సైజు మారదు.. కాలు దూరదు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పరిస్థితి ఇలాగే ఉంది. జగనన్న విద్యాకానుకలో భాగంగా ప్రతి విద్యార్థికి ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు ఇస్తామన్నారు. వీటి సరఫరాలో జాప్యం జరిగింది.
-న్యూస్టుడే, మండపేట, రామచంద్రపురం
రాజమహేంద్రవరం జిల్లా సీతానగరం వంగలపూడి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఆరు నుంచి పది తరగతుల విద్యార్థులు 241 మంది చదువుతున్నారు. జగనన్న విద్యాకానుకలో భాగంగా అందరికీ బూట్లు అందాలి. కానీ ఇప్పటికీ 46 మందికి రాలేదు. బూట్లు తీసుకున్నవారు కూడా వేసుకుని తిరగడానికి నానాపాట్లు పడుతున్నారు. కొందరి కాళ్లకు చిన్నవిగా, బిగుతుగా మరికొందరికి పెద్దవిగా లూజుగా ఉన్నాయి. దాంతో చెప్పులతోనే పాఠశాలకు వస్తున్నారు.
కాకినాడ జిల్లా కాజులూరు మండలం కాజులూరు ఉన్నత పాఠశాలలో 970 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ పాఠశాలలోకి 3,4,5 తరగతులు కూడా విలీనం అయ్యాయి. వారు అక్కడి నుంచి వచ్చేటపుడే బూట్లు తెచ్చుకోవడంతో సమస్య లేదు. ఆరు నుంచి పది తరగతులు చదువుతున్న 212 మందికి బూట్లు ఇప్పటికీ అందలేదు. విద్యార్థుల పాదాల కొలతలకు సరిపడా ఎక్కడైనా మిగిలి ఉంటే తెచ్చుకోవాలని అధికారులు సూచించారు.
డా.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా కె.గంగవరం మండలం దంగేరు ఉన్నత పాఠశాలలో 455 మంది విద్యార్థులున్నారు. ఇంకా 148 మందికి బూట్లు అందనే లేదు. తీసుకున్నవారు కూడా చాలా మంది బూట్లు బడికి వేసుకురావడం లేదు. ఎందుకని అడుగుతుంటే సరిపోలేదని, కరిచేస్తున్నాయని, జారిపోతున్నాయని ఇలా పలు రకాలుగా చెబుతున్నారు. మండల వనరులకేంద్రంలో చాలా బూట్లు స్టాకు ఉందని తెలిసి వెళ్లి చూసుకున్నామని అయితే స్టాకున్నా అవి తమ పిల్లలకు సరిపోవడం లేదని పాఠశాల ఉపాధ్యాయులు చెప్పారు.
రామచంద్రపురం మండలంలోని పాఠశాలల విద్యార్థులకు బూట్లు వచ్చాయి. కానీ అవి చాలా మందికి సరిపోవడం లేదు. సైజుల్లో చాలా తేడాలొచ్చాయి. కొన్ని పాఠశాలకు ఒక కాలుకు సంబంధించినవే వచ్చాయి. సమగ్ర శిక్షా అభియాన్ అధికారులను అడిగితే ఇండెంటు ప్రకారం బూట్లు ఇచ్చేశామని.. సరిపోకపోతే పక్క మండలాల నుంచి సర్దుబాటు చేసుకోవాలని సూచించారని ఎంఈవో ఎం.శ్రీనివాసు చెప్పారు. దీంతో 630 జతల బూట్లు తెచ్చామని, ఇంకా 245 వరకూ వస్తే కానీ అందరికీ సరిపెట్టలేమని, ఎక్కడున్నాయో వాకబు చేసుకోవాలని చెప్పారు.
సత్యవాడలో చెప్పులతోనే పాఠశాలకు వస్తున్న విద్యార్థినులు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పరిస్థితి ఇలాగే ఉంది. జగనన్న విద్యాకానుకలో భాగంగా ప్రతి విద్యార్థికి ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు ఇస్తామన్నారు. వీటి సరఫరాలో జాప్యం జరిగింది. ఇప్పటికీ కొన్ని పాఠశాలలకు వస్తూనే ఉన్నాయి. ఇచ్చిన వాటిలో సైజులు సరిపోక విద్యార్థులు నానాపాట్లు పడ్డారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గణాంకాల ప్రకారం 4,26,000 మందికి బూట్లు అందాలి. సరఫరాలో పలు లోపాలు తలెత్తాయి. వేసవి సెలవుల్లోనే విద్యార్థులకు కావాల్సిన బూట్ల కొలతలు ఆన్లైన్లోనే సంబంధిత అధికారులకు అందజేశారు. తీరా వచ్చేటప్పటికి చాలా మందికి సైజులు మారిపోయాయి. ముఖ్యంగా 9,10 తరగతులు చదువుతున్న బాలురుకు ఎక్కడా కూడా సరిగా సరిపోలేదు. ఇలా సరిపోని బూట్లను తిరిగి ఇచ్చేస్తే సరైన సైజులు ఇస్తామన్నారు. ఇలా మండల వనరుల కేంద్రాలకు ఎన్నో బూట్లు వచ్చి చేరాయి. అంతే పెద్ద సైజు బూట్లు ఇప్పటికీ అందలేదు. ప్రాథమిక పాఠశాలల విద్యార్థులందరికీ బూట్లు, సాక్సులు అందాయని ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు చెబుతున్నారు.
అవసరమైన వాటి కన్నా ఎక్కువే వచ్చాయి..
- శివరామ్, ఉమ్మడి జిల్లా సీఎంవో, సమగ్ర శిక్షా అభియాన్
జిల్లాకు బూట్లు 4,26,000 జతలకన్నా పది శాతం ఎక్కువే వచ్చాయి. దఫదఫాలుగా రావడంతో మండలాలకు వీటిని సరఫరా చేయడంలో అక్కడక్కడా లోపాలు తలెత్తిన మాట వాస్తవమే. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో బూట్లు ఆయా మండల వనరుల కేంద్రాల్లో, కొన్ని పాఠశాలల్లో నిరుపయోగంగా ఉన్నాయి. వీటిని అవసరమైన మండలాలకు ఇవ్వాలని ఎంఈవోలకు సూచించాం. ఈ వారంలో అన్ని సర్దుబాట్లు పూర్తవుతాయి. అందరికీ సరిపడా సైజుల్లో బూట్లు అందుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీరూ వద్దు మీ డబ్బూ వద్దు.. వైకాపా తాయిలాలకు తలవంచని ఓటర్లు
[ 05-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో అధికార పార్టీ నేతలు అడ్డదారుల్లో ప్రయత్నాలు ఆరంభించారు. -
కాకినాడను ‘మరో పులివెందుల’ చేస్తారా?
[ 05-05-2024]
కాకినాడ గ్రామీణం, సిటీ నియోజకవర్గాల్లో శనివారం రాత్రి తెదేపా అధినేత చంద్రబాబు రోడ్షో నిర్వహించారు. అనంతరం కాకినాడలోని సంతచెరువు కూడలిలో ప్రజాగళం బహిరంగ సభలో ప్రసంగించారు. -
అయిదేళ్లూ.. మద్యం ఏరులై పారించారు..
[ 05-05-2024]
ఎక్కడా బెల్టుషాపు లేకుండా చేస్తాం.. ఒక్క అవకాశమిస్తే పూర్తిగా మద్యం నిషేధించి 2024లో మళ్లీ ఓటు ఆడిగేందుకు మీ ముందుకు వస్తానని జగన్మోహన్రెడ్డి ఆనాడు అన్నారు.. రాష్ట్రంలోని అక్క చెల్లెళ్లందరూ ఆదంతా వాస్తవమనుకున్నారు. -
అధికార పార్టీకి డీఎస్పీ దన్ను..!
