాల్గొన్నారు.
గుడిపాల: తెదేపా కూటమి అభ్యర్థి జగన్మోహన్ సతీమణి ప్రతిమ కుప్పిగానిపల్లె, 13.గొల్లపల్లె పంచాయతీలో ప్రచారం చేపట్టారు. గొల్లపల్లెలో వరి తూర్పార పడుతూ, కృష్ణజిమ్మాపురంలో వేరుసెనెగ కాయలు వలుస్తూ ప్రజలను ఆకట్టుకున్నారు. మాజీ జడ్పీటీసీ సుమతి, మాజీ ఎంపీపీ దీపశ్రీ పాల్గొన్నారు. నగరి: వైకాపా అరాచక పాలనతో అభివృద్ధిలో వెనకబడిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే చంద్రబాబు తపన పడుతున్నారని తెదేపా అభ్యర్థి గాలి భానుప్రకాష్ పేర్కొన్నారు. ఏకాంబరకుప్పంలో ప్రచారం నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఐరాల: రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం చేస్తున్న దాష్టీకానికి చరమగీతం పాడే సమయం దగ్గర పడిందని కూటమి అభ్యర్థి మురళీమోహన్ తెలిపారు. గోవిందరెడ్డిపల్లె, నయనంపల్లె, ఐకే రెడ్డిపల్లె, గొల్లపల్లెలో ప్రచారం నిర్వహించి మాట్లాడారు. వైకాపాకు కంచుకోటైన గోవిందరెడ్డిపల్లెలో సుమారు 60 కుటుంబాలు తెదేపాలో చేరడం ఇందుకు నిదర్శనమన్నారు. ఆయా పార్టీల నాయకులు గిరిధర్బాబు, దేవాజీ, తులసీప్రసాద్, లత, మురళీ, పెరుమాళ్ సుబ్బారెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, వేణుగోపాల్, రాజేశ్రెడ్డి, రంజిత్రెడ్డి, లోకనాథరెడ్డి, రవి, వాసు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పింఛను పంచన.. నయా వంచన
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికల ముంగిట ముఖ్యమంత్రి జగన్, ఆయన ప్రభుత్వంలోని అధికారులు పండుటాకులను ఇబ్బంది పెట్టేందుకు మరో వికృత క్రీడకు తెరలేపారు. -
జన, ధన, మాన చోరుడు జగన్..
[ 30-04-2024]
‘ఒక్క అవకాశం అంటూ గద్దెనెక్కిన జగన్మోహన్రెడ్డి.. రాష్ట్ర ప్రగతిని గోతిలో పాతిపెట్టాడు. రూ.లక్షల కోట్లు హాంఫట్ చేసి రాష్ట్ర ప్రజల నెత్తిన అప్పుల భారం మోపాడు. -
వారాంతపు సెలవులు హుష్ఖాకీ
[ 30-04-2024]
జిల్లాలో ఆధ్యాత్మిక కేంద్రాలు ఉండటంతో వీఐపీల తాకిడి అధికంగా ఉంటుంది.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, పలు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులతో పాటు వివిధ రాష్ట్రాల సీఎంలు, మంత్రులు తరచూ తిరుమల, కాణిపాకం, శ్రీకాళహస్తి, అరగొండ ఆలయాలను సందర్శిస్తుంటారు.. -
సదుంలో రణరంగం
[ 30-04-2024]
బీసీవైసీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్.. మంత్రి పెద్దిరెడ్డి స్వగ్రామం యర్రాతివారిపల్లెలో చేపట్టిన ప్రచారం ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీశాయి. -
రూ. 5 కోట్ల పనులు.. ఐదేళ్లూ విస్మరించారు
[ 30-04-2024]
త్రిరాష్ట్ర కూడలిలో శుభకార్యాలు, సమావేశాలు, సదస్సులు నిర్వహణకు సరైన వేదిక లేక ఇబ్బందులుండేవి. -
పోరు.. ఖరారు
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టం పూర్తయింది. బరిలో నిలిచింది ఎందరో తేలిపోయింది. మరోవైపు తుది, అనుబంధ ఓటర్ల జాబితాలు ఖరారయ్యాయి. -
వనితే నిర్ణేత..!
