పస్తులతో పనులు చేస్తున్నాం
త్రిరాష్ట్ర కూడలిలో ఏర్పాటైన ద్రవిడ వర్సిటీలో ఒకప్పుడు సీటు దొరకడమే కష్టం. తెదేపా హయాంలో వెలిగిపోయిన వర్సిటీ.. వైకాపా పాలకుల కక్ష సాధింపు చర్యలకు మనుగడే ప్రశ్నార్థకంగా మారింది.
జీతాలిచ్చి ఆదుకోండి ప్రభో..!
ఎనిమిది నెలలుగా పోరాటం.. స్పందన లేక ఆందోళన
ద్రవిడ వర్సిటీలో సమ్మె చేస్తున్న పొరుగు సేవల ఉద్యోగులు (పాతచిత్రం)
కుప్పం గ్రామీణ, న్యూస్టుడే: త్రిరాష్ట్ర కూడలిలో ఏర్పాటైన ద్రవిడ వర్సిటీలో ఒకప్పుడు సీటు దొరకడమే కష్టం. తెదేపా హయాంలో వెలిగిపోయిన వర్సిటీ.. వైకాపా పాలకుల కక్ష సాధింపు చర్యలకు మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. కనీసం అక్కడి పొరుగు సేవల సిబ్బందికి వేతనాలు చెల్లించలేని దుస్థితి. ఇది చాలు ఈ పాపం వైకాపా సర్కార్దేనని చిన్నపిల్లాడికి సైతం ఇట్టే అర్థమైపోతుంది.
ద్రవిడపై ప్రభుత్వం శీతకన్ను..!
ద్రవిడ విశ్వవిద్యాలయానికి బ్లాక్ గ్రాంటు కింద రూ.33 కోట్లకు ప్రతిపాదనలు పంపగా... ప్రభుత్వం రూ.19 కోట్లు మాత్రమే కేటాయించింది. వీటితో వర్సిటీ పాలన, రెగ్యులర్ బోధన, బోధనేతర ఉద్యోగులకు రూ.1.60 కోట్ల వరకు ప్రతినెలా జీతాల రూపంలో చెల్లిస్తున్నారు. ప్రస్తుతం దూరవిద్య నిధులు ఖాళీ కావడంతో పొరుగు సేవల ఉద్యోగుల జీతాలూ బ్లాక్ గ్రాంట్ నుంచి చెల్లించాలి. అయితే అందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి. దాని కోసం వీసీ ఆచార్య మధుజ్యోతి యత్నిస్తున్నా.. ఉన్నత విద్యాశాఖ నుంచి స్పందన కరవైంది. దీంతో ఆమె ఏమి చేయలేని పరిస్థితి. మరోవైపు వర్సిటీ బ్లాక్ గ్రాంట్ నుంచి పొరుగు సేవల ఉద్యోగులకు జీతాలు చెల్లించరాదంటూ రెగ్యులర్ ఉద్యోగులు అడ్డుపడుతున్నారు.
ఉద్యోగుల మధ్య చిచ్చుపెట్టి...
వర్సిటీలో ఒకప్పుడు 254 మంది పొరుగు సేవల ఉద్యోగులు పనిచేసేవారు. జీతాలు రాకపోవడంతో కొందరు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లి వేరే పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. దీంతో వారి సంఖ్య 227కు పడిపోయింది. వీరంతా ఇటీవల వరకు జీతాల కోసం కలిసికట్టుగా పోరాటం చేశారు. వారిలో సుమారు 10 మందిని వర్సిటీ రిజిస్ట్రార్ వేణుగోపాల్రెడ్డి మచ్చిక చేసుకుని చిచ్చుపెట్టారు. సమ్మె విరమించి విధుల్లో చేరాలని వారిని ఆదేశించారు. దీంతో పొరుగు సేవల ఉద్యోగుల్లో లుకలుకలు మొదలయ్యాయి. పరస్పర దాడులకు సైతం దిగారు. ఇటీవల ఇరువర్గాలు గుడుపల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. దీనిపైనా కూడా పాలకవర్గం స్పందించలేదు.
సమ్మె చేసినా... ఫలితం శూన్యమే...
