logo

కర్ణాటక మద్యం తరలిస్తూ...

కుప్పం మండలం పరిధిలోని పైపాళ్యం పంచాయతీ చిన్నబొగ్గుపల్లి గ్రామానికి చెందిన వైకాపా సోషల్‌ మీడియా సభ్యుడు కుప్పస్వామి, అతని స్నేహితుడు సంపత్‌ కర్ణాటక మద్యాన్ని కుప్పానికి తీసుకొస్తుండగా బుధవారం కుప్పం ఎస్‌ఈబీ పోలీసులు అరెస్టు చేశారు.

Published : 18 Apr 2024 02:42 IST

వైకాపా సోషల్‌ మీడియా సభ్యుడి అరెస్టు

జగన్‌ చిత్రపటంతో సోషల్‌ మీడియా సభ్యుడు కుప్పస్వామి

కుప్పం గ్రామీణ, న్యూస్‌టుడే: కుప్పం మండలం పరిధిలోని పైపాళ్యం పంచాయతీ చిన్నబొగ్గుపల్లి గ్రామానికి చెందిన వైకాపా సోషల్‌ మీడియా సభ్యుడు కుప్పస్వామి, అతని స్నేహితుడు సంపత్‌ కర్ణాటక మద్యాన్ని కుప్పానికి తీసుకొస్తుండగా బుధవారం కుప్పం ఎస్‌ఈబీ పోలీసులు అరెస్టు చేశారు. గుడుపల్లె-సంగనపల్లె బస్టాపు వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా... ఓ ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు ఆపకుండా ముందుకెళ్లారు. సెబ్‌ అధికారులు వెంబడించి పట్టుకుని పరిశీలించగా.. రూ.30,240 విలువైన మద్యం ప్యాకెట్లు కనిపించారు. వారు చిన్నబొగ్గుపల్లి గ్రామానికి చెందిన పి.సంపత్‌, కుప్పస్వామిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఈబీ సీఐ సృజనబాబు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని