అంతంతమాత్రమే ‘కరుణ’?
తితిదే పరిధిలోని బర్డ్ అసుపత్రిలో పనిచేస్తున్న స్పీచ్ థెరపిస్టు రూ.22,907 జీతం పొందేవారు. తాజా పెంపుతో రూ.25 వేలకు చేరింది. వేదపారాయణదారు పోస్టుకు నెలకు రూ.21,500 చెల్లిస్తుండగా..
తితిదేలో వేతనాల పెంపులో అసమతుల్యత
ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగుల అసంతృప్తి
తిరుపతి (నగరపాలిక), న్యూస్టుడే: తితిదే పరిధిలోని బర్డ్ అసుపత్రిలో పనిచేస్తున్న స్పీచ్ థెరపిస్టు రూ.22,907 జీతం పొందేవారు. తాజా పెంపుతో రూ.25 వేలకు చేరింది. వేదపారాయణదారు పోస్టుకు నెలకు రూ.21,500 చెల్లిస్తుండగా.. దాన్ని రూ.54 వేలకు చేర్చారు. జూనియర్ ఆడిటర్/ జూనియర్ అకౌంటెంట్లకు రూ.25 వేల నుంచి రూ.40 వేలకు పెంచారు. తితిదే తాజాగా పెంచిన జీతాల్లో కొన్ని విభాగాల్లో అపరిమిత లబ్ధి చేకూరగా.. మరికొన్ని విభాగాల్లో అత్యల్పంగా పెరిగింది.. ఇది కనిష్ఠంగా రూ.2 వేలు.. గరిష్ఠంగా రూ.30 వేల వరకు ఉందని ఉద్యోగులు చెబుతున్నారు.
- తితిదేలో 6,800 మంది వరకు శాశ్వత ఉద్యోగులున్నారు. వీరితోపాటు ఒప్పంద/పొరుగుసేవల సిబ్బందిలో కార్పొరేషన్లు, సొసైటీలు, ఏజెన్సీల పరిధిలో, దినసరి వేతనంతో పనిచేస్తున్నవారు ఉన్నారు. వీరి జీతాలు ఎంతకూ పెరగడం లేదు. సిబ్బంది హోదాలు, జీతాల్లో సారూప్యత తీసుకువచ్చి జీతాలు పెంచాలని.. 2024 ఫిబ్రవరి 27న తితిదే పాలక మండలికి 568వ అజెండా అంశంగా చర్చకు ప్రవేశపెట్టగా సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు.
- తితిదేలో పనిచేసే ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగుల జీతాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 2022 జనవరి 17న విడుదల చేసి జీవో నం.7న అనుసరించి స్కిల్డ్, సెమీస్కిల్డ్, అన్స్కిల్డ్ అనే మూడు కేటగిరీలుగా విభజించి మొదటి విభాగం నెలసరి జీతం రూ.21,500, రెండో కేటగిరికి రూ.18,500, మూడో కేటగిరికి రూ.15 వేల వేతనం ప్రకటించింది. ఈ జీవోకు అనుగుణంగా
తితిదేలో పనిచేసే ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులకు కార్పొరేషన్లు, ఏజెన్సీలు, కాంట్రాక్టర్ల ద్వారా వేతనాలు చెల్లిస్తున్నారు. తితిదేలో ప్రత్యేకంగా శ్రీవారి సేవా కోఆర్డినేటర్, రికార్డింగ్ ఇంజినీర్, కాస్ట్ అకౌంటెంట్ వంటి 20 లోపు పోస్టులకు రూ.21,500 మించి వచ్చేది. వేతనాల పెంపు కోసం తితిదే పొరుగుసేవల ఉద్యోగులు ఏళ్లతరబడి పోరాటం చేస్తుండగా తిరుపతి ఎమ్మెల్యే, తితిదే పాలకమండలి అధ్యక్షుడు భూమన కరుణాకర్రెడ్డి ఎన్నికల ప్రకటనకు కచ్చితంగా నెలముందు జీతాల పెంపును తీర్మానించారు. ఆయన అసలు లక్ష్యం, కారణమేదైనా పెంచిన జీతాలు ఈనెల ఆలస్యంగా అందుకున్న పొరుగుసేవలు, ఒప్పంద ఉద్యోగుల ఖంగుతిన్నారు. కొన్ని విభాగాల్లో పనిచేసేవారికి 110 శాతం పెరుగుదల కనిపించగా.. మరికొందరికి 10 నుంచి 15 శాతం మాత్రమే పెరగడంపై సగటు వేతనజీవిలో ఆవేదన, అయోమయం మిగిలింది.