2023 జనవరి నుంచి పొరుగు సేవల ఉద్యోగులకు జీతాల సమస్య ఏర్పడింది. అప్పట్లోనే 53 రోజులపాటు విధులు బహిష్కరించి సమ్మె చేపట్టారు. దీనిపై స్పందించిన వర్సిటీ అధికారులు దాదాపు 3 నెలల జీతాలు చెల్లించారు. అప్పటి నుంచి క్రమం తప్పకుండా జీతాలు వస్తాయని హామీ ఇచ్చి సమ్మె విరమింపజేశారు. తర్వాత సమ్మె కాలం 68 రోజులతో పాటు మరో ఆరు నెలల జీతాల బకాయిలు పడ్డారు. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి 12 నుంచి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. మార్చి 1న వర్సిటీ బంద్ చేశారు. అయినా... వర్సిటీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో పొరుగు సేవల ఉద్యోగులు అయోమయంలో పడ్డారు.
కుటుంబ పోషణ ఎలా?..: జీతాలపై ఆధారపడి బతుకుతున్నాం. ఎనిమిది నెలలుగా జీతాలు అందించకుంటే కుటుంబ పోషణ భారమైంది. అధికారులేమో మా వద్ద పనులు మాత్రం చేయించుకొంటున్నారు. జీతాలు చెల్లించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిరసన, సమ్మె, బంద్ ఇలా ఏమి చేసినా పట్టించుకోవడం లేదు. ఉద్యోగాలు చేయాలా... వద్దా.. అనే అయోమయంలో పడ్డాం.
జ్ఞానేశ్వరబాబు, అటెండరు
మా జీవితాలతో చెలగాటమాడొద్దు..: విశ్వవిద్యాలయం ప్రారంభం నుంచి పనిచేస్తున్నా. ఎప్పుడూ జీతాల సమస్య రాలేదు. ఏడాది నుంచి అధికారులు వేధిస్తున్నారు. నిరసనలు చేపట్టినా మా సమస్య పట్టించుకోవడం లేదు. అధికారులు స్పందించకుంటే మరింత ఉద్ధృతం చేస్తాం.
శ్రీనివాసులు, పొరుగు సేవల ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పింఛను పంచన.. నయా వంచన
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికల ముంగిట ముఖ్యమంత్రి జగన్, ఆయన ప్రభుత్వంలోని అధికారులు పండుటాకులను ఇబ్బంది పెట్టేందుకు మరో వికృత క్రీడకు తెరలేపారు. -
జన, ధన, మాన చోరుడు జగన్..
[ 30-04-2024]
‘ఒక్క అవకాశం అంటూ గద్దెనెక్కిన జగన్మోహన్రెడ్డి.. రాష్ట్ర ప్రగతిని గోతిలో పాతిపెట్టాడు. రూ.లక్షల కోట్లు హాంఫట్ చేసి రాష్ట్ర ప్రజల నెత్తిన అప్పుల భారం మోపాడు. -
వారాంతపు సెలవులు హుష్ఖాకీ
[ 30-04-2024]
జిల్లాలో ఆధ్యాత్మిక కేంద్రాలు ఉండటంతో వీఐపీల తాకిడి అధికంగా ఉంటుంది.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, పలు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులతో పాటు వివిధ రాష్ట్రాల సీఎంలు, మంత్రులు తరచూ తిరుమల, కాణిపాకం, శ్రీకాళహస్తి, అరగొండ ఆలయాలను సందర్శిస్తుంటారు.. -
సదుంలో రణరంగం
[ 30-04-2024]
బీసీవైసీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్.. మంత్రి పెద్దిరెడ్డి స్వగ్రామం యర్రాతివారిపల్లెలో చేపట్టిన ప్రచారం ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీశాయి. -
రూ. 5 కోట్ల పనులు.. ఐదేళ్లూ విస్మరించారు
[ 30-04-2024]
త్రిరాష్ట్ర కూడలిలో శుభకార్యాలు, సమావేశాలు, సదస్సులు నిర్వహణకు సరైన వేదిక లేక ఇబ్బందులుండేవి. -
పోరు.. ఖరారు
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టం పూర్తయింది. బరిలో నిలిచింది ఎందరో తేలిపోయింది. మరోవైపు తుది, అనుబంధ ఓటర్ల జాబితాలు ఖరారయ్యాయి. -
వనితే నిర్ణేత..!