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల విజయాన్ని మహిళలు నిర్ణయించనున్నారు. జిల్లా పరిధిలో 25వ తేదీ నాటికి మొత్తం 18,12,980 ఓటర్లు ఉన్నారు. -
ఓటుకొస్తే అమ్మ.. జీతాలకొస్తే ఆ..యమ్మ
[ 30-04-2024]
కాలే కడుపులు.. అర్ధాకలితో ఉన్నా తమకు అప్పజెప్పిన పనులు పూర్తిచేయడంలో ఆయాలు ముందుంటారనడంలో సందేహం లేదు. -
తిరుమల పవిత్రతను మంటగలిపారు
[ 30-04-2024]
శ్రీవారి దర్శనం టికెట్ల ధరను విపరీతంగా పెంచేసి తిరుమలకు వచ్చే భక్తులను గత ఐదేళ్లలో దోచుకున్నారని ఎన్డీయే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఆరోపించారు. -
వైకాపా ప్రచారానికి అనుమతులేవీ?
[ 30-04-2024]
వడ్డించేవాడు మనవాడైతే.. చాలన్న చందాన తిరుపతిలో వైకాపా, పోలీసుల తీరు కొనసాగుతోంది. -
ఆలయంలో అధికార పార్టీ ప్రచారం
[ 30-04-2024]
పట్టణంలోని బజారువీధి రామమందిరంలో సోమవారం రాత్రి అధికార పార్టీ అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి ప్రచారం చేపట్టారు. -
బ్యాంకు ఖాతాల్లేకుంటే ఇంటి వద్దే పింఛన్ పంపిణీ: కలెక్టర్
[ 30-04-2024]
సామాజిక భద్రత పింఛన్ల పంపిణీని మే ఒకటిన రెండు పద్ధతుల్లో చేపట్టనున్నామని కలెక్టర్ షన్మోహన్ తెలిపారు. -
బ్యాండేజ్ వేసుకుని వినూత్నంగా ఎన్నికల ప్రచారం
[ 30-04-2024]
ఎన్నికల్లో సానుభూతి పొందాలని సీఎం జగన్ ఆడిన గులకరాయి డ్రామాను ప్రజలు నమ్మేస్థితిలో లేరని తెదేపా, జనసేన నాయకులు ఎద్దేవా చేశారు. -
కోర్టులో కేసున్నా.. రోడ్డు నిర్మాణం
[ 30-04-2024]
మండలంలోని ముడిపల్లి పంచాయితీలోని వెంగన్న కండ్రిగ ఎస్టీకాలనీ వద్ద వైకాపా నాయకులు దౌర్జన్యంగా రోడ్డు వేస్తున్నారని గ్రామస్థులు సోమవారం ఆరోపించారు. -
ఇద్దరు వాలంటీర్లపై వేటుకు సిఫార్సు
[ 30-04-2024]
ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రచారంలో పాల్గొన్న ఇద్దరు వాలంటీర్లపై చర్యలకు ఉన్నతాధికారులకు సిఫార్సు చేశామని ఎంపీడీవో వరప్రసాద్ తెలిపారు. -
చీటీల మోసం కేసులో నిందితుడికి తొమ్మిదేళ్ల జైలు
[ 30-04-2024]
చీటీల పేరుతో మోసానికి పాల్పడిన కేసులో నిందితుడికి తొమ్మిదేళ్ల జైలు శిక్ష విధిస్తూ సోమవారం స్థానిక జిల్లా ప్రధాన సెషన్స్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి భీమారావు సోమవారం తీర్పు చెప్పారు. -
కమ్యూనిటీ హాలులో వైకాపా నాయకుల సమావేశం?
[ 30-04-2024]
తిరుమలలో కూటమి అభ్యర్థి ఎన్నికల ప్రచారం నేపథ్యంలో అదే సమయంలో వైకాపా తిరుమల విభాగం అధ్యక్షుడు చిన్నముని ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి స్థానిక కమ్యూనిటీ భవనంలో సమావేశమయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
లఖ్నవూ సూపర్ జెయింట్స్కు గుడ్న్యూస్.. ముంబయికి చావోరేవో
-
ఛత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. నలుగురు మావోయిస్టులు హతం
-
‘అసహనంతోనే ఫేక్ వీడియోలు’ : కాంగ్రెస్పై మండిపడ్డ అమిత్ షా
-
సెక్షన్ 54F.. బంగారం విక్రయించి ఇల్లు కొనుగోలు చేస్తే పన్నుండదు!
-
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా
-
5 రోజుల్లో రూ.3 లక్షల కోట్లు ఎగసిన మస్క్ సంపద