కనిపించని హోదా, వేతన సారూప్యత
తితిదే తాజా వేతనాల పెంపు గందరగోళంగా ఉంది. స్కిల్డ్, సెమీస్కిల్డ్, అన్స్కిల్డ్ విభాగాలతోపాటు హైస్కిల్డ్ విభాగం చేర్చారు. సెమీస్కిల్డ్ ఉద్యోగి పొందుతున్న వేతనంకంటే ఎక్కువగా అన్స్కిల్డ్ ఉద్యోగి పొందుతున్నారు. పెంపులో శాస్త్రీయత లోపించిందనేది పొరుగుసేవల ఉద్యోగుల వాదన. గరిష్ఠంగా రూ.2 వేల నుంచి రూ.33 వేలకు పైగా పెరుగుదల కనిపిస్తుండగా హోదాల పెంపు, వేతనాల నిర్ధారణకు తితిదే అవలంబించిన విధానం ఏమిటనేది ఉద్యోగులకు అంతుచిక్కడం లేదు. కేటగిరీలు, హోదాలు, అనుభవంతో సంబంధం లేకుండా అతి పెరుగుదల, అత్యల్ప పెరుగుదల కనిపిస్తోందని వారు విమర్శిస్తున్నారు.
- లక్ష్మీ శ్రీనివాస మ్యాన్పవర్ కార్పొరేషన్ ద్వారా ఫిబ్రవరి 15న పరిచారికలు, అర్చకుల పోస్టులకు రూ.24,640 వేతనంతో పోస్టులు భర్తీ చేయగా.. ఇదేనెల 26న జరిగిన పాలకమండలి సమావేశంలో జీతం పెంపు నిర్ణయం తీసుకోవడంతో వారి తొలినెల వేతనం రూ.45 వేలు, రూ.21 వేలతో నియమితులైన పరిచారిక రూ.30 వేలు అందుకున్నారు.
నాలుగువేల మందికే వర్తింపు
తితిదేలో పనిచేస్తున్న పొరుగుసేవలు, ఒప్పంద ఉద్యోగుల జీతాల పెంపు వర్తింపు గణనీయంగా కుదించినట్లు స్పష్టమవుతోంది. 16 వేలమందిని నిబంధనల పేరుతో 6,800కు తగ్గించగా అర్హుల జాబితాకు వచ్చేసరికి 4,901, జీతాల చెల్లింపునకు వచ్చేసరికి 4,052 మందిని పరిగణనలోకి తీసుకున్నట్లు వెల్లడవుతోంది. నిబంధనల పేరుతో పలు విభాగాలకు జీతాలపెంపు వర్తించకపోవడం, రూ.10 వేలలోపు వేతనం తీసుకుంటున్న 12 వేలమంది సిబ్బంది దైన్యాన్ని తితిదే అధికారులు పట్టించుకోలేదా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పింఛను పంచన.. నయా వంచన
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికల ముంగిట ముఖ్యమంత్రి జగన్, ఆయన ప్రభుత్వంలోని అధికారులు పండుటాకులను ఇబ్బంది పెట్టేందుకు మరో వికృత క్రీడకు తెరలేపారు. -
జన, ధన, మాన చోరుడు జగన్..
[ 30-04-2024]
‘ఒక్క అవకాశం అంటూ గద్దెనెక్కిన జగన్మోహన్రెడ్డి.. రాష్ట్ర ప్రగతిని గోతిలో పాతిపెట్టాడు. రూ.లక్షల కోట్లు హాంఫట్ చేసి రాష్ట్ర ప్రజల నెత్తిన అప్పుల భారం మోపాడు. -
వారాంతపు సెలవులు హుష్ఖాకీ
[ 30-04-2024]
జిల్లాలో ఆధ్యాత్మిక కేంద్రాలు ఉండటంతో వీఐపీల తాకిడి అధికంగా ఉంటుంది.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, పలు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులతో పాటు వివిధ రాష్ట్రాల సీఎంలు, మంత్రులు తరచూ తిరుమల, కాణిపాకం, శ్రీకాళహస్తి, అరగొండ ఆలయాలను సందర్శిస్తుంటారు.. -
సదుంలో రణరంగం
[ 30-04-2024]
బీసీవైసీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్.. మంత్రి పెద్దిరెడ్డి స్వగ్రామం యర్రాతివారిపల్లెలో చేపట్టిన ప్రచారం ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీశాయి. -
రూ. 5 కోట్ల పనులు.. ఐదేళ్లూ విస్మరించారు
[ 30-04-2024]
త్రిరాష్ట్ర కూడలిలో శుభకార్యాలు, సమావేశాలు, సదస్సులు నిర్వహణకు సరైన వేదిక లేక ఇబ్బందులుండేవి. -
పోరు.. ఖరారు
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టం పూర్తయింది. బరిలో నిలిచింది ఎందరో తేలిపోయింది. మరోవైపు తుది, అనుబంధ ఓటర్ల జాబితాలు ఖరారయ్యాయి. -
వనితే నిర్ణేత..!
