కదలని బదిలీ దస్త్రం..!
రెవెన్యూ శాఖలో ఉద్యోగుల బదిలీ ప్రక్రియ ఇంకా కొలిక్కి రావడం లేదు. వివిధ విభాగాల సిబ్బంది బదిలీలకు సంబంధించిన దస్త్రం కదలడం లేదు.
కాకినాడ కలెక్టరేట్: రెవెన్యూ శాఖలో ఉద్యోగుల బదిలీ ప్రక్రియ ఇంకా కొలిక్కి రావడం లేదు. వివిధ విభాగాల సిబ్బంది బదిలీలకు సంబంధించిన దస్త్రం కదలడం లేదు. బుధవారంతో ఉద్యోగుల బదిలీలకు గడువు ముగిసినా.. ఇప్పటికీ అధికారులు ఈ ప్రక్రియను చేపట్టలేదు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రాతిపదికన రెవెన్యూ శాఖలో బదిలీలకు చర్యలు చేపట్టారు. అయిదేళ్లు ఒకే చోట సర్వీసు పూర్తిచేసుకున్న వారిని విధిగా బదిలీ చేయాలని, రెండేళ్లు పూర్తయినవారికి వినతి ప్రాతిపదికన స్థానచలనం కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. దీని ప్రకారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో బదిలీల పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు బుధవారం అర్ధరాత్రిలోగా స్థానచలనం కల్పించే ప్రక్రియ పూర్తి చేయాలి. దీనికి సంబంధించి కాకినాడ జిల్లాలో దస్త్రాన్ని ఇప్పటికే తయారుచేశారు. మిగతా మూడు జిల్లాలకు సంబంధించిన దస్త్రాలు ఇంకా కాకినాడ కలెక్టరేట్కు చేరలేదు. ఈ జిల్లాల్లో ఎంత మంది బదిలీల పరిధిలోకి వస్తున్నారు.. ఎంతమంది వినతి కోరుతూ దరఖాస్తు చేశారు.. ఇలా పూర్తి వివరాలు అందాల్సి ఉంది. ఇవేవీ ఇంకా రాకపోవడంతో కాకినాడలో కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన బదిలీ ప్రక్రియ కొలిక్కి రాలేదు.
పూర్తిస్థాయిలో సమాచారం అందక: కాకినాడ జిల్లాలో 28 మంది తహసీల్దార్లు, 70 మంది ఉప తహసీల్దార్లు, 50 మంది సీనియర్ అసిస్టెంట్లు, 40 మంది జూనియర్ అసిస్టెంట్లు, 630 మంది వీర్వోలు ఉన్నారు. ఇప్పటికి 30 మంది వీఆర్వోలు, నలుగురు సీనియర్ అసిస్టెంట్లు బదిలీలకు దరఖాస్తు చేశారు. బుధవారం మధ్యాహ్నం కూడా కొందరు ఉద్యోగులు కలెక్టరేట్లో అధికారులకు దరఖాస్తులు అందించారు. డాక్టర్ బీఆర్అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు సంబంధించి ఎలాంటి సమాచారం కాకినాడ కలెక్టరేట్కు చేరలేదు. గతేడాది జిల్లాల విభజన, ఉద్యోగుల కేటాయింపులు, గత జూన్, జులై నెలల్లోనే ఉద్యోగుల బదిలీలు చేపట్టడంతో అపుడే చాలామందికి స్థానచలనం కలిగింది. దీంతో ఈ ఏడాది బదిలీలు తక్కువగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. దాదాపు తహసీల్దార్లు ఎవరూ బదిలీల పరిధిలోకి రాలేదు. రెవెన్యూ శాఖలో బదిలీలపై కాకినాడ జిల్లా రెవెన్యూ అధికారి (ఇన్ఛార్జి) కె.శ్రీరమణిని ‘న్యూస్టుడే’ సంప్రదించగా ఈ ప్రక్రియ ఇంకా కొలిక్కిరాలేదని వివరణ ఇచ్చారు. బదిలీలకు దరఖాస్తు చేసుకునే గడువు పెంచే అవకాశం ఉందని చెప్పారు. దీనికి సంబంధించిన ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తున్నామన్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలోకి వచ్చే మిగతా జిల్లాల నుంచి జాబితాలు ఇంకా రాలేదని చెప్పారు. అవి రాగానే బదిలీల ప్రక్రియ ప్రారంభమవుతుందని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా కుటుంబాన్ని అప్రతిష్ఠ పాలుజేయాలని చూస్తున్నారు: పవన్పై మండిపడ్డ ముద్రగడ
[ 07-05-2024]
‘ఇటీవల మా కుటుంబంలో చిన్న చిచ్చు రేగిన సంగతి బాధాకరం. అయినా భయపడను. ఎలాగూ నా కుమార్తెను రోడ్డుపైకి లాగారు. ఆమెతో ఇంటర్వ్యూలు ఇప్పించడం, స్టూడియోలకు పంపించి డిబేట్లలో పాల్గొనేటట్లు చేయడం.. -
నమో గోదారి.. తెలుగు జనఝరి
[ 07-05-2024]
వేదంలా ఘోషించే తీరాన.. జన గోదావరి పరవళ్లు తొక్కింది. ప్రజాకంటక వైకాపా పాలనపై కూటమి సమర నినాదం మోగించింది. దక్షిణ గంగ పరవళ్లు తొక్కే రాజమహేంద్రిలో ప్రజాగళమై గర్జించింది. -
జనగళం జయభేరి
[ 07-05-2024]
మూడు పార్టీల జట్టు.. సమర భేరి మోగించింది. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సోమవారం జరిగిన ప్రజాగళం సభకు కూటమి దళం కదం తొక్కింది. ఒకవైపు భాజపా శ్రేణులు.. మరోవైపు తెలుగు తమ్ముళ్లు.. ఇంకోవైపు జన సైనికులు.. -
గజిబిజి.. గందరగోళం
[ 07-05-2024]
జిల్లాలో సోమవారం ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ అంతా గజిబిజి.. గందరగోళంగా మారిపోయింది. కొన్ని నియోజకవర్గాల్లోని ఫెసిలిటేషన్ కేంద్రాల వద్ద కొందరు ఉద్యోగులు ఓటు వినియోగించుకోలేని పరిస్థితిలో వెనుతిరగాల్సి వచ్చింది. -
ఇసుకంతా తోడేస్తున్నా.. ఇంకెన్నాళ్లు నిద్ర నటిస్తారు?
[ 07-05-2024]
గోదావరి నదీగర్భంలో యంత్రాలను దించి పర్యావరణానికి విఘాతం కలిగించే ఇసుక తవ్వొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసినా మనలను కాదులే అన్నట్లుగా రాష్ట్రంలో ఇసుకాసురులు వ్యవహరిస్తున్నారు. -
రూ.66 కోట్లు ఎక్కడ జగన్?
[ 07-05-2024]
విజ్జేశ్వరం నుంచి నరసాపురం మండలం బియ్యపుతిప్ప వరకు సుమారు 98 కి.మీ, పోలవరం నుంచి విజ్జేశ్వరం వరకు 45 కి.మీ. మేర ఏటిగట్లు ఉంది. మొత్తం 143 కి.మీ. పొడవున వశిష్ట కుడిగట్టు ఉంది. -
బీసీలపై కక్ష.. కోతలతో శిక్ష
[ 07-05-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అయిదేళ్ల పాలనలో వెనకబడిన తరగతుల నడ్డివిరిచారు. రాయితీ రుణాలు నిలిపివేసి స్వయం ఉపాధికి ముగింపు పలికారు. చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నంత కాలం బీసీల స్వయం సమృద్ధికి పెద్దపీట వేశారు. -
నేడు ఇంటి నుంచే ఓటు ప్రారంభం
[ 07-05-2024]
ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా వృద్ధులు, దివ్యాంగులు వ్యయప్రయాసలకోర్చి పోలింగ్ కేంద్రాలకు వచ్చి, గంటల తరబడి వరుసలో నిల్చుని ఇబ్బందిపడేవారు. -
తీరంలో ఇసుక దొంగలు
[ 07-05-2024]
సముద్ర తీరంలో ఇసుక దందా ఆగడం లేదు. సీఆర్జెడ్ పరిధిలోనూ యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి. అధికార పక్ష నాయకుల అండదండలతోనే ఈ దందా సాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
వైకాపా నాయకులు చెబితేనే జీతాలిస్తారా!
[ 07-05-2024]
రాజీనామాలు చేసి మేము చెప్పినట్లుగా ప్రచారంలోకి వస్తేనే అన్ని సవ్యంగా మీకు ఉంటాయి.. జీతాలు కూడా పడతాయంటూ వైకాపా నాయకుల ఆదేశాలతో రాజీనామా పత్రాలిచ్చేసిన వారిలో కొంతమందికి జీతాలు పడడం చర్చనీయాంశంగా మారింది. -
ఈసారి గెలిపిస్తే చేస్తారట.. ఈ అయిదేళ్లూ ఏం చేశారో..
[ 07-05-2024]
అయిదేళ్లు ఎంపీగా, అధికార పార్టీ ప్రజాప్రతినిధిగా ఉన్నారు.. గతంలో ఎప్పుడూ చూడనంతగా నగరాన్ని అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకొన్నారు. ఇప్పుడు మళ్లీ కొత్త ప్రమాణాలు చేస్తున్నారు ఎమ్మెల్యే అభ్యర్థి భరత్రామ్. -
వీధి వీధినా వెతలు.. పట్టించుకునేదెవరు..
[ 07-05-2024]
నగరంలోని 25వ డివిజన్లో ఎటుచూసినా సమస్యలే రాజ్యమేలుతున్నాయి. అంతర్గత రహదారులు అస్తవ్యస్తంగా మారడం, కాలువలపై స్లాబులు లేకపోవడం, తాగునీటి కొళాయిల లీకేజీ, పేరుకుపోయిన చెత్త, -
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
[ 07-05-2024]
రాజమహేంద్రవరం ప్రధాన రైల్వేస్టేషన్లో రెండవ నంబరు ప్లాట్ఫామ్ వద్ద సోమవారం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఇక్కడి పట్టాలు(ట్రాక్) సమస్యే దీనికి కారణంగా తెలుస్తుంది. -
చంద్రన్న మాటే మాదిగలకు బాట
[ 07-05-2024]
వైకాపా పాలనలో దళితులను హింసించిన, హత్యలు చేసిన వారిపై కూటమి అధికారంలోకి రాగానే కమిటీ వేసి శిక్షించాలని రాష్ట్ర మాదిగ మహానాడు వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మిట్టా శ్రీకాంత్ కోరారు. -
ప్రశాంతంగా పోస్టల్ బ్యాలట్ ఓటింగ్
[ 07-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వర్తిస్తున్న పీవో, ఏపీవో, ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, ఇతర సిబ్బందికి నిర్వహించిన పోస్టల్ బ్యాలట్ ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగిందని కలెక్టరు మాధవీలత తెలిపారు. -
పెద్దాపురంలో కడప రౌడీలు
[ 07-05-2024]
ఓటమి భయంతో ఉన్న సీఎం జగన్మోహన్రెడ్డి పోలింగ్ ముందు, ఆ రోజు పెద్దాపురం నియోజకవర్గంలో బీభత్సం సృష్టించడానికి కడప నుంచి రౌడీలను రప్పించారని, వారతా వివిధ లాడ్జీల్లో బస చేశారని హోం శాఖ మాజీ మంత్రి, తెదేపా,
తాజా వార్తలు (Latest News)
-
మలయాళంలో రూ.150కోట్లు కొల్లగొట్టిన మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ట్రేడింగ్ సమయం పొడిగింపు ఇప్పట్లో లేనట్లే..!
-
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్ కేసులో సుప్రీం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య