[ 05-05-2024]
ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి అన్ని విభాగాల అధికారులు విధుల్లో తలమునకలై ఉన్నారు. -
కూటమి విజయం అవసరం: పురందేశ్వరి
[ 05-05-2024]
ప్రజలందరూ సంతోషంగా జీవించడానికి కూటమి విజయం అవసరమని ఎంపీ అభ్యర్థి, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. -
వరద బాధితులకు కుచ్చుటోపీ
[ 05-05-2024]
‘‘2022 జులై 26న గోదావరి వరదల సమయంలో లంక గ్రామాలైన ఊడిమూడిలంక, జి.పెదపూడిలంక, అరిగెలవారిపేట, బూరుగులంక గ్రామాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పర్యటించారు. -
విజయ శంఖారావం సభకు విస్తృత ఏర్పాట్లు
[ 05-05-2024]
సార్వత్రిక ఎన్నికల సమరం కీలక దశకు చేరుకుంటున్న సమయంలో కూటమి ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ పాల్గొనే ‘విజయ శంఖారావం’ సభకు రాజమహేంద్రవరంలో చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. -
తెదేపాతోనే బీసీలకు స్వాతంత్య్రం
[ 05-05-2024]
రాష్ట్రంలోని బీసీలకు తెదేపా ఆవిర్భావంతోనే నిజమైన స్వాతంత్రం వచ్చిందని తెదేపా కార్యనిర్వాహక కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహనరావు అన్నారు. -
ఓటేద్దాం.. అవినీతిపరులపై వేటు వేద్దాం
[ 05-05-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని డీఎస్ఈఓ వాసుదేవరావు కోరారు. -
పోస్టల్ బ్యాలెట్ @ 18,715
[ 05-05-2024]
ఎన్నికల్లో విధులు నిర్వహించే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఈనెల 8వ తేదీ వరకు కల్పిస్తున్నామని జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి జె.నివాస్ తెలిపారు. -
మామిడి రారాజు... వైకాపా తీరుతో బేజారు
[ 05-05-2024]
ఫలాల్లో మామిడి రారాజే అయినా వాటిని సాగుచేసే రైతులకు సర్కారు తీరుతో తిప్పలు తప్పడం లేదు. -
బీమా.. జగన్ డ్రామా..!
[ 05-05-2024]
ఆకస్మికంగా యజమాని మరణిస్తే ఆ కుటుంబం పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. -
శిరోముండనం కేసుపై అప్పీలుకు వెళ్లాలి
[ 05-05-2024]
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రామచంద్రపురం మండలం వెంకటాయపాలెం శిరోముండనం కేసుకు సంబంధించి ఇటీవల విశాఖ కోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం ఉన్నత న్యాయ స్థానానికి అప్పీలుకు వెళ్లాలని విదసం నాయకులు డిమాండ్ చేశారు. -
నేడు తునిలో పవన్ కల్యాణ్ వారాహి యాత్ర
[ 05-05-2024]
జనసేన అధినేత పవన్కల్యాణ్ తునిలో ఆదివారం నిర్వహించే వారాహి యాత్రను విజయవంతం చేసేందుకు జనసేన, తెదేపా, భాజపా నాయకులు, అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
వైకాపా ఎమ్మెల్యే స్టేటస్ పెట్టిన యువకుడు.. చంపుతామని బెదిరించిన అనుచరులు
[ 05-05-2024]
రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాపైనే చరవాణిలో స్టేటస్ పెడతావా అంటూ వైకాపా వర్గీయుడు జనసేనకు చెందిన ఒక యువకుడిపై దాడికి దిగారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్.. సీఈఓ రియాక్షన్ ఇదే..
-
‘భారతీయుల వల్లే అమెరికా టెక్ ఇండస్ట్రీ మనుగడ’
-
ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
-
ఎన్టీఆర్కు అర్జున్పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
-
డోపింగ్ శాంపిల్కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!
-
మృణాల్ అవుట్ఫిట్కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్కు 1400 గంటలు