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల విజయాన్ని మహిళలు నిర్ణయించనున్నారు. జిల్లా పరిధిలో 25వ తేదీ నాటికి మొత్తం 18,12,980 ఓటర్లు ఉన్నారు. -
ఓటుకొస్తే అమ్మ.. జీతాలకొస్తే ఆ..యమ్మ
[ 30-04-2024]
కాలే కడుపులు.. అర్ధాకలితో ఉన్నా తమకు అప్పజెప్పిన పనులు పూర్తిచేయడంలో ఆయాలు ముందుంటారనడంలో సందేహం లేదు. -
తిరుమల పవిత్రతను మంటగలిపారు
[ 30-04-2024]
శ్రీవారి దర్శనం టికెట్ల ధరను విపరీతంగా పెంచేసి తిరుమలకు వచ్చే భక్తులను గత ఐదేళ్లలో దోచుకున్నారని ఎన్డీయే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఆరోపించారు. -
వైకాపా ప్రచారానికి అనుమతులేవీ?
[ 30-04-2024]
వడ్డించేవాడు మనవాడైతే.. చాలన్న చందాన తిరుపతిలో వైకాపా, పోలీసుల తీరు కొనసాగుతోంది. -
ఆలయంలో అధికార పార్టీ ప్రచారం
[ 30-04-2024]
పట్టణంలోని బజారువీధి రామమందిరంలో సోమవారం రాత్రి అధికార పార్టీ అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి ప్రచారం చేపట్టారు. -
బ్యాంకు ఖాతాల్లేకుంటే ఇంటి వద్దే పింఛన్ పంపిణీ: కలెక్టర్
[ 30-04-2024]
సామాజిక భద్రత పింఛన్ల పంపిణీని మే ఒకటిన రెండు పద్ధతుల్లో చేపట్టనున్నామని కలెక్టర్ షన్మోహన్ తెలిపారు. -
బ్యాండేజ్ వేసుకుని వినూత్నంగా ఎన్నికల ప్రచారం
[ 30-04-2024]
ఎన్నికల్లో సానుభూతి పొందాలని సీఎం జగన్ ఆడిన గులకరాయి డ్రామాను ప్రజలు నమ్మేస్థితిలో లేరని తెదేపా, జనసేన నాయకులు ఎద్దేవా చేశారు. -
కోర్టులో కేసున్నా.. రోడ్డు నిర్మాణం
[ 30-04-2024]
మండలంలోని ముడిపల్లి పంచాయితీలోని వెంగన్న కండ్రిగ ఎస్టీకాలనీ వద్ద వైకాపా నాయకులు దౌర్జన్యంగా రోడ్డు వేస్తున్నారని గ్రామస్థులు సోమవారం ఆరోపించారు. -
ఇద్దరు వాలంటీర్లపై వేటుకు సిఫార్సు
[ 30-04-2024]
ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రచారంలో పాల్గొన్న ఇద్దరు వాలంటీర్లపై చర్యలకు ఉన్నతాధికారులకు సిఫార్సు చేశామని ఎంపీడీవో వరప్రసాద్ తెలిపారు. -
చీటీల మోసం కేసులో నిందితుడికి తొమ్మిదేళ్ల జైలు
[ 30-04-2024]
చీటీల పేరుతో మోసానికి పాల్పడిన కేసులో నిందితుడికి తొమ్మిదేళ్ల జైలు శిక్ష విధిస్తూ సోమవారం స్థానిక జిల్లా ప్రధాన సెషన్స్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి భీమారావు సోమవారం తీర్పు చెప్పారు. -
కమ్యూనిటీ హాలులో వైకాపా నాయకుల సమావేశం?
[ 30-04-2024]
తిరుమలలో కూటమి అభ్యర్థి ఎన్నికల ప్రచారం నేపథ్యంలో అదే సమయంలో వైకాపా తిరుమల విభాగం అధ్యక్షుడు చిన్నముని ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి స్థానిక కమ్యూనిటీ భవనంలో సమావేశమయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్ ప్లేఆఫ్స్ మ్యాచ్లకు ఇంగ్లాండ్ స్టార్ ఆటగాళ్లు దూరం.. కారణమిదే
-
వివేకా హత్య తర్వాత అవినాష్.. జగన్కు ఫోన్ చేసి ఏం మాట్లాడారు?: సునీత
-
సేల్స్ తగ్గాయన్న ఫ్రస్ట్రేషన్.. సీనియర్ ఎగ్జిక్యూటివ్లపై వేటు వేసిన మస్క్
-
కెనడాలో విదేశీ విద్యార్థులకు నిరాశ.. ఇక వారానికి గరిష్ఠంగా 24 గంటలే పని!
-
అమిత్ షా నకిలీ వీడియోల కేసు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే పీఏ అరెస్టు
-
భార్య దారుణ హత్య.. భారతీయుడికి జీవిత ఖైదు