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల విజయాన్ని మహిళలు నిర్ణయించనున్నారు. జిల్లా పరిధిలో 25వ తేదీ నాటికి మొత్తం 18,12,980 ఓటర్లు ఉన్నారు. -
ఓటుకొస్తే అమ్మ.. జీతాలకొస్తే ఆ..యమ్మ
[ 30-04-2024]
కాలే కడుపులు.. అర్ధాకలితో ఉన్నా తమకు అప్పజెప్పిన పనులు పూర్తిచేయడంలో ఆయాలు ముందుంటారనడంలో సందేహం లేదు. -
తిరుమల పవిత్రతను మంటగలిపారు
[ 30-04-2024]
శ్రీవారి దర్శనం టికెట్ల ధరను విపరీతంగా పెంచేసి తిరుమలకు వచ్చే భక్తులను గత ఐదేళ్లలో దోచుకున్నారని ఎన్డీయే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఆరోపించారు. -
వైకాపా ప్రచారానికి అనుమతులేవీ?
[ 30-04-2024]
వడ్డించేవాడు మనవాడైతే.. చాలన్న చందాన తిరుపతిలో వైకాపా, పోలీసుల తీరు కొనసాగుతోంది. -
ఆలయంలో అధికార పార్టీ ప్రచారం
[ 30-04-2024]
పట్టణంలోని బజారువీధి రామమందిరంలో సోమవారం రాత్రి అధికార పార్టీ అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి ప్రచారం చేపట్టారు. -
బ్యాంకు ఖాతాల్లేకుంటే ఇంటి వద్దే పింఛన్ పంపిణీ: కలెక్టర్
[ 30-04-2024]
సామాజిక భద్రత పింఛన్ల పంపిణీని మే ఒకటిన రెండు పద్ధతుల్లో చేపట్టనున్నామని కలెక్టర్ షన్మోహన్ తెలిపారు. -
బ్యాండేజ్ వేసుకుని వినూత్నంగా ఎన్నికల ప్రచారం
[ 30-04-2024]
ఎన్నికల్లో సానుభూతి పొందాలని సీఎం జగన్ ఆడిన గులకరాయి డ్రామాను ప్రజలు నమ్మేస్థితిలో లేరని తెదేపా, జనసేన నాయకులు ఎద్దేవా చేశారు. -
కోర్టులో కేసున్నా.. రోడ్డు నిర్మాణం
[ 30-04-2024]
మండలంలోని ముడిపల్లి పంచాయితీలోని వెంగన్న కండ్రిగ ఎస్టీకాలనీ వద్ద వైకాపా నాయకులు దౌర్జన్యంగా రోడ్డు వేస్తున్నారని గ్రామస్థులు సోమవారం ఆరోపించారు. -
ఇద్దరు వాలంటీర్లపై వేటుకు సిఫార్సు
[ 30-04-2024]
ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రచారంలో పాల్గొన్న ఇద్దరు వాలంటీర్లపై చర్యలకు ఉన్నతాధికారులకు సిఫార్సు చేశామని ఎంపీడీవో వరప్రసాద్ తెలిపారు. -
చీటీల మోసం కేసులో నిందితుడికి తొమ్మిదేళ్ల జైలు
[ 30-04-2024]
చీటీల పేరుతో మోసానికి పాల్పడిన కేసులో నిందితుడికి తొమ్మిదేళ్ల జైలు శిక్ష విధిస్తూ సోమవారం స్థానిక జిల్లా ప్రధాన సెషన్స్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి భీమారావు సోమవారం తీర్పు చెప్పారు. -
కమ్యూనిటీ హాలులో వైకాపా నాయకుల సమావేశం?
[ 30-04-2024]
తిరుమలలో కూటమి అభ్యర్థి ఎన్నికల ప్రచారం నేపథ్యంలో అదే సమయంలో వైకాపా తిరుమల విభాగం అధ్యక్షుడు చిన్నముని ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి స్థానిక కమ్యూనిటీ భవనంలో సమావేశమయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
ధరలు పెరిగినా.. బంగారం గిరాకీ తగ్గలే!
-
కేజ్రీవాల్ను కలిసిన పంజాబ్ సీఎం.. ఆయన ఏం చెప్పారంటే?
-
విప్రో కొత్త సీఈఓ వేతనం ఎంతో తెలుసా?
-
కరోనా జన్యు గుట్టువిప్పిన శాస్త్రవేత్తకు చైనా వేధింపులు..!
-
‘ఇప్పటికి నిద్ర లేచారు..’: పతంజలి ఉత్పత్తుల లైసెన్సు రద్దుపై సుప్రీం
-
యువ రోహిత్ను చూశారా.. బర్త్డే గిఫ్ట్గా టీనేజ్ ఫొటో షేర్ చేసిన తల్లి పుర్ణిమ